ETV Bharat / bharat

తుపానును ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం!

author img

By

Published : May 20, 2020, 12:13 AM IST

తీరం వైపు కదులుతున్న అంపన్​ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర విద్యుద్ శాఖ సహా ఒడిశా, బంగాల్​ తీరంలో ఉన్న కీలక సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. హల్దియా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ రిఫైనరీ సంస్థలు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపాయి.

amphan
అంపన్

అంపన్ తుపాను బంగాల్​ తీరంవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. తూర్పు మిదనాపుర్​లోని హల్దియా పెట్రోకెమికల్స్, ఇండియన్ ఆయిల్ రిఫైనరీ సంస్థలను అప్రమత్తం చేశారు.

తుపాను నేపథ్యంలో హల్దియా పెట్రోకెమికల్స్​ లిమిటెడ్​లో పలు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. పవర్​ గ్రిడ్​ నుంచి విద్యుత్​ను తీసుకోవడం ఆపేసినట్లు స్పష్టం చేశారు. అదనపు కంప్రెసర్లు, కూలింగ్ వాటర్ యూనిట్లను ప్రత్యేకంగా నడపనున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం సిబ్బంది మినహా ప్లాంట్​లో ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.

ఇండియన్ ఆయిల్

పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కంట్రోల్​ రూంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఆయిల్ అధికారులు తెలిపారు. జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

విద్యుత్ శాఖ

మరోవైపు అంపన్​ తుపానును ఎదుర్కొనేందుకు తగిన కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ సరఫరాను చక్కదిద్దడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. భువనేశ్వర్, కోల్​కతాలో ఉన్న పీజీసీఐఎల్, ఎన్​టీపీసీలు.. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

సురక్షిత ప్రాంతాలకు 20 లక్షల మంది

తుపాను ప్రభావం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్​లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు ఆ దేశ అధికారులు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 20 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12,078 షెల్టర్​ హోంలకు పంపించాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ. మంగళవారం అర్ధరాత్రిలోపు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేయగా.. అది వీలుకాదని అధికారులు తెలిపినట్లు సమాచారం.

ఇదీ చదవండి: బలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు

అంపన్ తుపాను బంగాల్​ తీరంవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. తూర్పు మిదనాపుర్​లోని హల్దియా పెట్రోకెమికల్స్, ఇండియన్ ఆయిల్ రిఫైనరీ సంస్థలను అప్రమత్తం చేశారు.

తుపాను నేపథ్యంలో హల్దియా పెట్రోకెమికల్స్​ లిమిటెడ్​లో పలు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. పవర్​ గ్రిడ్​ నుంచి విద్యుత్​ను తీసుకోవడం ఆపేసినట్లు స్పష్టం చేశారు. అదనపు కంప్రెసర్లు, కూలింగ్ వాటర్ యూనిట్లను ప్రత్యేకంగా నడపనున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం సిబ్బంది మినహా ప్లాంట్​లో ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.

ఇండియన్ ఆయిల్

పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కంట్రోల్​ రూంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఆయిల్ అధికారులు తెలిపారు. జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

విద్యుత్ శాఖ

మరోవైపు అంపన్​ తుపానును ఎదుర్కొనేందుకు తగిన కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ సరఫరాను చక్కదిద్దడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. భువనేశ్వర్, కోల్​కతాలో ఉన్న పీజీసీఐఎల్, ఎన్​టీపీసీలు.. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

సురక్షిత ప్రాంతాలకు 20 లక్షల మంది

తుపాను ప్రభావం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్​లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు ఆ దేశ అధికారులు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 20 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12,078 షెల్టర్​ హోంలకు పంపించాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ. మంగళవారం అర్ధరాత్రిలోపు తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేయగా.. అది వీలుకాదని అధికారులు తెలిపినట్లు సమాచారం.

ఇదీ చదవండి: బలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.