ETV Bharat / bharat

దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 18,552 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 384 మంది కరోనా కాటుకు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

author img

By

Published : Jun 27, 2020, 9:29 AM IST

Updated : Jun 27, 2020, 9:40 AM IST

DAILY CORONA VIRUS UPDATES
దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 18,552 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 384 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

CORONA VIRUS UPDATES
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,52,765కు చేరింది. 7,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 79,815 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 74,622కు చేరింది. 957 మంది మృతి చెందారు. 41,357 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కేసుల సంఖ్య 77,240కి చేరింది. మొత్తం 2,492 మంది ప్రాణాలు కోల్పోయారు. 47,091 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 27,657 మంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 30,095కు చేరింది. ఇప్పటివరకు 1,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,294 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 18,552 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 384 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

CORONA VIRUS UPDATES
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,52,765కు చేరింది. 7,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 79,815 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 74,622కు చేరింది. 957 మంది మృతి చెందారు. 41,357 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కేసుల సంఖ్య 77,240కి చేరింది. మొత్తం 2,492 మంది ప్రాణాలు కోల్పోయారు. 47,091 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 27,657 మంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 30,095కు చేరింది. ఇప్పటివరకు 1,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,294 మంది చికిత్స పొందుతున్నారు.
Last Updated : Jun 27, 2020, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.