ETV Bharat / bharat

జాట్​ల ఓట్ల కోసం భాజపా 'ఆపరేషన్​ దేస్​వాలీ'! - అహిర్​వాల్​

హరియాణాలో 2014లో అధికారంలోకి వచ్చిన భాజపా... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత విస్తరించాలని అనుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకునేందుకు.. అన్ని ప్రాంతాల్లో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతసారి అహిర్​వాల్​ బెల్ట్​ను కైవసం చేసుకున్న కమలదళం... ఇప్పుడు జాట్ల ప్రాధాన్యం అధికంగా ఉండే దేస్​వాలీపై కన్నేసింది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలేంటో తెలుసా...?

హరియాణా: జాట్​లే లక్ష్యంగా 'దేస్​వాలీ'పై భాజపా దృష్టి..!
author img

By

Published : Oct 4, 2019, 6:20 PM IST

హరియాణా: జాట్​లే లక్ష్యంగా 'దేస్​వాలీ'పై భాజపా దృష్టి..!

2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది భాజపా. ఆ దిశగానే ఆయా రాష్ట్రాల్లో పాతుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల విషయంలో... 2014 సార్వత్రికం ముందు నుంచే కమలనాథులు వ్యూహాత్మకంగా ఉన్నారు. అలాంటి వాటిల్లో హరియాణా కూడా ఒకటి.

2013లో భాజపా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. కాంగ్రెస్​లో అత్యంత సీనియర్​ నాయకుడు రావ్​ ఇంద్రజిత్​సింగ్​ను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా.. హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రంలో 7 సెగ్మెంట్లు ఉండే అహిర్​వాల్​ను చేజిక్కించుకునేందుకే కాషాయ పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. 2013లో నరేంద్రమోదీని భాజపా ఎన్నికల ప్రచారకమిటీ ఛైర్మన్‌గా నియమించిన తర్వాత.. రేవారిలో నిర్వహించిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఇలా ప్రతి అంశంలోనూ సరైన దృక్పథంతో వ్యవహరించిన భాజపా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అహిర్​వాల్​ ప్రాంతంపై జెండా ఎగురవేసింది. పూర్తిస్థాయిలో విజయం సొంతం చేసుకుంది. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ సారి జాట్ల ప్రాధాన్యం అధికంగా ఉండే... దేస్​వాలీ ప్రాంతంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. ఇక్కడ అనాదిగా భూపెత్తందారులైన జాట్ల రాజ్యమే నడుస్తోంది. ఖాప్​ పంచాయతీల పాత్రా ఎక్కువే.

ఆపరేషన్​ దేస్​వాలీ...

2019 సార్వత్రికానికి చాలా ముందుగానే ఆపరేషన్​ దేస్​వాలీని.... పట్టాలెక్కించింది భాజపా. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత భూపిందర్​ సింగ్​ హుడా ప్రాబల్యం అధికంగా ఉండే రోహ్​తక్​పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్లాన్​లో భాగంగానే 2017 ఆగస్టులో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా 3 రోజుల పాటు రోహ్​తక్​లోనే ఉన్నారు.

రోహ్‌తక్‌, ఝజ్జార్, సోనీపట్ జిల్లాలు దేస్​వాలీ ప్రాంతంలోకి వస్తుండగా.. ఇక్కడున్న 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. అయితే అనంతరం వ్యూహాత్మకంగా పావులు కదిపిన భాజపా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భూపిందర్‌సింగ్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్‌సింగ్ హుడాను రోహ్‌తక్‌, సోనీపట్‌ నియోజకవర్గాల్లో ఓడించింది.

జింద్​ ఉపఎన్నికలో భారీ విజయం....

ఇటీవలి లోక్​సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో జరిగిన 5 మేయర్​ ఎన్నికల్లోనూ భాజపానే గెలిచింది. అనంతరం.. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జింద్​ ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి రణ్​దీప్​ సుర్జేవాలాతో పాటు ఐఎన్​ఎల్​డీ నేత దుష్యంత్​ చౌతాలాపై భాజపా అభ్యర్థి ఘనవిజయం సాధించారు.

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా దేస్​వాలీ ప్రాంతానికి చెందినవారే. మోదీ గత రెండేళ్ల వ్యవధిలో 3 అతిపెద్ద సమావేశాల్లో పాల్గొన్నారు. 2018 అక్టోబర్‌లో స్థానిక నేత చోటురామ్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మోదీ... ఆ తర్వాత రోహ్‌తక్ ప్రాంతంలో భారీ ఎన్నికల ర్యాలీ కూడా నిర్వహించారు.

75 ప్లస్​ సీట్లే లక్ష్యంగా...

ఇక గత నెలలో 3 లక్షల మంది పన్నా ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశానికి కూడా మోదీ హాజరై దిశా నిర్దేశం చేశారు. షా కూడా సమయం దొరికినప్పుడల్లా రోహ్‌తక్‌కు వెళ్లి వస్తున్నారు. చింతన్ శివార్స్ పేరిట అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి ఖట్టర్‌ కూడా జన్ ఆశీర్వాద్ యాత్రను రోహ్‌తక్‌లోనే ముగించారు. ఈ ఎన్నికల ప్రచారంలోనూ దేస్‌వాలీ ప్రాంతంలో జరిగే సభల్లో మోదీ, షా పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 90 సీట్లున్న హరియాణాలో 75 ప్లస్​ సీట్ల సాధనే లక్ష్యంగా... కమలనాథులు ఆబ్​కీ బార్​ 75 పార్​ నినాదంతో దూసుకెళ్తున్నారు.

దేస్‌వాలీ ప్రాంతంలో 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా పాగా వేయడం శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చినట్లు స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జీటీరోడ్‌ బెల్ట్‌, అహిర్‌వాల్‌ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించిన భాజపా దేస్‌వాలీలోనూ బలోపేతమై ఆధిపత్యం సంపూర్ణం చేయాలన్న కృతనిశ్చయంతో అక్టోబర్‌ 21 ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది.

ఇదీ చూడండి: హరియాణా పోరు: ఖట్టర్‌, హుడాల ప్రతిష్ఠకు సవాల్‌!

హరియాణా: జాట్​లే లక్ష్యంగా 'దేస్​వాలీ'పై భాజపా దృష్టి..!

2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది భాజపా. ఆ దిశగానే ఆయా రాష్ట్రాల్లో పాతుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల విషయంలో... 2014 సార్వత్రికం ముందు నుంచే కమలనాథులు వ్యూహాత్మకంగా ఉన్నారు. అలాంటి వాటిల్లో హరియాణా కూడా ఒకటి.

2013లో భాజపా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. కాంగ్రెస్​లో అత్యంత సీనియర్​ నాయకుడు రావ్​ ఇంద్రజిత్​సింగ్​ను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా.. హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రంలో 7 సెగ్మెంట్లు ఉండే అహిర్​వాల్​ను చేజిక్కించుకునేందుకే కాషాయ పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. 2013లో నరేంద్రమోదీని భాజపా ఎన్నికల ప్రచారకమిటీ ఛైర్మన్‌గా నియమించిన తర్వాత.. రేవారిలో నిర్వహించిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఇలా ప్రతి అంశంలోనూ సరైన దృక్పథంతో వ్యవహరించిన భాజపా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అహిర్​వాల్​ ప్రాంతంపై జెండా ఎగురవేసింది. పూర్తిస్థాయిలో విజయం సొంతం చేసుకుంది. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ సారి జాట్ల ప్రాధాన్యం అధికంగా ఉండే... దేస్​వాలీ ప్రాంతంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. ఇక్కడ అనాదిగా భూపెత్తందారులైన జాట్ల రాజ్యమే నడుస్తోంది. ఖాప్​ పంచాయతీల పాత్రా ఎక్కువే.

ఆపరేషన్​ దేస్​వాలీ...

2019 సార్వత్రికానికి చాలా ముందుగానే ఆపరేషన్​ దేస్​వాలీని.... పట్టాలెక్కించింది భాజపా. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత భూపిందర్​ సింగ్​ హుడా ప్రాబల్యం అధికంగా ఉండే రోహ్​తక్​పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్లాన్​లో భాగంగానే 2017 ఆగస్టులో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా 3 రోజుల పాటు రోహ్​తక్​లోనే ఉన్నారు.

రోహ్‌తక్‌, ఝజ్జార్, సోనీపట్ జిల్లాలు దేస్​వాలీ ప్రాంతంలోకి వస్తుండగా.. ఇక్కడున్న 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. అయితే అనంతరం వ్యూహాత్మకంగా పావులు కదిపిన భాజపా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భూపిందర్‌సింగ్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్‌సింగ్ హుడాను రోహ్‌తక్‌, సోనీపట్‌ నియోజకవర్గాల్లో ఓడించింది.

జింద్​ ఉపఎన్నికలో భారీ విజయం....

ఇటీవలి లోక్​సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో జరిగిన 5 మేయర్​ ఎన్నికల్లోనూ భాజపానే గెలిచింది. అనంతరం.. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జింద్​ ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి రణ్​దీప్​ సుర్జేవాలాతో పాటు ఐఎన్​ఎల్​డీ నేత దుష్యంత్​ చౌతాలాపై భాజపా అభ్యర్థి ఘనవిజయం సాధించారు.

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా దేస్​వాలీ ప్రాంతానికి చెందినవారే. మోదీ గత రెండేళ్ల వ్యవధిలో 3 అతిపెద్ద సమావేశాల్లో పాల్గొన్నారు. 2018 అక్టోబర్‌లో స్థానిక నేత చోటురామ్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మోదీ... ఆ తర్వాత రోహ్‌తక్ ప్రాంతంలో భారీ ఎన్నికల ర్యాలీ కూడా నిర్వహించారు.

75 ప్లస్​ సీట్లే లక్ష్యంగా...

ఇక గత నెలలో 3 లక్షల మంది పన్నా ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశానికి కూడా మోదీ హాజరై దిశా నిర్దేశం చేశారు. షా కూడా సమయం దొరికినప్పుడల్లా రోహ్‌తక్‌కు వెళ్లి వస్తున్నారు. చింతన్ శివార్స్ పేరిట అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి ఖట్టర్‌ కూడా జన్ ఆశీర్వాద్ యాత్రను రోహ్‌తక్‌లోనే ముగించారు. ఈ ఎన్నికల ప్రచారంలోనూ దేస్‌వాలీ ప్రాంతంలో జరిగే సభల్లో మోదీ, షా పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 90 సీట్లున్న హరియాణాలో 75 ప్లస్​ సీట్ల సాధనే లక్ష్యంగా... కమలనాథులు ఆబ్​కీ బార్​ 75 పార్​ నినాదంతో దూసుకెళ్తున్నారు.

దేస్‌వాలీ ప్రాంతంలో 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా పాగా వేయడం శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చినట్లు స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జీటీరోడ్‌ బెల్ట్‌, అహిర్‌వాల్‌ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించిన భాజపా దేస్‌వాలీలోనూ బలోపేతమై ఆధిపత్యం సంపూర్ణం చేయాలన్న కృతనిశ్చయంతో అక్టోబర్‌ 21 ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది.

ఇదీ చూడండి: హరియాణా పోరు: ఖట్టర్‌, హుడాల ప్రతిష్ఠకు సవాల్‌!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Beijing, China. 4th October 2019.
1-Dominic Thiem (Austria) beat Andy Murray (Great Britain) 6-2, 7-6 (7/3)
1. 00:00 Murray walks out on court
2. 00:03 Thiem walks out on court
3. 00:06 Murray saves set point at 2-5, 40/Ad in first set with forehand winner
4. 00:25 Thiem drop shot winner at 4-2, 0/30 in second set
5. 00:41 MATCH POINT - Thiem wins match with forehand winner
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:03
STORYLINE:
Top seed Dominic Thiem had declared Andy Murray 'one of the biggest legends in tennis' ahead of their China Open clash on Friday, but beat his hero 6-2, 7-6 (7/3) to book his spot in the semi-finals.
Despite the loss Murray, still making his return to the game following hip surgery, gave a performance to suggest he may improve enough to once again compete at the top level.
Thiem will face fourth seed Karen Khachanov in the last four.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.