ETV Bharat / bharat

కరోనా టీకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం: కేజ్రీవాల్

author img

By

Published : Dec 24, 2020, 5:47 PM IST

కరోనా టీకా వేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీ వాల్​ ప్రకటించారు. వాక్సిన్ నిల్వ సామర్థ్యం తగినంత ఉందని పేర్కొన్నారు. టీకాను తమకిచ్చిన వెంటనే వ్యాక్సినేషన్​ను ప్రారంభిస్తామన్నారు.

Delhi govt all set to receive, store, give vaccine to priority category persons in city: Kejriwal
కరోనా టీకా వేయడానికి తాము సిద్ధం: కేజ్రీవాల్

వ్యాక్సినేషన్‌ మొదటిదశలో భాగంగా 51లక్షలమంది దిల్లీ వాసులకు టీకా వేయనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రాధాన్యతానుసరించి వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు అన్ని సమకూర్చామన్నారు.

‘‘ఆరోగ్య కార్యకర్తలు సహా మొత్తం 51లక్షల మందికి మొదటి దశలో వ్యాక్సిన్‌ అందించనున్నాం. వ్యాక్సిన్‌ ముందుగా ఇవ్వాల్సిన వారి వివరాలను ఇప్పటికే సేకరించాం.’’ అని చెప్పారు కేజ్రీవాల్​. మొదటిదశలో గుర్తించిన వారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికోసం మొత్తం కోటికి పైగా వ్యాక్సిన్‌లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముందుగానే మేసేజ్‌ ద్వారా సమాచారమిస్తామన్నారు. తర్వాత వారు వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 74లక్షల డోసులు నిల్వ చేసే సామర్థ్యమే ఉందన్నారు. ఒక వారంలో దీన్ని కోటి 15లక్షల సామర్థ్యానికి పెంచుతామని కేజ్రీవాల్ అన్నారు. కాగా ప్రస్తుతం దిల్లీ కొవిడ్‌ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ 6,19,618 కేసులు దిల్లీలో నమోదయ్యాయి.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​ పంపిణీ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీలు'

వ్యాక్సినేషన్‌ మొదటిదశలో భాగంగా 51లక్షలమంది దిల్లీ వాసులకు టీకా వేయనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రాధాన్యతానుసరించి వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు అన్ని సమకూర్చామన్నారు.

‘‘ఆరోగ్య కార్యకర్తలు సహా మొత్తం 51లక్షల మందికి మొదటి దశలో వ్యాక్సిన్‌ అందించనున్నాం. వ్యాక్సిన్‌ ముందుగా ఇవ్వాల్సిన వారి వివరాలను ఇప్పటికే సేకరించాం.’’ అని చెప్పారు కేజ్రీవాల్​. మొదటిదశలో గుర్తించిన వారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికోసం మొత్తం కోటికి పైగా వ్యాక్సిన్‌లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ముందుగానే మేసేజ్‌ ద్వారా సమాచారమిస్తామన్నారు. తర్వాత వారు వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 74లక్షల డోసులు నిల్వ చేసే సామర్థ్యమే ఉందన్నారు. ఒక వారంలో దీన్ని కోటి 15లక్షల సామర్థ్యానికి పెంచుతామని కేజ్రీవాల్ అన్నారు. కాగా ప్రస్తుతం దిల్లీ కొవిడ్‌ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ 6,19,618 కేసులు దిల్లీలో నమోదయ్యాయి.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​ పంపిణీ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.