ETV Bharat / bharat

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

author img

By

Published : Jun 27, 2020, 12:24 PM IST

Updated : Jun 27, 2020, 3:31 PM IST

ED RAID
కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంట్లో ఈడీ సోదాలు

13:24 June 27

మనీ లాండరింగ్​ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ను ప్రశ్నించారు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు. ఇందుకోసం దిల్లీలోని ఆయన నివాసానికి శనివారం ఉదయం వెళ్లింది ముగ్గురు అధికారుల బృందం.

ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్‌ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య దిల్లీలోని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది.

గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సీబీఏ అక్టోబర్‌ 2017లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నీరవ్‌ మోదీకి సంబంధమున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కంటే సందేసారా సోదరుల కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.

12:21 June 27

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంట్లో ఈడీ సోదాలు

  • కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు
  • సందేశర గ్రూప్‌ కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారుల విచారణ
  • దిల్లీలోని అహ్మద్‌ పటేల్‌ నివాసంలో ఈడీ అధికారుల విచారణ
  • సందేశర గ్రూప్‌ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల  కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు
  • ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈడీ
  • ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు

13:24 June 27

మనీ లాండరింగ్​ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ను ప్రశ్నించారు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు. ఇందుకోసం దిల్లీలోని ఆయన నివాసానికి శనివారం ఉదయం వెళ్లింది ముగ్గురు అధికారుల బృందం.

ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్‌ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య దిల్లీలోని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది.

గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సీబీఏ అక్టోబర్‌ 2017లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నీరవ్‌ మోదీకి సంబంధమున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కంటే సందేసారా సోదరుల కుంభకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.

12:21 June 27

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంట్లో ఈడీ సోదాలు

  • కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు
  • సందేశర గ్రూప్‌ కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారుల విచారణ
  • దిల్లీలోని అహ్మద్‌ పటేల్‌ నివాసంలో ఈడీ అధికారుల విచారణ
  • సందేశర గ్రూప్‌ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల  కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు
  • ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈడీ
  • ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తింపు
Last Updated : Jun 27, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.