ETV Bharat / bharat

దశ దిశలా వ్యాపిస్తున్న కొవిడ్‌.. విలవిల్లాడుతున్న ప్రపంచం

author img

By

Published : May 1, 2020, 8:22 AM IST

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే.. 2 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 32 లక్షలు దాటింది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈనేపథ్యంలో ప్రపంచంతో పాటు భారత్ లో కరోనా ప్రభావం ఏ రీతిలో ఉందో చూద్దాం.

Corona
దశ దిశలా కొవిడ్‌

కరోనా కోరల్లో ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. 200లకు పైగా దేశాల్లో 33 లక్షలకు పైగా కేసులు.. 2 లక్షలు దాటిపోయిన మరణాలు.. రూ.లక్షల కోట్లలో ఆర్థిక నష్టం.. ఇలా కొవిడ్‌ భారీగా కల్లోలం రేపుతోంది. ప్రపంచంలో, భారత్‌లో మహమ్మారి ఏ రీతిలో ప్రభావం చూపుతోందో గణాంకాల్లో చూస్తే..

ప్రపంచంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదైన దేశం అమెరికా. 10.64 లక్షలకు పైగా కేసులు నమోదవగా, 63 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్​ డాలర్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఐరాస వాణిజ్య, అభివృద్ధి మండలి(యూఎన్‌సీటీఏడీ) అంచనా వేసింది. భారత్‌ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.150 లక్షల కోట్లు.

భారత్‌లో కరోనా మరణాల రేటు (ఏప్రిల్‌ 29 నాటికి) 3.17శాతం . ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ రోగుల్లో 7.09 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్‌లో ఇది సగం కంటే తక్కువే.

భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు నమోదై.. రోగులు పూర్తిగా కోలుకున్నారు. గోవా, మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వైరస్‌ బారిన పడిన వారంతా కోలుకోవడం వల్ల ఇక్కడ గురువారం నాటికి సున్నా కేసులున్నాయి.

ప్రపంచంలో 20 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించిన దేశాలు అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్ మాత్రమే కావడం గమనార్హం.

ప్రపంచంలో 11 లక్షల మందికి పైగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు జరిపించిన దేశాలు ఆరు . అవి అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.

అమెరికా కాకుండా లక్షకు పైగా కేసులు నమోదైన దేశాల సంఖ్య ఏడు . అవి స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, టర్కీ, రష్యా. అమెరికా (10.64 లక్షల కేసులు)తో పాటు ఈ 7 దేశాల్లో కలిపి 22.22 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 68.67 శాతం ఈ దేశాల్లోనే ఉన్నాయి.

భారత్‌లో కేసులు 30 నుంచి 30,000లకు చేరడానికి పట్టిన వారాలు ఎనిమిది. మార్చి 5న 30 కేసులు నమోదవగా ఏప్రిల్​ 29 నాటికి కేసుల సంఖ్య 30 వేలు దాటింది.

భారత్‌లో వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు తొమ్మిది. అత్యధికంగా మహారాష్ట్రలో 10 వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో కేసులు 4 వేలు దాటాయి. దిల్లీలో 3 వేలకు పైగా; రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 2 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కేసులు వెయ్యి దాటాయి.

కరోనా పేరు చెబితే ఎవరికైనా ముందు గుర్తొచ్చే దేశం చైనా. గత ఏడాది డిసెంబరులో ఈ దేశంలోనే పుట్టిన వైరస్‌ క్రమేపీ ప్రపంచమంతటా విస్తరించింది. కేసులు, మరణాల్లో ఒకప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాలో కరోనాను కట్టడి చేయడం వల్ల ఇప్పుడు అత్యధిక కేసుల క్రమంలో ఈ దేశం పదో స్థానానికి చేరింది.

మరిన్ని లెక్కలు

భారత్‌లో తొలి కేసు బయటపడిన నాటి నుంచి గురువారం వరకు 92 రోజులు గడిచాయి. జనవరి 30 నాటికి ఒక కేసు ఉండగా సరిగ్గా 13 వారాలు దాటిన తర్వాత కేసుల సంఖ్య 33 వేలు దాటింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికాలో 92వ రోజు నాటికి ఏకంగా 8.24 లక్షల కేసులు నమోదయ్యాయి.

వైరస్ బారిన పడిన మొత్తం దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 213 దేశాలు కరోనా బారిన పడ్డాయి. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మహమ్మారి వ్యాప్తి చెందింది.

160 కోట్లు..

యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు దూరమైన పిల్లల సంఖ్య 160 కోట్లు . దాదాపుగా కరోనా ప్రభావం ఉన్న అన్ని దేశాల్లోనూ పాఠశాలలను మూసివేశారు.

270 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల పరిధిలో ఉన్న ప్రజల సంఖ్య 270కోట్లు. భారత్‌లో మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది. చైనాలోని వుహాన్‌లో 1.1 కోట్ల మంది 76 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కాగా ఇటీవలే నిబంధనలు ఎత్తివేశారు.

కరోనా కోరల్లో ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. 200లకు పైగా దేశాల్లో 33 లక్షలకు పైగా కేసులు.. 2 లక్షలు దాటిపోయిన మరణాలు.. రూ.లక్షల కోట్లలో ఆర్థిక నష్టం.. ఇలా కొవిడ్‌ భారీగా కల్లోలం రేపుతోంది. ప్రపంచంలో, భారత్‌లో మహమ్మారి ఏ రీతిలో ప్రభావం చూపుతోందో గణాంకాల్లో చూస్తే..

ప్రపంచంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదైన దేశం అమెరికా. 10.64 లక్షలకు పైగా కేసులు నమోదవగా, 63 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్​ డాలర్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఐరాస వాణిజ్య, అభివృద్ధి మండలి(యూఎన్‌సీటీఏడీ) అంచనా వేసింది. భారత్‌ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.150 లక్షల కోట్లు.

భారత్‌లో కరోనా మరణాల రేటు (ఏప్రిల్‌ 29 నాటికి) 3.17శాతం . ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ రోగుల్లో 7.09 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్‌లో ఇది సగం కంటే తక్కువే.

భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు నమోదై.. రోగులు పూర్తిగా కోలుకున్నారు. గోవా, మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వైరస్‌ బారిన పడిన వారంతా కోలుకోవడం వల్ల ఇక్కడ గురువారం నాటికి సున్నా కేసులున్నాయి.

ప్రపంచంలో 20 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించిన దేశాలు అమెరికా, ఇటలీ, బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్ మాత్రమే కావడం గమనార్హం.

ప్రపంచంలో 11 లక్షల మందికి పైగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు జరిపించిన దేశాలు ఆరు . అవి అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.

అమెరికా కాకుండా లక్షకు పైగా కేసులు నమోదైన దేశాల సంఖ్య ఏడు . అవి స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, టర్కీ, రష్యా. అమెరికా (10.64 లక్షల కేసులు)తో పాటు ఈ 7 దేశాల్లో కలిపి 22.22 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 68.67 శాతం ఈ దేశాల్లోనే ఉన్నాయి.

భారత్‌లో కేసులు 30 నుంచి 30,000లకు చేరడానికి పట్టిన వారాలు ఎనిమిది. మార్చి 5న 30 కేసులు నమోదవగా ఏప్రిల్​ 29 నాటికి కేసుల సంఖ్య 30 వేలు దాటింది.

భారత్‌లో వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు తొమ్మిది. అత్యధికంగా మహారాష్ట్రలో 10 వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో కేసులు 4 వేలు దాటాయి. దిల్లీలో 3 వేలకు పైగా; రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలో 2 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కేసులు వెయ్యి దాటాయి.

కరోనా పేరు చెబితే ఎవరికైనా ముందు గుర్తొచ్చే దేశం చైనా. గత ఏడాది డిసెంబరులో ఈ దేశంలోనే పుట్టిన వైరస్‌ క్రమేపీ ప్రపంచమంతటా విస్తరించింది. కేసులు, మరణాల్లో ఒకప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాలో కరోనాను కట్టడి చేయడం వల్ల ఇప్పుడు అత్యధిక కేసుల క్రమంలో ఈ దేశం పదో స్థానానికి చేరింది.

మరిన్ని లెక్కలు

భారత్‌లో తొలి కేసు బయటపడిన నాటి నుంచి గురువారం వరకు 92 రోజులు గడిచాయి. జనవరి 30 నాటికి ఒక కేసు ఉండగా సరిగ్గా 13 వారాలు దాటిన తర్వాత కేసుల సంఖ్య 33 వేలు దాటింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికాలో 92వ రోజు నాటికి ఏకంగా 8.24 లక్షల కేసులు నమోదయ్యాయి.

వైరస్ బారిన పడిన మొత్తం దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 213 దేశాలు కరోనా బారిన పడ్డాయి. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మహమ్మారి వ్యాప్తి చెందింది.

160 కోట్లు..

యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు దూరమైన పిల్లల సంఖ్య 160 కోట్లు . దాదాపుగా కరోనా ప్రభావం ఉన్న అన్ని దేశాల్లోనూ పాఠశాలలను మూసివేశారు.

270 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల పరిధిలో ఉన్న ప్రజల సంఖ్య 270కోట్లు. భారత్‌లో మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది. చైనాలోని వుహాన్‌లో 1.1 కోట్ల మంది 76 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కాగా ఇటీవలే నిబంధనలు ఎత్తివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.