ETV Bharat / bharat

దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయసభలు రేపటికి వాయిదా - దిల్లీ అల్లర్లపై దుమారం

The vote comes just two weeks before the right-wing premier stands trial over a series of corruption allegations, but final polls indicated his support was holding, suggesting another close race between his Likud and the centrist Blue and White party.

rajyasabha
దిల్లీ ఘర్షణలపై దద్దరిల్లిన పార్లమెంట్.. రాజ్యసభ రేపటికి వాయిదా
author img

By

Published : Mar 2, 2020, 2:42 PM IST

Updated : Mar 3, 2020, 4:04 AM IST

16:50 March 02

లోక్​సభ రేపటికి వాయిదా..

విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ లోక్​సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్​సభ మర్యాదను కాపాడాలని ఉద్ఘాటించారు. సభలో తోపులాట చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ నియమావళి మేరకు నడుచుకుని.. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు. 

14:38 March 02

దిల్లీ ఘర్షణలపై దద్దరిల్లిన పార్లమెంట్.. రాజ్యసభ రేపటికి వాయిదా

దిల్లీ ఘర్షణలపై రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దిల్లీ సీఏఏ వ్యతిరేక ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో గందరగోళం మధ్యే సభాకార్యకలాపాలు కొనసాగాయి. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమయానుకూలంగా చర్చ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు సభను సాగనివ్వాలని ఛైర్మన్ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేసిన నేపథ్యంలో మొదటిసారి రెండుగంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.  

సభ తిరిగి ప్రారంభమైన అనంతరమూ విపక్షసభ్యులు సభను సజావుగా సాగనివ్వలేదు. సభలో గందరగోళం నెలకొన్న కారణంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​ సింగ్ రేపటికి వాయిదా వేశారు.

4 గంటలవరకు లోక్​సభ  

జేడీయూ ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాప సూచకంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్​సభ. అనంతరం సభా కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగిన నేపథ్యంలో రెండోసారి మూడు గంటలవరకు వాయిదా వేశారు. అనంతరం దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో  ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటలవరకు వాయిదా వేశారు.  

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహి

రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన అనంతరం విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్​షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్​లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్​కు రక్షణగా వెల్​లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య బాహాబాహి జరిగింది.

గందరగోళంపై ప్రభుత్వం అసహనం..

లోక్​సభలో విపక్ష సభ్యుల నినాదాలపై స్పందించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  

16:50 March 02

లోక్​సభ రేపటికి వాయిదా..

విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ లోక్​సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్​సభ మర్యాదను కాపాడాలని ఉద్ఘాటించారు. సభలో తోపులాట చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ నియమావళి మేరకు నడుచుకుని.. భారత ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు. 

14:38 March 02

దిల్లీ ఘర్షణలపై దద్దరిల్లిన పార్లమెంట్.. రాజ్యసభ రేపటికి వాయిదా

దిల్లీ ఘర్షణలపై రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దిల్లీ సీఏఏ వ్యతిరేక ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో గందరగోళం మధ్యే సభాకార్యకలాపాలు కొనసాగాయి. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సమయానుకూలంగా చర్చ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు సభను సాగనివ్వాలని ఛైర్మన్ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేసిన నేపథ్యంలో మొదటిసారి రెండుగంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.  

సభ తిరిగి ప్రారంభమైన అనంతరమూ విపక్షసభ్యులు సభను సజావుగా సాగనివ్వలేదు. సభలో గందరగోళం నెలకొన్న కారణంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​ సింగ్ రేపటికి వాయిదా వేశారు.

4 గంటలవరకు లోక్​సభ  

జేడీయూ ఎంపీ వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి సంతాప సూచకంగా రెండు గంటల వరకు మొదటిసారి వాయిదా పడింది లోక్​సభ. అనంతరం సభా కార్యకలాపాలు పునః ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగిన నేపథ్యంలో రెండోసారి మూడు గంటలవరకు వాయిదా వేశారు. అనంతరం దిల్లీ ఘర్షణలపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో  ప్యానెల్ స్పీకర్ రమాదేవి సాయంత్రం నాలుగు గంటలవరకు వాయిదా వేశారు.  

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహి

రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన అనంతరం విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్​షా రాజీనామాకు డిమాండ్ చేస్తూ వెల్​లోకి దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్​కు రక్షణగా వెల్​లోకి వచ్చారు భాజపా సభ్యులు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య బాహాబాహి జరిగింది.

గందరగోళంపై ప్రభుత్వం అసహనం..

లోక్​సభలో విపక్ష సభ్యుల నినాదాలపై స్పందించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. 1984లో 3వేలమంది ఊచకోతపై ఎలాంటి చర్యలు తీసుకోని వారు ప్రస్తుతం గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  

Last Updated : Mar 3, 2020, 4:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.