ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: ఇటలీ నుంచి దిల్లీకి 263 మంది విద్యార్థులు - Coronavirus: 263 Indians evacuated from Italy sent to ITBP quarantine

కరోనా తీవ్ర ప్రభావిత దేశమైన ఇటలీ నుంచి 263మంది భారతీయ విద్యార్థులతో బయల్దేరిన ప్రత్యేక విమానం దిల్లీకి చేరుకుంది. విమానంలో వచ్చిన వారందరినీ దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించారు అధికారులు. వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

italy
దిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం- ఐటీబీపీ శిబిరానికి తరలింపు
author img

By

Published : Mar 22, 2020, 12:02 PM IST

కరోనా ప్రభావిత దేశం ఇటలీ నుంచి 263మంది భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చారు. వీరిని దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

italy
ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు

"ఇటలీ నుంచి నేటి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానం భారత్​కు చేరుకుంది. ఈ విమానంలో వచ్చిన 263మంది విద్యార్థులను ప్రత్యేక శిబిరానికి తరలించాం."

-ఐటీబీపీ అధికారులు

కీలకంగా ఐటీబీపీ శిబిరం..

వైరస్​ సేవల్లో దిల్లీ ఐటీబీపీ శిబిరం కీలకంగా పనిచేస్తోంది. మార్చి 15న ఇటలీ నుంచి వచ్చిన 215మంది భారతీయులు ఇప్పటికే ఐటీబీపీ శిబిరంలో వైద్య పరిశీలనలో ఉన్నారు. ఇంతకుముందు చైనా వుహాన్​ నుంచి వచ్చిన రెండు బృందాలకు కూడా ఈ శిబిరంలోనే వైద్య పరిశీలనలో ఉంచి నెగటివ్​గా తేలినవారిని ఇంటికి పంపించారు.

italy
ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు

ఇదీ చూడండి: దేశంలో కరోనాకు మరొకరు బలి- మొత్తం 324 పాజిటివ్ కేసులు

కరోనా ప్రభావిత దేశం ఇటలీ నుంచి 263మంది భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చారు. వీరిని దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

italy
ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు

"ఇటలీ నుంచి నేటి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానం భారత్​కు చేరుకుంది. ఈ విమానంలో వచ్చిన 263మంది విద్యార్థులను ప్రత్యేక శిబిరానికి తరలించాం."

-ఐటీబీపీ అధికారులు

కీలకంగా ఐటీబీపీ శిబిరం..

వైరస్​ సేవల్లో దిల్లీ ఐటీబీపీ శిబిరం కీలకంగా పనిచేస్తోంది. మార్చి 15న ఇటలీ నుంచి వచ్చిన 215మంది భారతీయులు ఇప్పటికే ఐటీబీపీ శిబిరంలో వైద్య పరిశీలనలో ఉన్నారు. ఇంతకుముందు చైనా వుహాన్​ నుంచి వచ్చిన రెండు బృందాలకు కూడా ఈ శిబిరంలోనే వైద్య పరిశీలనలో ఉంచి నెగటివ్​గా తేలినవారిని ఇంటికి పంపించారు.

italy
ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు

ఇదీ చూడండి: దేశంలో కరోనాకు మరొకరు బలి- మొత్తం 324 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.