దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. జైళ్లలో రద్దీ తగ్గించేందుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తున్నాయి.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 37 జైళ్ల నుంచి 601 మంది ఖైధీలను ప్రత్యేక పెరోల్పై విడుదల చేసింది. ఈ విషయాన్ని డీజీపీ సునీల్ రామానంద్ వెల్లడించారు.
బంగాల్లో...
ఖైదీల విడుదలకు బంగాల్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 3వేల ఖైదీలను పెరోల్పై విడుదల చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.
కరోనా సంక్షోభం దృష్ట్యా ఇప్పటికే అనేక రాష్ట్రాలు వేల మంది ఖైదీలను విడుదల చేశాయి.
ఇదీ చూడండి : కరోనా సూట్లో మంత్రి వినూత్న ప్రచారం