ETV Bharat / bharat

'మహా' కల్లోలం: రికార్డ్​ స్థాయిలో 18,105 కేసులు

author img

By

Published : Sep 3, 2020, 9:08 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో తాజాగా రికార్డ్ స్థాయిలో 18,105 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 8 వేల 800లకు పైగా కేసులు నమోదవగా... 104మంది ప్రాణాలుకోల్పోయారు. తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Covid-19 new cases and deaths in the nation
కర్ణాటకలో కరోనా కల్లోలం- దిల్లీలో మళ్లీ పెరిగిన కేసులు

దేశంలో మహమ్మారి కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో తాజాగా 18,105 కేసులు నిర్ధరణయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 391 మంది కొవిడ్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,43,844కి చేరింది.

కర్ణాటకలో...

కర్ణాటకలో భారీ సంఖ్యలో వైరస్​ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 8,865 కేసులు బయటపడ్డాయి. మరో 104 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 70 వేలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 68 వేల మంది కోలుకున్నారు.

కేసుల కంటే రికవరీ అధికంగా

తమిళనాడులో విపరీతంగా కరోనా కేసులు పెరగుతున్నప్పటికీ... రికవరీలు అదే స్థాయిలో ఉన్నాయి. కొత్తగా 5,892 మంది కొవిడ్​ బారిన పడగా.. 92 మృత్యువాత పడ్డారు. అయితే ఇవాళ ఒక్కరోజే 6,110 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

వైరస్​ విలయతాండవం..

ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 5,776 మందికి వైరస్ సోకింది. మరో 76 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 2 లక్షల 47 వేలు దాటింది.

రాష్ట్రంకొత్త కేసులు
దిల్లీ2,737
పంజాబ్​1,527
గుజరాత్​1,325
జమ్ముకశ్మీర్​1,079
ఉత్తరాఖండ్​946
గోవా713

ఇదీ చూడండి: 70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే

దేశంలో మహమ్మారి కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో తాజాగా 18,105 కేసులు నిర్ధరణయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 391 మంది కొవిడ్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,43,844కి చేరింది.

కర్ణాటకలో...

కర్ణాటకలో భారీ సంఖ్యలో వైరస్​ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 8,865 కేసులు బయటపడ్డాయి. మరో 104 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 70 వేలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 68 వేల మంది కోలుకున్నారు.

కేసుల కంటే రికవరీ అధికంగా

తమిళనాడులో విపరీతంగా కరోనా కేసులు పెరగుతున్నప్పటికీ... రికవరీలు అదే స్థాయిలో ఉన్నాయి. కొత్తగా 5,892 మంది కొవిడ్​ బారిన పడగా.. 92 మృత్యువాత పడ్డారు. అయితే ఇవాళ ఒక్కరోజే 6,110 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

వైరస్​ విలయతాండవం..

ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 5,776 మందికి వైరస్ సోకింది. మరో 76 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 2 లక్షల 47 వేలు దాటింది.

రాష్ట్రంకొత్త కేసులు
దిల్లీ2,737
పంజాబ్​1,527
గుజరాత్​1,325
జమ్ముకశ్మీర్​1,079
ఉత్తరాఖండ్​946
గోవా713

ఇదీ చూడండి: 70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.