ETV Bharat / bharat

ఇక రూ.13కే లీటర్​ వాటర్​ బాటిల్​- సర్కార్ కీలక నిర్ణయం

author img

By

Published : Feb 13, 2020, 3:38 PM IST

Updated : Mar 1, 2020, 5:32 AM IST

వాటర్ బాటిళ్ల ధరల కట్టడి దిశగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్​ తాగునీటి సీసాను రూ.13 మాత్రమే విక్రయించాలని తేల్చిచెప్పింది. ఇందుకోసం తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది.

water
ఇక రూ.13కే లీటర్​ వాటర్​ బాటిల్​- ప్రభుత్వ కీలక నిర్ణయం

లీటర్​ వాటర్​ బాటిల్​ను ఇకపై రూ.13కన్నా ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈమేరకు తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్​ జారీ చేసి, తక్కువ ధరకే వాటర్​ బాటిల్​ విక్రయించేలా చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం లీటర్​ తాగునీటి సీసా ధర రూ.20. అయితే ఈ ధర ఎక్కువగా ఉందని ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం.

"రెండు రోజుల్లో బాటిల్​ తాగునీరు ధర రూ.13గా నిర్ణయించినట్లు నోటిఫికేషన్​ జారీ చేస్తాము. న్యాయనిపుణుల సలహా ఆధారంగానే నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తాగునీటిని తీసుకొస్తున్నాం."

-పి.తిలోత్తమన్​, ఆహార, పౌర సరఫరా మంత్రి.

ప్రస్తుతం కేరళలో 200కుపైగా​ ప్యాకేజ్డ్​ తాగునీరు ఉత్పత్తిదారులు లైసెన్స్​ లేకుండా కంపెనీలు నడుపుతున్నారని... వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు తిలోత్తమన్.

నిరసనలు

రెండు సంవత్సరాలు క్రితమే కేరళ ప్రభుత్వం బాటిల్​ తాగునీటి ధరను రూ.11-12 తగ్గించాలని భావించింది. అయితే... వాటర్​ బాటిల్​ ఉత్పత్తిదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ధరల నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: భారత్​లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్​ షో

లీటర్​ వాటర్​ బాటిల్​ను ఇకపై రూ.13కన్నా ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈమేరకు తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్​ జారీ చేసి, తక్కువ ధరకే వాటర్​ బాటిల్​ విక్రయించేలా చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం లీటర్​ తాగునీటి సీసా ధర రూ.20. అయితే ఈ ధర ఎక్కువగా ఉందని ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం.

"రెండు రోజుల్లో బాటిల్​ తాగునీరు ధర రూ.13గా నిర్ణయించినట్లు నోటిఫికేషన్​ జారీ చేస్తాము. న్యాయనిపుణుల సలహా ఆధారంగానే నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తాగునీటిని తీసుకొస్తున్నాం."

-పి.తిలోత్తమన్​, ఆహార, పౌర సరఫరా మంత్రి.

ప్రస్తుతం కేరళలో 200కుపైగా​ ప్యాకేజ్డ్​ తాగునీరు ఉత్పత్తిదారులు లైసెన్స్​ లేకుండా కంపెనీలు నడుపుతున్నారని... వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు తిలోత్తమన్.

నిరసనలు

రెండు సంవత్సరాలు క్రితమే కేరళ ప్రభుత్వం బాటిల్​ తాగునీటి ధరను రూ.11-12 తగ్గించాలని భావించింది. అయితే... వాటర్​ బాటిల్​ ఉత్పత్తిదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ధరల నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: భారత్​లో డొనాల్డ్ ట్రంప్ భారీ రోడ్​ షో

Last Updated : Mar 1, 2020, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.