ETV Bharat / bharat

''పెరోల్​' హక్కు కాదు.. రాయితీ మాత్రమే' - MHA to states

కరోనా నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను పెరోల్​పై బయటకు పంపే అంశంలో కీలక సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలకు పెరోల్​ ఇవ్వాల్సిన అవసరం లేదని.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. అలాంటి వారు తిరిగి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేసింది. పెరోల్​ హక్కు కాదని, రాయితీ మాత్రమేనని స్పష్టం చేసింది.

Don't grant parole as routine for hardened criminals
కరడుగట్టిన నేరస్థులకు పెరోల్​ ఇవ్వొద్దు
author img

By

Published : Sep 5, 2020, 5:29 AM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను పెరోల్​పై బయటకు పంపేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ఇప్పటికే ఆ దిశగా పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. పెరోల్​ను తమ హక్కుగా ఖైదీలు భావించకూడదని, అది కేవలం రాయితీ మాత్రమేనని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఎంపిక చేసిన ఖైదీలకే పెరోల్​ అర్హత కల్పించాలని సూచించింది. జైలు అనేది నేర వ్యవస్థలో ఒక భాగమని, దిద్దుబాటు పాలనా సంస్థ అని అభివర్ణించింది. రాష్ట్ర భద్రత, పౌరుల రక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందనుకునే కరడుగట్టిన నేరస్థులకు పెరోల్​ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. మోడల్​ జైలు మాన్యువల్​-2016లోని పెరోల్​, ప్రత్యేక సెలవు మార్గదర్శకాలను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీలు, జైళ్లశాఖ ఐజీలకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ.

ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే క్రమంలో శిక్షా సమీక్షా బోర్డు, పెరోల్​ మంజూరు కమిటీ సభ్యులుగా సైకాలజిస్ట్​, క్రిమినాలజిస్ట్​ వంటి నిపుణులను నియమించి, వారి సూచనలు తీసుకోవాలి. మోడల్​ జైలు మాన్యువల్​-2016, హోంశాఖ, ఎన్​హెచ్​ఆర్​సీ, సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ..ఖైదీల పెరోల్​, తాత్కాలిక విడుదలపై ఉన్న పద్ధతులు, విధానాలను సమీక్షించాలి. ప్రతి కేసును జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించటం అవసరం. నేరస్థులకు పెరోల్​ సాధారణంగా మంజూరు చేయొద్దు. లైంగిక నేరాలు, హత్యలు, పిల్లల అపహరణ, హింసకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.

- కేంద్ర హోంశాఖ.

ఖైదీలకు పెరోల్​ వంటి అంశాల్లో తీసుకునే నిర్ణయం చట్టాలను ఉల్లంఘించొద్దని స్పష్టం చేసింది కేంద్ర హోంశాఖ. ప్రతి కేసులో నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎప్పటికప్పుడు హోంశాఖకు నివేదించాలని ఆదేశించింది. పెరోల్​పై విడుదలయ్యే ఖైదీలు తిరిగి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని విధాలుగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను పెరోల్​పై బయటకు పంపేందుకు అనుమతించింది సుప్రీం కోర్టు. ఇప్పటికే ఆ దిశగా పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. పెరోల్​ను తమ హక్కుగా ఖైదీలు భావించకూడదని, అది కేవలం రాయితీ మాత్రమేనని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఎంపిక చేసిన ఖైదీలకే పెరోల్​ అర్హత కల్పించాలని సూచించింది. జైలు అనేది నేర వ్యవస్థలో ఒక భాగమని, దిద్దుబాటు పాలనా సంస్థ అని అభివర్ణించింది. రాష్ట్ర భద్రత, పౌరుల రక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందనుకునే కరడుగట్టిన నేరస్థులకు పెరోల్​ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. మోడల్​ జైలు మాన్యువల్​-2016లోని పెరోల్​, ప్రత్యేక సెలవు మార్గదర్శకాలను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీలు, జైళ్లశాఖ ఐజీలకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ.

ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే క్రమంలో శిక్షా సమీక్షా బోర్డు, పెరోల్​ మంజూరు కమిటీ సభ్యులుగా సైకాలజిస్ట్​, క్రిమినాలజిస్ట్​ వంటి నిపుణులను నియమించి, వారి సూచనలు తీసుకోవాలి. మోడల్​ జైలు మాన్యువల్​-2016, హోంశాఖ, ఎన్​హెచ్​ఆర్​సీ, సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ..ఖైదీల పెరోల్​, తాత్కాలిక విడుదలపై ఉన్న పద్ధతులు, విధానాలను సమీక్షించాలి. ప్రతి కేసును జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించటం అవసరం. నేరస్థులకు పెరోల్​ సాధారణంగా మంజూరు చేయొద్దు. లైంగిక నేరాలు, హత్యలు, పిల్లల అపహరణ, హింసకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.

- కేంద్ర హోంశాఖ.

ఖైదీలకు పెరోల్​ వంటి అంశాల్లో తీసుకునే నిర్ణయం చట్టాలను ఉల్లంఘించొద్దని స్పష్టం చేసింది కేంద్ర హోంశాఖ. ప్రతి కేసులో నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎప్పటికప్పుడు హోంశాఖకు నివేదించాలని ఆదేశించింది. పెరోల్​పై విడుదలయ్యే ఖైదీలు తిరిగి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని విధాలుగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.