ETV Bharat / bharat

హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

author img

By

Published : May 9, 2020, 3:51 PM IST

కరోనా లాక్​డౌన్​తో శుభకార్యాలు చాలావరకు వాయిదా పడ్డాయి. కొన్ని మాత్రం అధికారుల అనుమతులతో జరుగుతున్నాయి. ఇలానే జరిగింది ఓ వివాహం. కానీ... అంతా బాగుందనుకునేలోపే నవ జంటను క్వారంటైన్​కు తరలించి, నిరాశకు గురిచేశారు అధికారులు.

marriage
హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

కొత్తగా పెళ్లయిన వారు ఏం చేస్తారు? హనీమూన్​కు వెళ్తారు. లేదంటే... ఇంట్లోనే సరదాగా గడుపుతారు. కానీ... ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆ జంటను మాత్రం క్వారంటైన్​కు తరలించారు అధికారులు.

పెళ్లయిన కొద్ది గంటలకే...

కొరియా జిల్లా మనేంద్రగఢ్​కు చెందిన సుశీల్​ గుప్తాకు, మధ్యప్రదేశ్​ నౌరోజాబాద్​కు చెందిన యువతికి పెళ్లి నిశ్చయం అయింది. కరోనా ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో వివాహం కోసం అధికారుల అనుమతి తీసుకుని తల్లితో కలిసి వధువు ఇంటికి వెళ్లాడు సుశీల్.

మధ్యప్రదేశ్​ నౌరోజాబాద్​లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి వస్త్రధారణతో అత్తారింటి నుంచి స్వగ్రామానికి బయల్దేరింది నవజంట. కాసేపట్లో స్వగృహానికి చేరుకుంటుంది. అంతలోనే ఎదురుగా వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం.. వారిని పట్టణంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిర్బంధంలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. నవ దంపతుల్ని క్వారంటైన్​ కేంద్రానికి తరలించింది.

'నిర్బంధానికి రెడీ అన్నా...'

పెళ్లి తంతు పూర్తయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని.. తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను కోరింది సుశీల్​ పరివారం. గృహ నిర్బంధంలో ఉంటామని భరోసా ఇచ్చింది. అయినా అధికారులు మాట వినలేదు. అందరినీ క్వారంటైన్​కు తరలించారు.

కుటుంబ పెద్ద మరో రాష్ట్రంలో..

వరుడి తండ్రి ఉత్తర్​ప్రదేశ్​లో చిక్కుకుపోయాడు. పెళ్లికి బంధువులను పిలిచేందుకు వెళ్లి లాక్​డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు.

హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

ఇదీ చూడండి: ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!

కొత్తగా పెళ్లయిన వారు ఏం చేస్తారు? హనీమూన్​కు వెళ్తారు. లేదంటే... ఇంట్లోనే సరదాగా గడుపుతారు. కానీ... ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆ జంటను మాత్రం క్వారంటైన్​కు తరలించారు అధికారులు.

పెళ్లయిన కొద్ది గంటలకే...

కొరియా జిల్లా మనేంద్రగఢ్​కు చెందిన సుశీల్​ గుప్తాకు, మధ్యప్రదేశ్​ నౌరోజాబాద్​కు చెందిన యువతికి పెళ్లి నిశ్చయం అయింది. కరోనా ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో వివాహం కోసం అధికారుల అనుమతి తీసుకుని తల్లితో కలిసి వధువు ఇంటికి వెళ్లాడు సుశీల్.

మధ్యప్రదేశ్​ నౌరోజాబాద్​లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి వస్త్రధారణతో అత్తారింటి నుంచి స్వగ్రామానికి బయల్దేరింది నవజంట. కాసేపట్లో స్వగృహానికి చేరుకుంటుంది. అంతలోనే ఎదురుగా వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం.. వారిని పట్టణంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిర్బంధంలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. నవ దంపతుల్ని క్వారంటైన్​ కేంద్రానికి తరలించింది.

'నిర్బంధానికి రెడీ అన్నా...'

పెళ్లి తంతు పూర్తయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని.. తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను కోరింది సుశీల్​ పరివారం. గృహ నిర్బంధంలో ఉంటామని భరోసా ఇచ్చింది. అయినా అధికారులు మాట వినలేదు. అందరినీ క్వారంటైన్​కు తరలించారు.

కుటుంబ పెద్ద మరో రాష్ట్రంలో..

వరుడి తండ్రి ఉత్తర్​ప్రదేశ్​లో చిక్కుకుపోయాడు. పెళ్లికి బంధువులను పిలిచేందుకు వెళ్లి లాక్​డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు.

హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

ఇదీ చూడండి: ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.