ETV Bharat / bharat

యూపీలో కరోనా కట్టడికి 'మూడు రోజుల ప్రణాళిక'

author img

By

Published : Jul 10, 2020, 6:35 PM IST

కరోనా మహమ్మరి కట్టడి కోసం మూడు రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. అధికారులే స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని ఆదేశించారు.

Conduct rapid antigen tests in every household: UP CM to officials
యూపీలో కరోనా కట్టడికి 'మూడు రోజుల ప్రణాళిక'

ఉత్తరప్రదేశ్​లో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ 'మూడు రోజుల ప్రణాళిక'ను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులే నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు యోగి. ఈ కార్యక్రమంలో ప్రజలకు వైరస్​పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

"కొవిడ్​-19, కీటకాల నుంచి సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జులై 10 నుంచి 13 వరకు ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి యాంటిజెన్ పరీక్షలు చేస్తారు."

-యోగి ఆదిత్యనాథ్​, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.

కరోనా పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించేందుకు ల్యాబ్ సిబ్బందిని కూడా పెంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి రోజు 15 వేల రాపిడ్​ యాంటీజెన్​ పరీక్షలను నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల సమయంలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రతి చోట శానిటైజ్​ చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

ఉత్తరప్రదేశ్​లో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ 'మూడు రోజుల ప్రణాళిక'ను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులే నేరుగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు యోగి. ఈ కార్యక్రమంలో ప్రజలకు వైరస్​పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

"కొవిడ్​-19, కీటకాల నుంచి సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జులై 10 నుంచి 13 వరకు ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి యాంటిజెన్ పరీక్షలు చేస్తారు."

-యోగి ఆదిత్యనాథ్​, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.

కరోనా పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించేందుకు ల్యాబ్ సిబ్బందిని కూడా పెంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాబట్టి ప్రతి రోజు 15 వేల రాపిడ్​ యాంటీజెన్​ పరీక్షలను నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల సమయంలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రతి చోట శానిటైజ్​ చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.