ETV Bharat / bharat

'హాథ్రస్'​పై హైడ్రామా- రాహుల్, ప్రియాంక అరెస్టు

author img

By

Published : Oct 1, 2020, 4:54 PM IST

Updated : Oct 1, 2020, 5:59 PM IST

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాథ్రస్ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అత్యాచార ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఇద్దరినీ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై అడుకున్నారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు.

rahul hathras
రాహుల్ గాంధీ అరెస్టు

హాథ్రస్​ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన పర్యటన అరెస్టులకు దారి తీసింది. గ్రేటర్ నోయిడా సమీపంలో పరిచౌక్​ వద్ద వీరిని యూపీ పోలీసులు అడ్డగించి.. హాథ్రస్​కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో అక్కడి నుంచి హాథ్రస్​కు పాదయాత్ర ద్వారా 150 కిలోమీటర్లు వెళ్లాలని నిర్ణయించారు నేతలు. అయితే... ఐపీసీ సెక్షన్​ 188 ప్రకారం రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

rahul hathras
రాహుల్​ను అడ్డుకున్న పోలీసులు

రాహుల్​ గాంధీతో పాటు పర్యటనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, అధిర్ రంజన్​ చౌదురి, రణ్​దీప్​ సుర్జేవాలాను గౌతమ్​ బుద్ధ నగర్​లోని బుద్ధ్ ఇంటర్నేషనల్​ సర్క్యూట్​కు తరలించారు పోలీసులు.

తోపులాట..

అంతకుముందు... హాథ్రస్‌లో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ విధిస్తూ స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో నేతలను అడ్డగించారు అధికారులు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

rahul hathras
కిందపడిపోయిన రాహుల్

కాలి నడకన వెళుతున్న రాహుల్ గాంధీని యమునా ఎక్స్​ప్రెస్​ వే వద్ద మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రాహుల్, పోలీసుల మధ్య తోపులాట జరగగా.. ఆయన కింద పడిపోయారు.

తోపులాటలో కిందపడిపోయిన రాహుల్ గాంధీ

సామాన్యుడికి అవకాశం లేదా?

పోలీసుల తీరుపై మండిపడ్డారు రాహుల్. తనను తోసివేసి పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. "ప్రధాని మోదీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా? సామాన్యులకు అవకాశం లేదా?" అని ప్రశ్నించారు.

rahul hathras
తోపులాట

యోగిదే బాధ్యత..

యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. సంచలనం సృష్టించిన ఉన్నావ్​ ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో నేరం జరిగిందన్నారు. ఇలా ఎన్ని నేరాలు జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు రావట్లేదనిధ్వజమెత్తారు.

"మాపై లాఠీ ఛార్జి చేశారు. ఇలాంటి అన్యాయాన్ని ఎక్కడా చూడలేదు. ప్రజలపై ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉంది. మహిళల భద్రతకు రక్షణ కల్పించి, వారిపై అకృత్యాలు జరగకుండా యూపీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి."

- ప్రియాంక గాంధీ వాద్రా

రాజకీయం కోసమే..

హాథ్రస్​ ఘటనను రాహుల్, ప్రియాంక రాజకీయం చేసేందుకు వాడుకుంటున్నారని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి ఘటన జరిగిన రాజస్థాన్​కు ఈ నేతలు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాజస్థాన్​లో జరిగిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది?

సెప్టెంబర్ 14వ తేదీన 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అనంతరం యువతి అంత్యక్రియలను అర్ధరాత్రి సమయంలో నిర్వహించగా.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదీ చూడండి: 'హాథ్రస్'​ ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ

హాథ్రస్​ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన పర్యటన అరెస్టులకు దారి తీసింది. గ్రేటర్ నోయిడా సమీపంలో పరిచౌక్​ వద్ద వీరిని యూపీ పోలీసులు అడ్డగించి.. హాథ్రస్​కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో అక్కడి నుంచి హాథ్రస్​కు పాదయాత్ర ద్వారా 150 కిలోమీటర్లు వెళ్లాలని నిర్ణయించారు నేతలు. అయితే... ఐపీసీ సెక్షన్​ 188 ప్రకారం రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

rahul hathras
రాహుల్​ను అడ్డుకున్న పోలీసులు

రాహుల్​ గాంధీతో పాటు పర్యటనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, అధిర్ రంజన్​ చౌదురి, రణ్​దీప్​ సుర్జేవాలాను గౌతమ్​ బుద్ధ నగర్​లోని బుద్ధ్ ఇంటర్నేషనల్​ సర్క్యూట్​కు తరలించారు పోలీసులు.

తోపులాట..

అంతకుముందు... హాథ్రస్‌లో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ విధిస్తూ స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో నేతలను అడ్డగించారు అధికారులు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

rahul hathras
కిందపడిపోయిన రాహుల్

కాలి నడకన వెళుతున్న రాహుల్ గాంధీని యమునా ఎక్స్​ప్రెస్​ వే వద్ద మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రాహుల్, పోలీసుల మధ్య తోపులాట జరగగా.. ఆయన కింద పడిపోయారు.

తోపులాటలో కిందపడిపోయిన రాహుల్ గాంధీ

సామాన్యుడికి అవకాశం లేదా?

పోలీసుల తీరుపై మండిపడ్డారు రాహుల్. తనను తోసివేసి పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. "ప్రధాని మోదీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా? సామాన్యులకు అవకాశం లేదా?" అని ప్రశ్నించారు.

rahul hathras
తోపులాట

యోగిదే బాధ్యత..

యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. సంచలనం సృష్టించిన ఉన్నావ్​ ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో నేరం జరిగిందన్నారు. ఇలా ఎన్ని నేరాలు జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు రావట్లేదనిధ్వజమెత్తారు.

"మాపై లాఠీ ఛార్జి చేశారు. ఇలాంటి అన్యాయాన్ని ఎక్కడా చూడలేదు. ప్రజలపై ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉంది. మహిళల భద్రతకు రక్షణ కల్పించి, వారిపై అకృత్యాలు జరగకుండా యూపీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి."

- ప్రియాంక గాంధీ వాద్రా

రాజకీయం కోసమే..

హాథ్రస్​ ఘటనను రాహుల్, ప్రియాంక రాజకీయం చేసేందుకు వాడుకుంటున్నారని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి ఘటన జరిగిన రాజస్థాన్​కు ఈ నేతలు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాజస్థాన్​లో జరిగిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది?

సెప్టెంబర్ 14వ తేదీన 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అనంతరం యువతి అంత్యక్రియలను అర్ధరాత్రి సమయంలో నిర్వహించగా.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదీ చూడండి: 'హాథ్రస్'​ ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ

Last Updated : Oct 1, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.