ETV Bharat / bharat

'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్​ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసంతృప్తితో రాజీనామా చేసిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దింపింది.

author img

By

Published : Jul 7, 2019, 12:43 PM IST

'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

కన్నడనాట రాజకీయ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కుమారస్వామి ప్రభుత్వం అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో అధికారం కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్​. అసంతృప్త నేతలతో చర్చలు జరిపేందుకు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దింపింది.
మాజీ మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలోని 11 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులతో సంప్రదింపులు జరపనున్నారు ఖర్గే.

మల్లికార్జున ఖర్గే

" కాంగ్రెస్​ - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మా మధ్య విభేదాలు సృష్టించేందుకే కొందరు తప్పుడు సమాచారాన్ని పత్రికలకు అందిస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని మేము పరిష్కరించగలమో లేదో చూస్తాం. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్​ నేత

సిద్ధరామయ్య స్పందన

"ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలతో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. పార్టీ సభ్యులు నాకు విధేయులుగా ఉంటారా? లేదా? అన్నది ప్రశ్న కాదు.. ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయులై ఉంటారని ఆశిస్తున్నా" అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

కాంగ్రెస్​ భేటీ వాయిదా...

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అత్యవసరంగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ ఉదయం 10గంటలకు భేటీ జరుగుతుందని ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందించింది. అయితే... అనేక మంది హాజరుకాలేదు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.
అనేక మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో లేకపోవడమే భేటీ వాయిదాకు కారణమని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.

కీలక నేతల భేటీ

జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడతో భేటీ అయ్యారు కాంగ్రెస్​ నేత, మంత్రి డీకే శివకుమార్. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారు.

కన్నడనాట రాజకీయ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కుమారస్వామి ప్రభుత్వం అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో అధికారం కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్​. అసంతృప్త నేతలతో చర్చలు జరిపేందుకు సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దింపింది.
మాజీ మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలోని 11 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులతో సంప్రదింపులు జరపనున్నారు ఖర్గే.

మల్లికార్జున ఖర్గే

" కాంగ్రెస్​ - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మా మధ్య విభేదాలు సృష్టించేందుకే కొందరు తప్పుడు సమాచారాన్ని పత్రికలకు అందిస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని మేము పరిష్కరించగలమో లేదో చూస్తాం. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్​ నేత

సిద్ధరామయ్య స్పందన

"ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలతో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. పార్టీ సభ్యులు నాకు విధేయులుగా ఉంటారా? లేదా? అన్నది ప్రశ్న కాదు.. ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయులై ఉంటారని ఆశిస్తున్నా" అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

కాంగ్రెస్​ భేటీ వాయిదా...

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అత్యవసరంగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ ఉదయం 10గంటలకు భేటీ జరుగుతుందని ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందించింది. అయితే... అనేక మంది హాజరుకాలేదు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.
అనేక మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో లేకపోవడమే భేటీ వాయిదాకు కారణమని కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.

కీలక నేతల భేటీ

జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడతో భేటీ అయ్యారు కాంగ్రెస్​ నేత, మంత్రి డీకే శివకుమార్. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారు.

AP Video Delivery Log - 0000 GMT News
Sunday, 7 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2336: US CA Earthquake Governor Must courtesy KERO/No access Bakersfield/No access KBAK, KBFX, KGET/No use US broadcast networks/No re-sale, re-use or archive 4219300
Gov. Newsom spoke to president after quake
AP-APTN-2334: Archive Joao Gilberto No access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4219299
Bossa nova pioneer Joao Gilberto dies, age 88
AP-APTN-2241: Peru Pacific Alliance Summit AP Clients Only 4219297
LatAm leaders meet to discuss economic integration
AP-APTN-2216: US CA Earthquake Aftermath AP Clients Only 4219298
Trona resident reflects on California quake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.