ETV Bharat / bharat

భారత్​లో ప్రవేశించకుండా​ అడ్డుకున్నారు: బ్రిటన్ ఎంపీ - బ్రిటన్ ఎంపీ

సరైన వీసా ఉన్నప్పటికీ భారత్​లోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని బ్రిటన్​ ఎంపీ డెబ్బీ అబ్రహమ్స్​ ఆరోపించారు. తనకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా వీసా ఉపసంహరించినట్లు పేర్కొన్నారు. అయితే డెబ్బీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ ఖండించింది. వీసా రద్దైన విషయంపై ఆమెకు సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది.

British MP
బ్రిటన్ ఎంపీ
author img

By

Published : Feb 17, 2020, 7:34 PM IST

Updated : Mar 1, 2020, 3:37 PM IST

సరైన వీసా ఉన్నప్పటికీ భారత్​లోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని బ్రిటన్​కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు డెబ్బీ అబ్రహమ్స్​ ఆరోపించారు. గతంలో కశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దుపై ఆందోళన వ్యక్తం చేసిన లేబర్​ పార్టీకి చెందిన ఎంపీ... తనను దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్​కు పంపించినట్లు వెల్లడించారు.

తన కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్​ వచ్చినట్లు తెలిపారు డెబ్బీ. ఎలాంటి వివరణ ఇవ్వకుండా తన వీసాను ఉపసంహరించినట్లు ఆరోపించారు. అధికారుల తీరును ట్విట్టర్​ ద్వారా తీవ్రంగా తప్పుబట్టారు. తన వీసా ఎందుకు రద్దైందో అధికారులెవ్వరికీ తెలియకపోవడం బాధాకరమన్నారు.

"ఓ అధికారి నా వీసా రద్దు అయినట్లు చెప్పారు. తర్వాత నా పాస్​పోర్ట్ తీసుకున్నారు. 10 నిమిషాల వరకు పాస్​పోర్ట్ కనిపించలేదు. ఆయన తిరిగొచ్చి మొరటుగా వ్యవహరించాడు. తన వెంట రమ్మని అరిచాడు. అలా మాట్లాడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. నన్ను నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లి... ఆ ప్రాంతాన్ని బహిష్కరణ సెల్​గా మార్క్ చేశారు. అక్కడ కూర్చోమని ఆదేశిస్తే నేను ఒప్పుకోలేదు. వారు ఏం చేస్తారో, ఇంకెక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియలేదు. అందుకే ప్రజలు నన్ను చూడాలని అనుకున్నా."

-డెబ్బీ అబ్రహమ్స్​, బ్రిటన్ ఎంపీ

ఖండించిన హోంశాఖ

అయితే డెబ్బీ అబ్రహమ్స్​ ఆరోపణలను కేంద్ర హోంశాఖ ఖండించింది. 'ఈ-వీసా' రద్దైన విషయమై ఆమెకు సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది. సరైన వీసా లేకుండా భారత్​కు వచ్చినందునే తిరిగి పంపించినట్లు పేర్కొంది.

మరోవైపు ఫిబ్రవరి 13కు ముందు తనకు ఎలాంటి సమాచారం అందలేదని అబ్రహం చెప్పుకొచ్చారు.

బ్రిటీష్ హైకమిషన్ స్పందన

ఈ విషయానికి సంబంధించి భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. డెబ్బీని భారత్​లోకి ఎందుకు అనుమతించలేదన్న విషయంపై స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిపారు. దిల్లీ విమానాశ్రయంలో ఉన్న సమయంలో డెబ్బీకి దౌత్య సహాయం అందించినట్లు స్పష్టం చేశారు.

గత అక్టోబర్​లో ఈ-వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇది 2020 అక్టోబర్​ వరకు చెల్లుబాటు అవుతుంది.

ఆర్టికల్-370 రద్దుపై లేఖ

కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370ను భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన లేబర్​ పార్టీకి చెందిన ఎంపీల బృందంలో డెబ్బీ సైతం ఉన్నారు. ఆర్టికల్-370ను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూకే విదేశాంగ కార్యదర్శికి గతంలో లేఖ రాశారు. కశ్మీర్​ వివాదంపై నియమించిన పార్లమెంటరీ​ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.

రెండు రోజుల పర్యటన కోసం భారత్​కు వచ్చారు డెబ్బీ. అనంతరం మూడు రోజుల పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో పర్యటించనున్నట్లు సమాచారం.

సరైన వీసా ఉన్నప్పటికీ భారత్​లోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని బ్రిటన్​కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు డెబ్బీ అబ్రహమ్స్​ ఆరోపించారు. గతంలో కశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దుపై ఆందోళన వ్యక్తం చేసిన లేబర్​ పార్టీకి చెందిన ఎంపీ... తనను దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్​కు పంపించినట్లు వెల్లడించారు.

తన కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్​ వచ్చినట్లు తెలిపారు డెబ్బీ. ఎలాంటి వివరణ ఇవ్వకుండా తన వీసాను ఉపసంహరించినట్లు ఆరోపించారు. అధికారుల తీరును ట్విట్టర్​ ద్వారా తీవ్రంగా తప్పుబట్టారు. తన వీసా ఎందుకు రద్దైందో అధికారులెవ్వరికీ తెలియకపోవడం బాధాకరమన్నారు.

"ఓ అధికారి నా వీసా రద్దు అయినట్లు చెప్పారు. తర్వాత నా పాస్​పోర్ట్ తీసుకున్నారు. 10 నిమిషాల వరకు పాస్​పోర్ట్ కనిపించలేదు. ఆయన తిరిగొచ్చి మొరటుగా వ్యవహరించాడు. తన వెంట రమ్మని అరిచాడు. అలా మాట్లాడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. నన్ను నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లి... ఆ ప్రాంతాన్ని బహిష్కరణ సెల్​గా మార్క్ చేశారు. అక్కడ కూర్చోమని ఆదేశిస్తే నేను ఒప్పుకోలేదు. వారు ఏం చేస్తారో, ఇంకెక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియలేదు. అందుకే ప్రజలు నన్ను చూడాలని అనుకున్నా."

-డెబ్బీ అబ్రహమ్స్​, బ్రిటన్ ఎంపీ

ఖండించిన హోంశాఖ

అయితే డెబ్బీ అబ్రహమ్స్​ ఆరోపణలను కేంద్ర హోంశాఖ ఖండించింది. 'ఈ-వీసా' రద్దైన విషయమై ఆమెకు సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది. సరైన వీసా లేకుండా భారత్​కు వచ్చినందునే తిరిగి పంపించినట్లు పేర్కొంది.

మరోవైపు ఫిబ్రవరి 13కు ముందు తనకు ఎలాంటి సమాచారం అందలేదని అబ్రహం చెప్పుకొచ్చారు.

బ్రిటీష్ హైకమిషన్ స్పందన

ఈ విషయానికి సంబంధించి భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. డెబ్బీని భారత్​లోకి ఎందుకు అనుమతించలేదన్న విషయంపై స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిపారు. దిల్లీ విమానాశ్రయంలో ఉన్న సమయంలో డెబ్బీకి దౌత్య సహాయం అందించినట్లు స్పష్టం చేశారు.

గత అక్టోబర్​లో ఈ-వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇది 2020 అక్టోబర్​ వరకు చెల్లుబాటు అవుతుంది.

ఆర్టికల్-370 రద్దుపై లేఖ

కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370ను భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన లేబర్​ పార్టీకి చెందిన ఎంపీల బృందంలో డెబ్బీ సైతం ఉన్నారు. ఆర్టికల్-370ను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూకే విదేశాంగ కార్యదర్శికి గతంలో లేఖ రాశారు. కశ్మీర్​ వివాదంపై నియమించిన పార్లమెంటరీ​ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.

రెండు రోజుల పర్యటన కోసం భారత్​కు వచ్చారు డెబ్బీ. అనంతరం మూడు రోజుల పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో పర్యటించనున్నట్లు సమాచారం.

Last Updated : Mar 1, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.