ETV Bharat / bharat

దిల్లీలో ఎన్​కౌంటర్​- నలుగురు నేరస్థులకు గాయాలు

దిల్లీ బేగం ఫుర్​ పోలీస్​​ స్టేషన్​ పరిధిలోని దీప్​ విహార్​ ప్రాంతంలో పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు క్రిమినల్స్​కు గాయాలయ్యాయి. అనంతరం.. వారిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.

author img

By

Published : Oct 8, 2020, 10:21 AM IST

Updated : Oct 8, 2020, 11:41 AM IST

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
దిల్లీలో ఎన్​కౌంటర్​- నేరస్థులకు గాయాలు

దిల్లీలోని బేగం పుర్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు క్రిమినల్స్​కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి సమీపంలోని బాబా సాహెబ్​ అంబేడ్కర్​ ఆసుపత్రికి తరలించారు. నిందితుల నుంచి 6 తుపాకీలు, 3 బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
భారీగా ఆయుధాలు స్వాధీనం

నేరస్థులను... లారెన్స్​ బిష్ణోయ్​ ముఠాకు చెందినవారిగా గుర్తించారు. ప్రత్యర్థి ముఠాపై దాడి చేసేందుకు వెళ్తున్నారన్న సమాచారం అందగా.. ఈ ఆపరేషన్​ చేపట్టినట్లు వివరించారు పోలీసులు.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
నిందితుల నుంచి తుపాకీ లభ్యం

ఉదయం 3.30 గంటల సమయంలో నిందితులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపినట్లు తెలిపారు.

నిందితులందరిపైనా ఇదివరకే.. హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

దిల్లీలోని బేగం పుర్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు క్రిమినల్స్​కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి సమీపంలోని బాబా సాహెబ్​ అంబేడ్కర్​ ఆసుపత్రికి తరలించారు. నిందితుల నుంచి 6 తుపాకీలు, 3 బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
భారీగా ఆయుధాలు స్వాధీనం

నేరస్థులను... లారెన్స్​ బిష్ణోయ్​ ముఠాకు చెందినవారిగా గుర్తించారు. ప్రత్యర్థి ముఠాపై దాడి చేసేందుకు వెళ్తున్నారన్న సమాచారం అందగా.. ఈ ఆపరేషన్​ చేపట్టినట్లు వివరించారు పోలీసులు.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
నిందితుల నుంచి తుపాకీ లభ్యం

ఉదయం 3.30 గంటల సమయంలో నిందితులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపినట్లు తెలిపారు.

నిందితులందరిపైనా ఇదివరకే.. హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 8, 2020, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.