ETV Bharat / bharat

తిహార్​కు తలారి- నిర్భయ దోషుల ఉరి కోసం ట్రయల్స్

author img

By

Published : Jan 31, 2020, 12:34 PM IST

Updated : Feb 28, 2020, 3:43 PM IST

నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్​ అంటూ వేసిన పిటిషన్​ను కొటి వేయాటాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దోషి పవన్​ గుప్తా. గత తీర్పును పునఃసమీక్షించాలని కోరాడు. మరోవైపు... తలారి పవన్ తిహార్ జైలుకు చేరుకున్నాడు. ఉరిశిక్ష అమలుకు ట్రయల్స్ నిర్వహించాడు.

convict-pawan-moves-sc-seeks-review-of-order-dismissing-juvenility-claim
నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో మరో పిటిషన్​ వేసిన పవన్​ గుప్తా

ఉరిశిక్ష అమలు వాయిదా కోసం నిర్భయ దోషుల ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. దోషుల్లో ఒకడైనా పవన్​ గుప్తా.. సుప్రీం కోర్టులో మరోసారి పిటిషన్​ దాఖలు చేశాడు. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్​ అని వేసిన పిటిషన్​ను​ కొట్టి వేయటాన్ని మరోసారి సమీక్షించాలని పిటిషన్​ పేర్కొన్నాడు.

జనవరి 20న నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్​ అంటూ వేసిన పిటిషన్​ను సుప్రీం​ కోర్టు కొట్టి వేసింది. ఉరి శిక్ష స్టే కోసం అవకాశం ఉన్నంత మేరకు వాయిదా వేయించాలని ప్రయాత్నాలు చేశారు దోషులు. పాటియాల కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని రకాల పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లతో సంబంధం లేకుండా.. డిసెంబర్​ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్​ జైలు అధికారులు.

ముమ్మరంగా ఏర్పాట్లు...

దిల్లీ కోర్టు నిర్భయ దోషులకు రేపు ఉదయం 6 గంటలుకు ఉరిశిక్షను అమలుచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిక్షను అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు తీహార్​ జైలు అధికారులు. దోషుల బరువుకు తగిన బరువున్న ఇసుక మూటలతో ముందస్తు ట్రయిల్​ కూడా నిర్వహించారు. వీరికి ఉరిని అమలు చేసే తలారి పవన్​ జల్లాద్​ ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు.

ఇదీ చదవండి: వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

ఉరిశిక్ష అమలు వాయిదా కోసం నిర్భయ దోషుల ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. దోషుల్లో ఒకడైనా పవన్​ గుప్తా.. సుప్రీం కోర్టులో మరోసారి పిటిషన్​ దాఖలు చేశాడు. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్​ అని వేసిన పిటిషన్​ను​ కొట్టి వేయటాన్ని మరోసారి సమీక్షించాలని పిటిషన్​ పేర్కొన్నాడు.

జనవరి 20న నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్​ అంటూ వేసిన పిటిషన్​ను సుప్రీం​ కోర్టు కొట్టి వేసింది. ఉరి శిక్ష స్టే కోసం అవకాశం ఉన్నంత మేరకు వాయిదా వేయించాలని ప్రయాత్నాలు చేశారు దోషులు. పాటియాల కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని రకాల పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లతో సంబంధం లేకుండా.. డిసెంబర్​ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్​ జైలు అధికారులు.

ముమ్మరంగా ఏర్పాట్లు...

దిల్లీ కోర్టు నిర్భయ దోషులకు రేపు ఉదయం 6 గంటలుకు ఉరిశిక్షను అమలుచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిక్షను అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు తీహార్​ జైలు అధికారులు. దోషుల బరువుకు తగిన బరువున్న ఇసుక మూటలతో ముందస్తు ట్రయిల్​ కూడా నిర్వహించారు. వీరికి ఉరిని అమలు చేసే తలారి పవన్​ జల్లాద్​ ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు.

ఇదీ చదవండి: వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

Last Updated : Feb 28, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.