ETV Bharat / bharat

దేశంలో 20వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

author img

By

Published : Apr 22, 2020, 6:28 PM IST

Updated : Apr 22, 2020, 6:47 PM IST

దేశంలో 20వేల 471మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. 24గంటల్లో 49మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 652కు చేరింది.

corona-virus-cases-reached-20000-in-india
దేశంలో 20వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20వేలు దాటింది. 24గంటల్లో 1,486 కొత్త కేసులు నమోదయ్యాయి, 49మంది మరణించారు. ఇప్పటివరకు 20వేల 471మంది వైరస్​ బారినపడ్డారు. 652మందికి వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

corona-virus-cases-reached-20000-in-india
దేశంలో పరిస్థితి

వివిధ రాష్ట్రాల్లో ఇలా...

గుజరాత్​లో మరో 94...

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గుజరాత్​లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా 94మందికి వైరస్​ సోకగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2వేల 272కు చేరింది. ఈ 94 మందిలో 61 మంది అహ్మదాబాద్​, 17మంది సూరత్​, వడోదర నుంచి 8, అరావలి నుంచి ఐదుగురు, బోటాడ్​ నుంచి ఇద్దరు, ఒకరు రాజ్​కోట్​వాసులని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గుజరాత్​లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్​ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 95కు చేరింది.

144మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 38వేల 59 మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించారు. 2,033 యాక్టివ్​ కేసుల్లో 13మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో తాజాగా 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64లో 44 కేసులు అజ్మీర్​కు చెందినవే. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,799కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 26మంది మృతి చెందారు. మృతుల్లో 14మంది జైపుర్​కు చెందినవారు ఉన్నారు. మొత్తం 97మంది వైరస్​ను జయించారు.

గతంలో పంపిన 4వేల నమూనల ఫలితాలు బయటకు వస్తున్నట్టు.. ఇందువల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని రాజస్థాన్​ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఒడిశాలో 3...

ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 82కు చేరింది. తాజాగా భద్రాక్​ జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్​ సోకినట్టు తేలింది. వీరందరూ 40ఏళ్లు పైబడిన వారే.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశాలో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 13వేల 775మందికి పరీక్షలు నిర్వహించగా.. కేవలం 82మందికే వైరస్​ ఉన్నట్టు తేలింది. వీరిలోని 30మంది ఇప్పటికే కోలుకున్నారు. కరోనా వైరస్​ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో...

కర్ణాటకలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో కలబుర్గికి చెందిన నాలుగు నెలల శిశువు ఉండటం ఆందోళనకర విషయం.

రాష్ట్రంలో 425మందికి వైరస్​ సోకగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు. 129మంది డిశ్ఛార్జ్​ అయ్యారు.

జవానుకూ...

జమ్ముకశ్మీర్​లోని సీఆర్​పీఎఫ్ బెటాలియన్​లో చెందిన ఓ​ జవానుకు కరోనా సోకింది. సహాయక సిబ్బందిగా పని చేస్తున్న జవాను.. ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్​ వార్డులో ఉన్నాడు. సెలవు కాలం ముగియడం వల్ల ఈ నెల 7న తిరిగి విధుల్లో చేరాలనుకున్నాడు ఆ జవాను. అయితే అధికారుల సూచన మేరకు. కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పటికే 14రోజుల క్వారంటైన్​లో ఉన్న అతడికి వైరస్​ సోకినట్టు మంగళవారం తేలింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20వేలు దాటింది. 24గంటల్లో 1,486 కొత్త కేసులు నమోదయ్యాయి, 49మంది మరణించారు. ఇప్పటివరకు 20వేల 471మంది వైరస్​ బారినపడ్డారు. 652మందికి వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

corona-virus-cases-reached-20000-in-india
దేశంలో పరిస్థితి

వివిధ రాష్ట్రాల్లో ఇలా...

గుజరాత్​లో మరో 94...

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గుజరాత్​లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా 94మందికి వైరస్​ సోకగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2వేల 272కు చేరింది. ఈ 94 మందిలో 61 మంది అహ్మదాబాద్​, 17మంది సూరత్​, వడోదర నుంచి 8, అరావలి నుంచి ఐదుగురు, బోటాడ్​ నుంచి ఇద్దరు, ఒకరు రాజ్​కోట్​వాసులని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గుజరాత్​లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్​ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 95కు చేరింది.

144మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 38వేల 59 మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించారు. 2,033 యాక్టివ్​ కేసుల్లో 13మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో తాజాగా 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64లో 44 కేసులు అజ్మీర్​కు చెందినవే. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,799కు చేరింది. వైరస్​తో ఇప్పటివరకు 26మంది మృతి చెందారు. మృతుల్లో 14మంది జైపుర్​కు చెందినవారు ఉన్నారు. మొత్తం 97మంది వైరస్​ను జయించారు.

గతంలో పంపిన 4వేల నమూనల ఫలితాలు బయటకు వస్తున్నట్టు.. ఇందువల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని రాజస్థాన్​ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఒడిశాలో 3...

ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 82కు చేరింది. తాజాగా భద్రాక్​ జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్​ సోకినట్టు తేలింది. వీరందరూ 40ఏళ్లు పైబడిన వారే.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశాలో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 13వేల 775మందికి పరీక్షలు నిర్వహించగా.. కేవలం 82మందికే వైరస్​ ఉన్నట్టు తేలింది. వీరిలోని 30మంది ఇప్పటికే కోలుకున్నారు. కరోనా వైరస్​ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో...

కర్ణాటకలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో కలబుర్గికి చెందిన నాలుగు నెలల శిశువు ఉండటం ఆందోళనకర విషయం.

రాష్ట్రంలో 425మందికి వైరస్​ సోకగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు. 129మంది డిశ్ఛార్జ్​ అయ్యారు.

జవానుకూ...

జమ్ముకశ్మీర్​లోని సీఆర్​పీఎఫ్ బెటాలియన్​లో చెందిన ఓ​ జవానుకు కరోనా సోకింది. సహాయక సిబ్బందిగా పని చేస్తున్న జవాను.. ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్​ వార్డులో ఉన్నాడు. సెలవు కాలం ముగియడం వల్ల ఈ నెల 7న తిరిగి విధుల్లో చేరాలనుకున్నాడు ఆ జవాను. అయితే అధికారుల సూచన మేరకు. కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పటికే 14రోజుల క్వారంటైన్​లో ఉన్న అతడికి వైరస్​ సోకినట్టు మంగళవారం తేలింది.

Last Updated : Apr 22, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.