ETV Bharat / bharat

రాళ్లదాడిపై భాజపా- తృణమూల్​ మాటల యుద్ధం

author img

By

Published : May 14, 2019, 10:07 PM IST

Updated : May 15, 2019, 4:40 PM IST

బంగాల్​ కోల్​కతాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా కాన్వాయ్​పై జరిగిన రాళ్లదాడి.. కాషాయ, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భాజపాకు దక్కుతున్న ప్రజాదరణ తట్టుకోలేకే మమతా బెనర్జీ హింసకు తెరతీశారని అమిత్​ షా విమర్శించారు. ఈ ఘటనపై స్పందించిన దీదీ అమిత్​ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమిత్​షా ఓ గుండా..మమతా బెనర్జీ
రాళ్లదాడిపై మాటల యుద్ధం

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా బంగాల్​ కోల్​కతాలో నిర్వహించిన రోడ్​షోలో ఉద్రిక్తతలు తలెత్తాయి.​ 'బిదాన్ సరని' హాస్టల్​ వద్ద కొంతమంది వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో అమిత్​షా 'గో బ్యాక్'​ అంటూ నినాదాలు చేశారు.

ఈ పరిణామంతో భాజపా కార్యకర్తలు ఆ హాస్టల్​కి తాళం వేసి, గెరావ్​ చేశారు. హాస్టల్​ బయట ఉన్న వాహనాలకు నిప్పు అంటించారు. రాళ్లు రువ్వారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ కళాశాల​ హాస్టల్​ భవనాన్ని, ప్రతిమనూ భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ పరిణామాలతో మరోసారి బంగాల్​ భగ్గుమంది, వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ ఛత్ర పరిషత్​ (టీఎమ్​సీపీ) కార్యకర్తలు ప్రతిదాడి చేశారు. ఘర్షణ పెరిగి ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

'మమత దాడి చేయించారు'

అమిత్​షా తన కాన్వాయ్​పై జరిగిన దాడికి బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని ఆరోపించారు.

"కోల్​కతాలోని ప్రజలందరూ రోడ్లపైనే ఉన్నారు. దాదాపు 8 కి.మీ వరకు కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇది చూసి తట్టుకోలేక.. మమతా నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన గూండాలు అడ్డగించారు. నా కాన్వాయ్​కు 200 మీటర్ల దూరంలో ఓ వైద్య కళాశాల ఉంది. అక్కడ గొడవ మొదలైంది. రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. ఈ విధమైన హింసను మమతా బెనర్జీ సర్కారు పెంచుతోంది. అలానే బంగాల్​ ప్రజలను నేను కోరేది ఒకటే... ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ హింసకు మీరు... శాంతితో, ఓటుతో సమాధానం ఇవ్వాలి. "- అమిత్​షా , భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆ సమయంలో పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని, స్వామి వివేకానంద నివాసానికి తాను వెళ్లకుండా, తప్పు దారిపట్టించారని అమిత్​షా ఆరోపించారు.

'అమిత్​షాని ఏమనాలి'

అమిత్​షా ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. కమల దళపతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యాసాగర్​ విగ్రహాన్ని భాజపా కార్యకర్తలు ధ్వంసం చేయడంపై బెహాలా ర్యాలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గురువారం ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

"మీరు విద్యాసాగర్​ (బంగాల్​ పునరుజ్జీవన ఉద్యమకారుడు) మీద చేతులు వేస్తే మిమ్మల్ని ఏమనాలి. నేను మీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని ద్వేషిస్తాను."-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!

రాళ్లదాడిపై మాటల యుద్ధం

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా బంగాల్​ కోల్​కతాలో నిర్వహించిన రోడ్​షోలో ఉద్రిక్తతలు తలెత్తాయి.​ 'బిదాన్ సరని' హాస్టల్​ వద్ద కొంతమంది వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో అమిత్​షా 'గో బ్యాక్'​ అంటూ నినాదాలు చేశారు.

ఈ పరిణామంతో భాజపా కార్యకర్తలు ఆ హాస్టల్​కి తాళం వేసి, గెరావ్​ చేశారు. హాస్టల్​ బయట ఉన్న వాహనాలకు నిప్పు అంటించారు. రాళ్లు రువ్వారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ కళాశాల​ హాస్టల్​ భవనాన్ని, ప్రతిమనూ భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ పరిణామాలతో మరోసారి బంగాల్​ భగ్గుమంది, వామపక్ష, తృణమూల్​ కాంగ్రెస్ ఛత్ర పరిషత్​ (టీఎమ్​సీపీ) కార్యకర్తలు ప్రతిదాడి చేశారు. ఘర్షణ పెరిగి ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

'మమత దాడి చేయించారు'

అమిత్​షా తన కాన్వాయ్​పై జరిగిన దాడికి బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని ఆరోపించారు.

"కోల్​కతాలోని ప్రజలందరూ రోడ్లపైనే ఉన్నారు. దాదాపు 8 కి.మీ వరకు కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇది చూసి తట్టుకోలేక.. మమతా నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన గూండాలు అడ్డగించారు. నా కాన్వాయ్​కు 200 మీటర్ల దూరంలో ఓ వైద్య కళాశాల ఉంది. అక్కడ గొడవ మొదలైంది. రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. ఈ విధమైన హింసను మమతా బెనర్జీ సర్కారు పెంచుతోంది. అలానే బంగాల్​ ప్రజలను నేను కోరేది ఒకటే... ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ హింసకు మీరు... శాంతితో, ఓటుతో సమాధానం ఇవ్వాలి. "- అమిత్​షా , భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆ సమయంలో పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని, స్వామి వివేకానంద నివాసానికి తాను వెళ్లకుండా, తప్పు దారిపట్టించారని అమిత్​షా ఆరోపించారు.

'అమిత్​షాని ఏమనాలి'

అమిత్​షా ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. కమల దళపతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యాసాగర్​ విగ్రహాన్ని భాజపా కార్యకర్తలు ధ్వంసం చేయడంపై బెహాలా ర్యాలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గురువారం ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

"మీరు విద్యాసాగర్​ (బంగాల్​ పునరుజ్జీవన ఉద్యమకారుడు) మీద చేతులు వేస్తే మిమ్మల్ని ఏమనాలి. నేను మీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని ద్వేషిస్తాను."-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 14, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese President Xi Jinping (R) shaking hands with Armenian Prime Minister Nikol Pashinyan
2. Various of meeting between Xi, Pashinyan in progress; officials from two sides at meeting
Chinese President Xi Jinping on Tuesday met with Armenian Prime Minister Nikol Pashinyan, who is in Beijing to attend the Conference on Dialogue of Asian Civilizations.
Xi said China and Armenia, both having a long history of civilization, should promote mutual learning that will serve as a strong support for consolidating long-lasting friendship between the two countries as well as jointly building the Belt and Road, to inject new impetus into regional cooperation and development.
China stands ready to push forward bilateral cooperation and achieve more tangible results in various fields including trade and investment, mining, metal smelting, renewable energy as well as infrastructure construction, said Xi.
The two sides should strengthen cooperation on anti-terrorism, law enforcement and security, and jointly combat "three forces" of terrorism, separatism and extremism, Xi said.
Pashinyan said Armenia treats bilateral relationship from a strategic perspective and is willing to actively participate in the joint building of the Belt and Road.
Armenia is firmly committed to fighting terrorism, he added.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 15, 2019, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.