ETV Bharat / bharat

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,977 కేసులు, 154 మరణాలు

author img

By

Published : May 25, 2020, 9:11 AM IST

Updated : May 25, 2020, 11:36 AM IST

దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్​ 10వ స్థానానికి ఎగబాకింది.

DAILY CORONA VIRUS UPDATES
భారత్​లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రికార్డు స్థాయిలో 6,977 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే దేశంలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్​... ఇరాన్​ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో 10వ స్థానానికి చేరింది.

DAILY CORONA VIRUS UPDATES
ఒక్కరోజులో రికార్డ్​ స్థాయిలో 6,977 కేసులు, 154 మరణాలు

రాష్ట్రాల వారీగా..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, కొత్తగా నమోదైన 154 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 58, దిల్లీ- 30, గుజరాత్- 29, మధ్యప్రదేశ్​- 9, తమిళనాడు- 8, ఉత్తర్​ప్రదేశ్​- 6, తెలంగాణ- 4, రాజస్థాన్​- 3, బంగాల్​- 3, బిహార్​- 2, పంజాబ్​- 1, ఉత్తరాఖండ్​- 1 చొప్పున సంభవించాయి.

ఇప్పటివరకు 41.57 శాతం మంది కరోనా అంటువ్యాధి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

భారత్​లో కరోనా డెత్ టోల్​

ఇదీ చూడండి: నింగిలోకి విమానాలు- దేశీయ సర్వీసులు షురూ

దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రికార్డు స్థాయిలో 6,977 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే దేశంలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్​... ఇరాన్​ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో 10వ స్థానానికి చేరింది.

DAILY CORONA VIRUS UPDATES
ఒక్కరోజులో రికార్డ్​ స్థాయిలో 6,977 కేసులు, 154 మరణాలు

రాష్ట్రాల వారీగా..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, కొత్తగా నమోదైన 154 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 58, దిల్లీ- 30, గుజరాత్- 29, మధ్యప్రదేశ్​- 9, తమిళనాడు- 8, ఉత్తర్​ప్రదేశ్​- 6, తెలంగాణ- 4, రాజస్థాన్​- 3, బంగాల్​- 3, బిహార్​- 2, పంజాబ్​- 1, ఉత్తరాఖండ్​- 1 చొప్పున సంభవించాయి.

ఇప్పటివరకు 41.57 శాతం మంది కరోనా అంటువ్యాధి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

భారత్​లో కరోనా డెత్ టోల్​

ఇదీ చూడండి: నింగిలోకి విమానాలు- దేశీయ సర్వీసులు షురూ

Last Updated : May 25, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.