ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు రెండు ప్రత్యేక బృందాల(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసుల దర్యాప్తును నేర విభాగం(క్రైం బ్రాంచ్)కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు డీసీపీ జాయ్ టిర్కీ, రాజేష్ దేవ్ నేతృత్వం వహిస్తారు. ఒక్కో సిట్లో నలుగురు అసిస్టెంట్ కమిషనర్ ర్యాంకు అధికారులు ఉంటారు. ఈ మొత్తం దర్యాప్తును అదనపు పోలీసు కమిషనర్ బి.కె.సింగ్ పర్యవేక్షిస్తారు.
ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది మరణించారు. ఈ వ్యవహారంలో 48 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.
ఇదీ చూడండి: 4జీ రాకతో పెరిగిన స్పీడు.. నెలకు 11జీబీ వాడేస్తున్నాం