ETV Bharat / bharat

నేను రాలేను... మీరే రండి: మెహుల్​ చోక్సీ

పీఎన్​బీ కుంభకోణంలో కీలక నిందితుడు మెహుల్​ చోక్సీ బాంబే హై కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. తాను చికిత్స కోసమే విదేశాలకు వచ్చానని... విచారణ నుంచి తప్పించుకునేందుకు కాదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​కు రాలేనని ముఖం చాటేశారు.

author img

By

Published : Jun 17, 2019, 11:07 PM IST

నేను రాలేను... మీరే రండి: మెహుల్​ చోక్సీ

పీఎన్‌బీ(పంజాబ్​ నేషనల్​ బ్యాంకు) కుంభకోణం కేసులో కీలక నిందితుడు మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు మరోసారి ముఖం చాటేశారు. వైద్య కారణాల దృష్ట్యా తాను ఆంటిగ్వా నుంచి భారత్​కు ప్రయాణించలేనని బాంబే హై కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

పూర్తిగా కోలుకున్నాక గాని భారత్​కు రాలేనన్నారు. అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, ఈడీ అధికారులే ఆంటిగ్వా వచ్చి కానీ తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవచ్చని చోక్సీ అన్నారు.

ఇదీ నేపథ్యం...

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

చోక్సీని 'తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు'గా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

పీఎన్‌బీ(పంజాబ్​ నేషనల్​ బ్యాంకు) కుంభకోణం కేసులో కీలక నిందితుడు మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు మరోసారి ముఖం చాటేశారు. వైద్య కారణాల దృష్ట్యా తాను ఆంటిగ్వా నుంచి భారత్​కు ప్రయాణించలేనని బాంబే హై కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

పూర్తిగా కోలుకున్నాక గాని భారత్​కు రాలేనన్నారు. అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, ఈడీ అధికారులే ఆంటిగ్వా వచ్చి కానీ తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవచ్చని చోక్సీ అన్నారు.

ఇదీ నేపథ్యం...

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

చోక్సీని 'తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు'గా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

New Delhi, Apr 30 (ANI): While addressing at the 55th annual prize distribution ceremony at the Shyam Lal College (SLC) in the national capital, Vice President M Venkaiah Naidu said, "I started my career in 1977 right from university and I went to contest Parliament election from then onwards, there was no looking back. 24*7 I was meeting and greeting people, spending time with them and that has become my regular habit." "Whether in the Parliament, Assembly or in party forums, I was always fully involved but, first time after giving up politics now, I am no more in politics. I do not belong to any party as I have resigned from politics but not retired from public life and that is why I am here today," Venkaiah Naidu added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.