ETV Bharat / bharat

దిల్లీలో కొత్తరకం వైరస్​ అనుమానిత కేసు

author img

By

Published : Dec 23, 2020, 8:01 PM IST

దిల్లీలో కొత్తరకం కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. గతకొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుతున్న దేశ రాజధానిలో ఈ వార్త దిల్లీ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది.

del_ndl_01_new_covid_strain_suspect_in_delhi_vis_7205761
దిల్లీలో కొత్తరకం కరోనా అనుమానిత కేసు

కొత్తరకం కరోనా అనుమానిత లక్షణాలతో దిల్లీలోని లోక్​నాయక్​ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చేరాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆసుపత్రి మెడికల్​ డైరెక్టర్​ డాక్టర్ సురేశ్​ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తి నుంచి నమునాలు సేకరించి, పరీక్షలకు పంపించిన్నట్లు వెల్లడించారు. రెండు, మూడు రోజులలో రిపోర్టులు వస్తాయన్నారు. అతడిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు.

అయితే ఇంగ్లాండ్​ నుంచి ఈ మధ్యే అతడు భారత్​ కు వచ్చాడు. గత కొద్ది రోజులుగా దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమయంలో కొత్తరకం కరోనా అనుమానిత కేసు వెలుగు చూడటం స్థానికంగా భయాందోళనలను కలిగిస్తోంది.

కొత్తరకం కరోనా అనుమానిత లక్షణాలతో దిల్లీలోని లోక్​నాయక్​ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చేరాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆసుపత్రి మెడికల్​ డైరెక్టర్​ డాక్టర్ సురేశ్​ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తి నుంచి నమునాలు సేకరించి, పరీక్షలకు పంపించిన్నట్లు వెల్లడించారు. రెండు, మూడు రోజులలో రిపోర్టులు వస్తాయన్నారు. అతడిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు.

అయితే ఇంగ్లాండ్​ నుంచి ఈ మధ్యే అతడు భారత్​ కు వచ్చాడు. గత కొద్ది రోజులుగా దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమయంలో కొత్తరకం కరోనా అనుమానిత కేసు వెలుగు చూడటం స్థానికంగా భయాందోళనలను కలిగిస్తోంది.

ఇదీ చూడండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.