కర్ణాటకలో ఓ వంతెన హఠాత్తుగా కుప్పకూలింది. రాయచూర్ జిల్లాలో వరదల్లో దెబ్బతిన్న వంతెనను ఓ ఎమ్మెల్యే తనిఖీ చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.
![Close shave for Karnataka MLA as rain-damaged bridge collapses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8979198_2.jpg)
ఇదీ జరిగింది..
మాన్వి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు వెంకటప్ప నాయక్.. రాయచూర్లోని సిర్వారా ప్రాంతంలోగల దెబ్బతిన్న వంతెనను పర్యవేక్షించేందుకు వెళ్లారు. అనుచరులతో పాటు వెంకటప్ప పగుళ్లను పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. వంతెన అంచుభాగంలో నిల్చున్న నాయక్కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
![Close shave for Karnataka MLA as rain-damaged bridge collapses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8979198_1.jpg)
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి