ETV Bharat / bharat

'సూటుబూటు స్నేహితుల కోసమే ఆ ముసాయిదా'

author img

By

Published : Aug 10, 2020, 12:30 PM IST

కేంద్రం తీసుకొచ్చిన పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకోవడమే ముసాయిదా లక్ష్యమని ఆరోపించారు. వనరులను కాజేసే 'స్నేహితుల' కోసమే ఈ ముసాయిదా రూపొందించారని దుయ్యబట్టారు.

EIA 2020 draft's objective is 'loot of the nation', must be withdrawn: Rahul Gandhi
'సూటుబూటు స్నేహితుల కోసమే ఆ ముసాయిదా'

పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2020 పేరిట కేంద్రం తీసుకొస్తున్న ముసాయిదాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకోవడమే ముసాయిదా లక్ష్యమని దుయ్యబట్టారు. ఈ ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • EIA2020 ड्राफ़्ट का मक़सद साफ़ है - #LootOfTheNation

    यह एक और ख़ौफ़नाक उदाहरण है कि भाजपा सरकार देश के संसाधन लूटने वाले चुनिंदा सूट-बूट के ‘मित्रों’ के लिए क्या-क्या करती आ रही है।

    EIA 2020 draft must be withdrawn to stop #LootOfTheNation and environmental destruction.

    — Rahul Gandhi (@RahulGandhi) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈఐఏ-2020 లక్ష్యం స్పష్టంగా ఉంది. అదే... దేశాన్ని దోచుకోవడం. దేశ వనరులను కాజేసిన 'సూటు-బూటు' స్నేహితుల కోసమే భాజపా ప్రభుత్వం ఈ ముసాయిదా తీసుకొచ్చింది. దేశ దోపిడీని, పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే ఈఐఏ-2020 ముసాయిదాను ఉపసంహరించాల్సిందే."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఈ నూతన ముసాయిదాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాహుల్. ముసాయిదాను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దీని వల్ల భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని ఫేస్​బుక్ వేదికగా ఆదివారం పోస్ట్ చేశారు.

"పర్యావరణ పరిరక్షణ పోరులో సంవత్సరాలుగా సాధించిన విజయాలను ముసాయిదా తలకిందులు చేస్తుంది. అంతే కాకుండా.. దేశవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం, అల్లకల్లోలం సృష్టిస్తుంది.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో మార్పు చేయడంలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. ప్రాజెక్టు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువిచ్చారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2020 పేరిట కేంద్రం తీసుకొస్తున్న ముసాయిదాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకోవడమే ముసాయిదా లక్ష్యమని దుయ్యబట్టారు. ఈ ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • EIA2020 ड्राफ़्ट का मक़सद साफ़ है - #LootOfTheNation

    यह एक और ख़ौफ़नाक उदाहरण है कि भाजपा सरकार देश के संसाधन लूटने वाले चुनिंदा सूट-बूट के ‘मित्रों’ के लिए क्या-क्या करती आ रही है।

    EIA 2020 draft must be withdrawn to stop #LootOfTheNation and environmental destruction.

    — Rahul Gandhi (@RahulGandhi) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈఐఏ-2020 లక్ష్యం స్పష్టంగా ఉంది. అదే... దేశాన్ని దోచుకోవడం. దేశ వనరులను కాజేసిన 'సూటు-బూటు' స్నేహితుల కోసమే భాజపా ప్రభుత్వం ఈ ముసాయిదా తీసుకొచ్చింది. దేశ దోపిడీని, పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే ఈఐఏ-2020 ముసాయిదాను ఉపసంహరించాల్సిందే."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఈ నూతన ముసాయిదాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాహుల్. ముసాయిదాను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దీని వల్ల భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని ఫేస్​బుక్ వేదికగా ఆదివారం పోస్ట్ చేశారు.

"పర్యావరణ పరిరక్షణ పోరులో సంవత్సరాలుగా సాధించిన విజయాలను ముసాయిదా తలకిందులు చేస్తుంది. అంతే కాకుండా.. దేశవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం, అల్లకల్లోలం సృష్టిస్తుంది.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో మార్పు చేయడంలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. ప్రాజెక్టు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువిచ్చారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.