ETV Bharat / bharat

భారత్​లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!

author img

By

Published : May 27, 2020, 6:18 PM IST

కరోనా మహమ్మారి భారత్​లో ఇంకా తీవ్ర రూపం దాల్చలేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జులై మొదట్లో వైరస్​ ఉగ్రరూపం ఉంటుందని, మొత్తం 18వేల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఆసియా దేశాల్లో మాత్రం మరణాల రేటు చాలా తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

Covid-19 deaths could top
Covid-19 deaths could top 18,000 in India, says public health expert

కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కేసులు సంఖ్య క్రమక్రమంగా తగ్గింది. ప్రభుత్వాలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తుండగా... సాధారణ జీవనం సాగించడం సిద్ధమవుతున్నారు ప్రజలు. మహమ్మారి ముప్పును దాదాపు అధిగమించారు. అయితే భారత్​లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే పలు లాక్​డౌన్​ అంక్షలను ఎత్తివేసింది కేంద్రం. ఆర్థిక కార్యకలాపాలు, రైలు, విమాన ప్రయాణాలు పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో భారత్​లో పరిస్థితిపై ఆందోళనకర విషయాలు చెబుతున్నారు నిపుణులు.

భారత్​లో జులై మొదట్లో కరోనా అత్యంత తీవ్ర రూపం దాల్చుతుందని, మరణాల సంఖ్య 18వేలకు చేరుతుందని అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు, సెంట్రల్​ ఫర్​ కంట్రోల్ ఆఫ్​ క్రోనిక్​ కండిషన్స్​(సీసీసీసీ) ప్రొఫెసర్​ డా.ప్రభాకరన్. ఇతర దేశాల్లో కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభించి, ఆ తర్వాత అదుపులోకి వచ్చిందనే అధ్యయనాలను పరిశీలించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

6 లక్షల కేసులు..

జులైలో భారత్​లో మొత్తం కేసుల సంఖ్య 4 నుంచి 6 లక్షలకు చేరుతుందని, 12నుంచి 18వేల మంది మరణించే అవకాశాలున్నాయని చెప్పారు అమెరికా ఎమోరీ యూనివర్సిటీ నిపుణులు. సగటు మరణాల రేటును పరిశీలించే ఈ గణాంకాలు అంచనా వేసినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్​లో మరణాల రేటు తక్కువగా ఉందని, వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.

ఆసియా దేశాల్లోనే తక్కువ..

ఆసియా దేశాల్లోనే కరోనా మరణాల రేటు శ్రీలంకలో చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు ఆరోగ్య నిపుణులు, ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్(హైదరాబాద్​) డైరెక్టర్​ ప్రొఫెసర్​ జీవీఎస్ మూర్తి. ఆ దేశంలో 10లక్షల మందిలో 0.4శాతమే మరణిస్తున్నారని తెలిపారు. భారత్​, సింగపూర్​, పాకిస్థాన్, బంగ్లాదేశ్​, మలేసియా దేశాల్లోనూ మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం చెప్పడం క్లిష్టమన్నారు.

ఆసియా దేశాల్లో లాక్​డౌన్ త్వరగా విధించారని... అందుకే అమెరికా, ఇటలీ దేశాల స్థాయిలో వైరస్​ వ్యాప్తి చెందలేదని వివరించారు మూర్తి. ప్రపంచం, భారత్​లో లభించిన ఆధారాల ప్రకారం 60ఏళ్లు పైబడిన వారే వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. భారత్​లో కరోనా సోకి మరణించిన వారిలో 50 శాతానికిపైగా వృద్ధులే ఉన్నారని చెప్పారు.

అమెరికాలో 22.4శాతం, బ్రిటన్​లో 24.12 శాతం, ఇటలీలో 29.4 శాతం వృద్ధులు ఉండగా భారత్​లో అది 9.9 శాతమే అన్నారు. లాక్​డౌన్ త్వరగా విధించడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలున్న అనేక మందికి వైరస్​ వ్యాప్తి చెందలేదని, అందుకే మరణాల రేటు తక్కువగా ఉందని వివరించారు.

వచ్చే 15 రోజుల్లో డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని మూర్తి హెచ్చరించారు. పరిశుభ్రత, స్వీయ రక్షణే వైరస్​ కట్టడికి ఆరోగ్య సూత్రాలని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కేసులు సంఖ్య క్రమక్రమంగా తగ్గింది. ప్రభుత్వాలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తుండగా... సాధారణ జీవనం సాగించడం సిద్ధమవుతున్నారు ప్రజలు. మహమ్మారి ముప్పును దాదాపు అధిగమించారు. అయితే భారత్​లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే పలు లాక్​డౌన్​ అంక్షలను ఎత్తివేసింది కేంద్రం. ఆర్థిక కార్యకలాపాలు, రైలు, విమాన ప్రయాణాలు పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో భారత్​లో పరిస్థితిపై ఆందోళనకర విషయాలు చెబుతున్నారు నిపుణులు.

భారత్​లో జులై మొదట్లో కరోనా అత్యంత తీవ్ర రూపం దాల్చుతుందని, మరణాల సంఖ్య 18వేలకు చేరుతుందని అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు, సెంట్రల్​ ఫర్​ కంట్రోల్ ఆఫ్​ క్రోనిక్​ కండిషన్స్​(సీసీసీసీ) ప్రొఫెసర్​ డా.ప్రభాకరన్. ఇతర దేశాల్లో కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభించి, ఆ తర్వాత అదుపులోకి వచ్చిందనే అధ్యయనాలను పరిశీలించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

6 లక్షల కేసులు..

జులైలో భారత్​లో మొత్తం కేసుల సంఖ్య 4 నుంచి 6 లక్షలకు చేరుతుందని, 12నుంచి 18వేల మంది మరణించే అవకాశాలున్నాయని చెప్పారు అమెరికా ఎమోరీ యూనివర్సిటీ నిపుణులు. సగటు మరణాల రేటును పరిశీలించే ఈ గణాంకాలు అంచనా వేసినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్​లో మరణాల రేటు తక్కువగా ఉందని, వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.

ఆసియా దేశాల్లోనే తక్కువ..

ఆసియా దేశాల్లోనే కరోనా మరణాల రేటు శ్రీలంకలో చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు ఆరోగ్య నిపుణులు, ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్(హైదరాబాద్​) డైరెక్టర్​ ప్రొఫెసర్​ జీవీఎస్ మూర్తి. ఆ దేశంలో 10లక్షల మందిలో 0.4శాతమే మరణిస్తున్నారని తెలిపారు. భారత్​, సింగపూర్​, పాకిస్థాన్, బంగ్లాదేశ్​, మలేసియా దేశాల్లోనూ మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం చెప్పడం క్లిష్టమన్నారు.

ఆసియా దేశాల్లో లాక్​డౌన్ త్వరగా విధించారని... అందుకే అమెరికా, ఇటలీ దేశాల స్థాయిలో వైరస్​ వ్యాప్తి చెందలేదని వివరించారు మూర్తి. ప్రపంచం, భారత్​లో లభించిన ఆధారాల ప్రకారం 60ఏళ్లు పైబడిన వారే వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. భారత్​లో కరోనా సోకి మరణించిన వారిలో 50 శాతానికిపైగా వృద్ధులే ఉన్నారని చెప్పారు.

అమెరికాలో 22.4శాతం, బ్రిటన్​లో 24.12 శాతం, ఇటలీలో 29.4 శాతం వృద్ధులు ఉండగా భారత్​లో అది 9.9 శాతమే అన్నారు. లాక్​డౌన్ త్వరగా విధించడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలున్న అనేక మందికి వైరస్​ వ్యాప్తి చెందలేదని, అందుకే మరణాల రేటు తక్కువగా ఉందని వివరించారు.

వచ్చే 15 రోజుల్లో డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని మూర్తి హెచ్చరించారు. పరిశుభ్రత, స్వీయ రక్షణే వైరస్​ కట్టడికి ఆరోగ్య సూత్రాలని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.