ETV Bharat / bharat

దేశంలో 396కు చేరిన కరోనా కేసులు

author img

By

Published : Mar 22, 2020, 12:48 PM IST

Updated : Mar 22, 2020, 11:12 PM IST

corona death toll in india
భారత్​లో కరోనా మరణాలు

23:10 March 22

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య 396కు చేరింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) స్పష్టం చేసింది. 

21:37 March 22

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్​లో 360 మందికి వైరస్​ సోకినట్లు ధ్రువీకరించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో 41 మంది విదేశీయులున్నట్లు పేర్కొంది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారుకాగా, కర్ణాటక, పంజాబ్​, బిహార్​, గుజరాత్​, దిల్లీల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

బాధితుల్లో మరో 24 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ప్రస్తుతం 329 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 

ముగ్గురు విదేశీయులతో మహారాష్ట్రలో మొత్తం 67 మంది వైరస్​ బాధితులున్నారు. కేరళ 52, దిల్లీ 29, ఉత్తర్​ప్రదేశ్​ 27 కేసులతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటకలో 26, రాజస్థాన్​లో 24, తెలంగాణలో 22 మందికి కొవిడ్​ సోకింది.

18:01 March 22

రాజస్థాన్​లో 26 మందికి కరోనా..

జోధ్​పుర్​లో తాజాగా ఒకరికి కొవిడ్​-19 వైరస్​ సోకింది. రాజస్థాన్​లో మొత్తం 26 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. దేశవ్యాప్తంగా 341 కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 

16:57 March 22

భారత్​లో 7కు చేరిన కరోనా మృతులు

కరోనా మృతుల సంఖ్య భారత్​లో ఏడుకు చేరింది. ఇవాళ ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు విడిచారు. బిహార్​లో తొలి కరోనా మరణం నమోదైంది. ఖతార్​ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తి కొవిడ్​ సోకి మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సూరత్​ ఆసుపత్రిలో మరో వ్యక్తి మృతి చెందాడు. వీరిద్దరికీ కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు సమాచారం. ఇవాళ మహారాష్ట్రలో రెండో కరోనా మరణం సంభవించింది. కరోనా కేసులు 341కి చేరాయి.

  • దేశంలో 341కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • దేశంలో ఏడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
  • మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు మృతి
  • దిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, బిహార్‌, గుజరాత్‌లో ఒక్కొక్కరు మృతి

15:55 March 22

భారత్​లో మరో కరోనా మరణం..

కరోనా కారణంగా భారత్​లో మరో మరణం సంభవించింది. కరోనా పాజిటివ్​ నమోదైన ఓ 67 ఏళ్ల వ్యక్తి సూరత్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్​ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అతనికి ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నట్లు తెలుస్తోంది. 

14:40 March 22

భారత్​లో కరోనా కేసులు మరింత పెరిగాయి. మొత్తం 341 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

12:26 March 22

దేశంలో 396కు చేరిన కరోనా కేసులు

బిహార్​లో తొలి కరోనా మరణం నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని పట్నా ఎయిమ్స్​లో కిడ్నీ సంబంధిత వ్యాధితో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలినట్లు తెలిపారు. 

కరోనా కారణంగా ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. బిహార్​ వ్యక్తి మరణానికి కరోనానే కారణమా? కాదా? అన్నది ఆ శాఖ ధ్రువీకరించాల్సి ఉంది.

23:10 March 22

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య 396కు చేరింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) స్పష్టం చేసింది. 

21:37 March 22

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్​లో 360 మందికి వైరస్​ సోకినట్లు ధ్రువీకరించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో 41 మంది విదేశీయులున్నట్లు పేర్కొంది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారుకాగా, కర్ణాటక, పంజాబ్​, బిహార్​, గుజరాత్​, దిల్లీల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

బాధితుల్లో మరో 24 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ప్రస్తుతం 329 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 

ముగ్గురు విదేశీయులతో మహారాష్ట్రలో మొత్తం 67 మంది వైరస్​ బాధితులున్నారు. కేరళ 52, దిల్లీ 29, ఉత్తర్​ప్రదేశ్​ 27 కేసులతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటకలో 26, రాజస్థాన్​లో 24, తెలంగాణలో 22 మందికి కొవిడ్​ సోకింది.

18:01 March 22

రాజస్థాన్​లో 26 మందికి కరోనా..

జోధ్​పుర్​లో తాజాగా ఒకరికి కొవిడ్​-19 వైరస్​ సోకింది. రాజస్థాన్​లో మొత్తం 26 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. దేశవ్యాప్తంగా 341 కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 

16:57 March 22

భారత్​లో 7కు చేరిన కరోనా మృతులు

కరోనా మృతుల సంఖ్య భారత్​లో ఏడుకు చేరింది. ఇవాళ ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు విడిచారు. బిహార్​లో తొలి కరోనా మరణం నమోదైంది. ఖతార్​ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తి కొవిడ్​ సోకి మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సూరత్​ ఆసుపత్రిలో మరో వ్యక్తి మృతి చెందాడు. వీరిద్దరికీ కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు సమాచారం. ఇవాళ మహారాష్ట్రలో రెండో కరోనా మరణం సంభవించింది. కరోనా కేసులు 341కి చేరాయి.

  • దేశంలో 341కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • దేశంలో ఏడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
  • మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు మృతి
  • దిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, బిహార్‌, గుజరాత్‌లో ఒక్కొక్కరు మృతి

15:55 March 22

భారత్​లో మరో కరోనా మరణం..

కరోనా కారణంగా భారత్​లో మరో మరణం సంభవించింది. కరోనా పాజిటివ్​ నమోదైన ఓ 67 ఏళ్ల వ్యక్తి సూరత్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్​ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అతనికి ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నట్లు తెలుస్తోంది. 

14:40 March 22

భారత్​లో కరోనా కేసులు మరింత పెరిగాయి. మొత్తం 341 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

12:26 March 22

దేశంలో 396కు చేరిన కరోనా కేసులు

బిహార్​లో తొలి కరోనా మరణం నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని పట్నా ఎయిమ్స్​లో కిడ్నీ సంబంధిత వ్యాధితో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలినట్లు తెలిపారు. 

కరోనా కారణంగా ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. బిహార్​ వ్యక్తి మరణానికి కరోనానే కారణమా? కాదా? అన్నది ఆ శాఖ ధ్రువీకరించాల్సి ఉంది.

Last Updated : Mar 22, 2020, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.