ETV Bharat / bharat

చంద్రయాన్​-2: జాబిల్లిపై దిగనున్న 'విక్రమ్'​

చంద్రయాన్​-2లో కీలకమైన 'విక్రమ్'​ ల్యాండర్​ సెప్టెంబర్​ 7న జాబిల్లిపై అడుగుపెట్టనుంది. తెల్లవారుజామున 1.55 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ వెల్లడించారు.

author img

By

Published : Aug 23, 2019, 5:06 AM IST

Updated : Sep 27, 2019, 10:59 PM IST

చంద్రయాన్​-2: జాబిల్లిపై దిగనున్న 'విక్రమ్'​ ల్యాండర్​
సెప్టెంబర్​ 7న జాబిల్లిపై అడుగుపెట్టనున్న విక్రమ్​ ల్యాండర్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మంగళవారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వాహకనౌక నుంచి.. 'విక్రమ్' ల్యాండర్​ వేరు కానుంది. సెప్టెంబర్​ 7న చంద్రుడిపై ల్యాండర్​ దిగనుందని ఇస్రో అధినేత శివన్​ వెల్లడించారు. తెల్లవారుజామున 1.55 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.

" విక్రమ్​ ల్యాండర్​​ చంద్రుని ఉపరితలంపై దిగే ప్రక్రియ సెప్టెంబర్​ 7, తెల్లవారుజామున 1.40కు మొదలై 1.55కు పూర్తవుతుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా ఇది ఎంతో కీలక ప్రక్రియ. ఈ ఘట్టాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమిస్తున్నారు. "
- కే శివన్, ఇస్రో ఛైర్మన్​​

చంద్రుని కక్ష్యను ఈ బుధవారమే రెండోసారి తగ్గించుకున్న చంద్రయాన్​-2.. కీలక ఘట్టానికి ముందే మరో మూడుసార్లు కక్ష్యను తగ్గించుకోనుంది. అనంతరం చంద్రుని ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలోని తుది ఆర్బిట్​కు చేరుకుంటుంది. విక్రమ్​ ల్యాండర్​​ సెప్టెంబర్​ 2నే ఆర్బిటర్​ నుంచి వేరై చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ ఆర్బిట్​లోకి ప్రవేశించనుంది. అనంతరం సెప్టెంబర్​ 7న జాబిల్లి ఉపరితలంపై దిగనుందని ఇస్రో ప్రకటించింది.

ప్రధానికి ఆహ్వానం..

విక్రమ్​ ల్యాండర్​ చందమామపై దిగే అద్భుత ఘట్టానికి హాజరవ్వాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు శివన్​ తెలిపారు. ఇస్రో సంస్థలో లింగభేదాలు లేవని.. చంద్రయాన్​-2 ప్రయోగ సమయంలో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కిందని గుర్తుచేశారు శివన్​. భవిష్యత్తులో జరగబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ మహిళా శాస్త్రవేత్తలను భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు.

శివన్​కు కలాం అవార్డు..

తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పురస్కారాన్ని ఇస్రో ఛైర్మన్‌ కే శివన్‌ అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందించినందుకు గానూ.. గురువారం ఉదయం ఈ అవార్డును శివన్​కు అందజేసింది తమిళనాడు ప్రభుత్వం. 5 గ్రాములు విలువ చేసే బంగారు పతకం, 5 లక్షల రూపాయల నగదును ఇస్రో అధినేతకు అందజేశారు ముఖ్యమంత్రి పళనిస్వామి.

ఇదీ చూడండి : 'మెజారిటీ ఉందని ప్రజలను రాజీవ్​ భయపెట్టలేదు'

సెప్టెంబర్​ 7న జాబిల్లిపై అడుగుపెట్టనున్న విక్రమ్​ ల్యాండర్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మంగళవారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వాహకనౌక నుంచి.. 'విక్రమ్' ల్యాండర్​ వేరు కానుంది. సెప్టెంబర్​ 7న చంద్రుడిపై ల్యాండర్​ దిగనుందని ఇస్రో అధినేత శివన్​ వెల్లడించారు. తెల్లవారుజామున 1.55 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.

" విక్రమ్​ ల్యాండర్​​ చంద్రుని ఉపరితలంపై దిగే ప్రక్రియ సెప్టెంబర్​ 7, తెల్లవారుజామున 1.40కు మొదలై 1.55కు పూర్తవుతుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా ఇది ఎంతో కీలక ప్రక్రియ. ఈ ఘట్టాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమిస్తున్నారు. "
- కే శివన్, ఇస్రో ఛైర్మన్​​

చంద్రుని కక్ష్యను ఈ బుధవారమే రెండోసారి తగ్గించుకున్న చంద్రయాన్​-2.. కీలక ఘట్టానికి ముందే మరో మూడుసార్లు కక్ష్యను తగ్గించుకోనుంది. అనంతరం చంద్రుని ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలోని తుది ఆర్బిట్​కు చేరుకుంటుంది. విక్రమ్​ ల్యాండర్​​ సెప్టెంబర్​ 2నే ఆర్బిటర్​ నుంచి వేరై చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ ఆర్బిట్​లోకి ప్రవేశించనుంది. అనంతరం సెప్టెంబర్​ 7న జాబిల్లి ఉపరితలంపై దిగనుందని ఇస్రో ప్రకటించింది.

ప్రధానికి ఆహ్వానం..

విక్రమ్​ ల్యాండర్​ చందమామపై దిగే అద్భుత ఘట్టానికి హాజరవ్వాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు శివన్​ తెలిపారు. ఇస్రో సంస్థలో లింగభేదాలు లేవని.. చంద్రయాన్​-2 ప్రయోగ సమయంలో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కిందని గుర్తుచేశారు శివన్​. భవిష్యత్తులో జరగబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ మహిళా శాస్త్రవేత్తలను భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు.

శివన్​కు కలాం అవార్డు..

తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పురస్కారాన్ని ఇస్రో ఛైర్మన్‌ కే శివన్‌ అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందించినందుకు గానూ.. గురువారం ఉదయం ఈ అవార్డును శివన్​కు అందజేసింది తమిళనాడు ప్రభుత్వం. 5 గ్రాములు విలువ చేసే బంగారు పతకం, 5 లక్షల రూపాయల నగదును ఇస్రో అధినేతకు అందజేశారు ముఖ్యమంత్రి పళనిస్వామి.

ఇదీ చూడండి : 'మెజారిటీ ఉందని ప్రజలను రాజీవ్​ భయపెట్టలేదు'

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.