ETV Bharat / bharat

కుల్​భూషణ్​కు​​ దౌత్య సాయంతో పాక్​ మళ్లీ వక్రబుద్ధి

పాకిస్థాన్​ మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కుల్​భూషణ్​ జాదవ్​కు దౌత్య సహాయం అందిస్తూనే.. సమావేశం ఆద్యంతం ఆయన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పూర్తి సమావేశాన్ని రికార్డు చేసిందని భారత్​ విదేశాంగ శాఖ ఆరోపించింది. పాక్​ వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన అనంతరం భారత అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగినట్టు వెల్లడించింది.

author img

By

Published : Jul 16, 2020, 8:51 PM IST

Updated : Jul 16, 2020, 9:07 PM IST

Consular Officers were not given unimpeded, unhindered & unconditional access to Kulbhushan Jadhav: MEA
కుల్​భూషన్​ దౌత్య సాయంతో మళ్లీ పాక్​ వక్రబుద్ధి

కుల్​భూషణ్​​ జాదవ్​కు అందిన దౌత్య సహాయం నేపథ్యంలో పాకిస్థాన్​పై భారత్​ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులివ్వాలని కోరగా.. పాకిస్థాన్​ అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించిందని భారత్​ ఆరోపించింది. దౌత్య అధికారులు జాదవ్​తో ఉండగా.. భయపెట్టే రీతిలో పాక్​ అధికారులు కుల్​భూషణ్​తో ప్రవర్తించారని మండిపడింది.

పాక్​ చర్యలతో.. మాజీ నౌకాదళ అధికారి హక్కుల గురించి భారత్​ ప్రస్తావించలేక పోయిందని, న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు ఆయన నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం పొందలేకపోయిందని విదేశాంగశాఖ వెల్లడించింది.

భారత్​ అధికారులతో జాదవ్​ సంభాషణలు పాక్​ రికార్డు చేసినట్టు పేర్కొంది విదేశాంగ శాఖ. సమావేశం ఆద్యంతం జాదవ్​ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించినట్టు స్పష్టం చేసింది. 2019లో అంతర్జాతీయ కోర్టు తీర్పును అమలు చేయడంలో పాక్​ పూర్తిగా విఫలమైందని తెలిపింది.

పాక్​ ఏర్పాటు చేసిన దౌత్య సాయం అర్థరహితంగా ఉందని, విశ్వసనీయత లోపించిందని భారత అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమ నిరసన తెలిపిన అనంతరం వారు అక్కడి నుంచి వెనుదిరిగినట్టు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

ఈ పూర్తి వ్యవహారాన్ని కుల్​భూషణ్​ జాదవ్​ కుటుంబసభ్యులకు వివరించినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. జాదవ్​ను భారత్​కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు మరోమారు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి- 'కులభూషణ్' ​కేసులో పాక్​ వైఖరి తప్పే: ఐసీజే

కుల్​భూషణ్​​ జాదవ్​కు అందిన దౌత్య సహాయం నేపథ్యంలో పాకిస్థాన్​పై భారత్​ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులివ్వాలని కోరగా.. పాకిస్థాన్​ అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించిందని భారత్​ ఆరోపించింది. దౌత్య అధికారులు జాదవ్​తో ఉండగా.. భయపెట్టే రీతిలో పాక్​ అధికారులు కుల్​భూషణ్​తో ప్రవర్తించారని మండిపడింది.

పాక్​ చర్యలతో.. మాజీ నౌకాదళ అధికారి హక్కుల గురించి భారత్​ ప్రస్తావించలేక పోయిందని, న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు ఆయన నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం పొందలేకపోయిందని విదేశాంగశాఖ వెల్లడించింది.

భారత్​ అధికారులతో జాదవ్​ సంభాషణలు పాక్​ రికార్డు చేసినట్టు పేర్కొంది విదేశాంగ శాఖ. సమావేశం ఆద్యంతం జాదవ్​ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించినట్టు స్పష్టం చేసింది. 2019లో అంతర్జాతీయ కోర్టు తీర్పును అమలు చేయడంలో పాక్​ పూర్తిగా విఫలమైందని తెలిపింది.

పాక్​ ఏర్పాటు చేసిన దౌత్య సాయం అర్థరహితంగా ఉందని, విశ్వసనీయత లోపించిందని భారత అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమ నిరసన తెలిపిన అనంతరం వారు అక్కడి నుంచి వెనుదిరిగినట్టు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

ఈ పూర్తి వ్యవహారాన్ని కుల్​భూషణ్​ జాదవ్​ కుటుంబసభ్యులకు వివరించినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. జాదవ్​ను భారత్​కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు మరోమారు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి- 'కులభూషణ్' ​కేసులో పాక్​ వైఖరి తప్పే: ఐసీజే

Last Updated : Jul 16, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.