ETV Bharat / bharat

ఇకపై వారందరికీ పార్లమెంట్​ ప్రవేశం నిషేధం

author img

By

Published : Jun 4, 2020, 10:56 PM IST

పార్లమెంట్​లోకి ఎంపీల పీఏలు, విశ్రాంత అధికారులు, అతిథుల ప్రవేశాన్ని నిషేధిస్తూ లోక్​సభ సెక్రటేరియట్​ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది.

COVID-19: LS Secretariat restricts entry of personal staff of MPs inside Parliament
ఇకపై పార్లమెంట్​లోకి వారందరి ప్రవేశం నిషేధం

కరోనా విజృంభణ నేపథ్యంలో లోక్​సభ సెక్రటేరియట్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి పార్లమెంట్​ ప్రవేశాన్ని నిషేధించింది. సభా సమావేశాల సందర్భంలో ఎంపీలకు చెందిన 800మందికిపైగా పీఏలు ఉంటే కరోనా విజృంభించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని లోక్​సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాత్సవ పేర్కొన్నారు.

"భౌతిక దూరం నిబంధనను దృష్టిలో పెట్టుకుని, ఎంపీలకు చెందిన పీఏలను పార్లమెంట్​లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశాం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది."

--- లోక్​సభ సెక్రటేరియట్​

దీనితో పాటు విశ్రాంత అధికారులు, వ్యక్తిగత అతిథులు, అధికారుల కోసం వచ్చే(సెక్రటరీ స్థాయి కన్నా తక్కువ) వారిని పార్లమెంట్​లోకి నిషేధించింది లోక్​సభ సెక్రటేరియట్​.

మే 3 తర్వాత పార్లమెంట్​ కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నలుగురు అధికారులకు కరోనా వైరస్​ సోకినట్టు నిర్థరణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే లోక్​సభ సెక్రటేరియట్​ తాజా ఆదేశాలు జారీ చేసింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో లోక్​సభ సెక్రటేరియట్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి పార్లమెంట్​ ప్రవేశాన్ని నిషేధించింది. సభా సమావేశాల సందర్భంలో ఎంపీలకు చెందిన 800మందికిపైగా పీఏలు ఉంటే కరోనా విజృంభించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని లోక్​సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాత్సవ పేర్కొన్నారు.

"భౌతిక దూరం నిబంధనను దృష్టిలో పెట్టుకుని, ఎంపీలకు చెందిన పీఏలను పార్లమెంట్​లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశాం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది."

--- లోక్​సభ సెక్రటేరియట్​

దీనితో పాటు విశ్రాంత అధికారులు, వ్యక్తిగత అతిథులు, అధికారుల కోసం వచ్చే(సెక్రటరీ స్థాయి కన్నా తక్కువ) వారిని పార్లమెంట్​లోకి నిషేధించింది లోక్​సభ సెక్రటేరియట్​.

మే 3 తర్వాత పార్లమెంట్​ కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నలుగురు అధికారులకు కరోనా వైరస్​ సోకినట్టు నిర్థరణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే లోక్​సభ సెక్రటేరియట్​ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.