ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 69,239 కేసులు నమోదు కాగా.. మరో 912 మంది కొవిడ్​కు బలయ్యారు.

author img

By

Published : Aug 23, 2020, 9:33 AM IST

Updated : Aug 23, 2020, 11:40 AM IST

COVID-19 news from across the nation
దేశవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 912 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు 30 లక్షల మార్క్​ను దాటాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 74.90 శాతం ఉండగా.. మరణాల రేటు 1.86 శాతానికి తగ్గింది. అలాగే యాక్టివ్​ కేసుల రేటు 23.24 శాతంగా ఉంది.

COVID-19 news from across the nation
కరోనా వివరాలు

తాజాగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,61,942కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 297 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 21,995కు పెరిగింది.

  • తమిళనాడులో 5వేల 980మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 3లక్షల 73వేల 410కి చేరాయి.
  • దిల్లీలో కొత్తగా 1,412 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 60వేల 16మంది కరోనా బారినపడ్డారు.
  • కేరళలో శనివారం 2 వేల 172 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 56,354కు పెరిగింది.
    COVID-19 news from across the nation
    రాష్ట్రాల వారీగా
  • ఆగస్టు 22 వరకు దేశవ్యాప్తంగా 3, కోట్ల 52 లక్షల 92 వేల 220 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 8,01,147 టెస్టులు చేసినట్లు పేర్కొంది.

దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 912 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు 30 లక్షల మార్క్​ను దాటాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 74.90 శాతం ఉండగా.. మరణాల రేటు 1.86 శాతానికి తగ్గింది. అలాగే యాక్టివ్​ కేసుల రేటు 23.24 శాతంగా ఉంది.

COVID-19 news from across the nation
కరోనా వివరాలు

తాజాగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,61,942కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 297 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 21,995కు పెరిగింది.

  • తమిళనాడులో 5వేల 980మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 3లక్షల 73వేల 410కి చేరాయి.
  • దిల్లీలో కొత్తగా 1,412 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 60వేల 16మంది కరోనా బారినపడ్డారు.
  • కేరళలో శనివారం 2 వేల 172 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 56,354కు పెరిగింది.
    COVID-19 news from across the nation
    రాష్ట్రాల వారీగా
  • ఆగస్టు 22 వరకు దేశవ్యాప్తంగా 3, కోట్ల 52 లక్షల 92 వేల 220 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 8,01,147 టెస్టులు చేసినట్లు పేర్కొంది.
Last Updated : Aug 23, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.