ETV Bharat / bharat

బిహార్​ బరి: కంచు కోటలపై పట్టు నిలిచేనా?

author img

By

Published : Oct 6, 2020, 5:34 PM IST

బిహార్​ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు వాడి పెంచాయి. అధికార జేడీయూ ఆరోపణలను ఆర్జేడీ తిప్పికొడుతూనే.. తమ ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దశబ్దాలుగా రాష్ట్ర​ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన లాలూ కుటుంబం పోటీ చేసే స్థానాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఆర్జేడీకి కంచుకోటల్లా ఉన్న.. ఛాప్రా, రఘోపుర్​, మహువా స్థానాల సంగతేంటి ?

Bihar election
బిహార్​ బరి: లాలూ వారసత్వ స్థానాలపై ప్రత్యేక గురి

బిహార్​ ఎన్నికల్లో పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కూటములు కట్టిన పక్షాలన్నీ... పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అధికార జేడీయూ... ఆర్జేడీపై వారసత్వ రాజకీయాలంటూ విమర్శల బాణాలు సంధిస్తోంది. ప్రతిపక్ష ఆర్జేడీ సైతం.. బిహార్​ ప్రజలను నితీశ్​ కుమార్ అభివృద్ధి పేరుతో మోసం చేశారంటూ మాటల తూటాలు వదులుతోంది. మొత్తంగా బిహార్​ రాజకీయం వేడెక్కింది.

కుటుంబ స్థానాలు..

ఈ పరిస్థితుల్లోనే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 144 స్థానాల్లో పోటీ చేయనున్న ఆర్జేడీ.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుటుంబం పోటీ చేయనున్న స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ కుటుంబానికి కంచుకోటలా ఉన్న ఛాప్రా, రఘోపుర్​, మహువా స్థానాల్లో మరోసారి ఆర్జేడీ లాంతరు వెలుగులు జిమ్ముతుందా ? ఆ స్థానాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తే...

లాలూ ప్రసాద్​ యాదవ్​.. ఏళ్లుగా ఛాప్రా నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి రఘోపుర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. ఇప్పుడు వారసత్వంగా తేజస్వీ యదవ్​ అందుకున్నారు.

ప్రధానంగా ఛాప్రా, రఘోపుర్​ స్థానాలు.. ఈ ఎన్నికల్లోనూ కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో లాలూ మొదటి కుమారుడు తేజ్​ ప్రతాప్​.. మహువా స్థానం నుంచి పోటీ చేశారు.

lalu
లాలూ కుటుంబ సభ్యుల పోటీ

ఛాప్రా.. లాలూ ఇలాఖా..

లాలూ కుటుంబానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం ఛాప్రా. బిహార్​ రాజకీయ వర్గాలు ఇది లాలూకు పెట్టని కోటగా భావిస్తాయి. అయితే, 2010లో భాజపా అభ్యర్థి జనార్ధన్​ సిగ్రివాల్ ఈ స్థానం నుంచి విజయం సాధించి సంచలనం సృష్టించారు.

2014లో జనార్ధన్​ లోక్​సభకు ఎన్నికైన అనంతరం.. ఉప ఎన్నికలో ఈ స్థానం తిరిగి దక్కించుకుంది ఆర్జేడీ.

2015లో వికసించిన కమలం

ఛాప్రాలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి... ఆర్జేడీ నేతపై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీ చేసిన ఎన్నికలివి. 57.87% ఓటింగ్​ నమోదైన ఈ స్థానంలో భాజపా 45శాతం ఓట్లు దక్కించుకోగా.. ఆర్జేడీ 38కే పరిమితమైంది.

మొత్తంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆర్జేడీ 2014 ఉపఎన్నికల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. జేడీయూ-భాజపా చెరో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది.

రఘోపుర్​లో హవా..

రఘోపుర్​ అసెంబ్లీ స్థానానికి బిహార్​ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైశాలి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి.. 1995లో లాలూ ప్రసాద్​ యాదవ్​ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా జనతాదళ్​ నుంచి పోటీలోకి దిగి విజయం సాధించారు లాలూ.

lalu-rabri
లాలూ-రబ్రీదేవి

రబ్రీదేవికి పట్టం..

1997లో లాలూ జైలు పాలైన తర్వాత.. రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2010లో మొదటిసారిగా ఈ స్థానం కోల్పోయింది ఆర్జేడీ. జేడీయూ అభ్యర్థి సతీశ్​ కుమార్​ చేతిలో రబ్రీదేవి ఓటమి పాలయ్యారు.

లాలూ తనయుడు తేజస్వీ యాదవ్​

ఇప్పుడిదే స్థానం నుంచి తేజస్వీ ?

2015లో లాలూ తనయుడు తేజస్వీ యాదవ్​ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రఘోపుర్​ స్థానం నుంచి భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. ఈ నేపథ్యంలోనే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన.. మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

మరోవైపు ఈ నియోజకవర్గానికి 3సార్లు ప్రాతినిధ్యం వహించిన భోళా రాయ్​.. తాజాగా జేడీయూలో చేరారు. ఈ పోరు ఆసక్తికరంగా మారనుంది.

tajaswi
తేజస్వీ యాదవ్

ప్రస్తుతం భిన్నంగా పరిస్థితులు..

రఘోపుర్​ అసెంబ్లీ స్థానంలో పరిస్థితులు క్రమంగా మారుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ సంయుక్తంగా పోటీ చేశాయి. ఈసారి తేజస్వీ యాదవ్​కు పోటీగా ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఎన్డీఏ కసరత్తులు చేస్తోంది. 2015లో తేజస్వీ 23,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

tej pratap
లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్​

ఆసక్తికరంగా మహువా పోరు

ఆర్జేడీ మహువా స్థానంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈసారి పోరు ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్​.. వేరే చోట నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. సమస్తీపుర్​లోని హసన్​పుర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

గత ఎన్నికల్లో తేజ్​ ప్రతాప్​.. హెచ్​ఏఎం పార్టీ అభ్యర్థిపై 28,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానంలో అంతకుముందు రెండుసార్లు విజయం సాధించిన ఆర్జేడీ. 2010లో జేడీయూకు కోల్పోయింది.

మొత్తంగా బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆధిపత్యం నిలబెట్టుకుని.. అధికార పీఠం దక్కించుకోవాలంటే ఈ స్థానాల్లో గెలుపు కీలకమని ఆర్జేడీ భావిస్తుండగా.. లాలూ కుటుంబానికి షాక్​ ఇవ్వాలని ఎన్డీఏ పార్టీలు ప్రణాళికు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్​-70 స్థానాల్లో పోటీ

ఇదీ చూడండి: భాజపా- జేడీయూ మధ్య సీట్ల పంపకం ఎలా?

బిహార్​ ఎన్నికల్లో పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కూటములు కట్టిన పక్షాలన్నీ... పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అధికార జేడీయూ... ఆర్జేడీపై వారసత్వ రాజకీయాలంటూ విమర్శల బాణాలు సంధిస్తోంది. ప్రతిపక్ష ఆర్జేడీ సైతం.. బిహార్​ ప్రజలను నితీశ్​ కుమార్ అభివృద్ధి పేరుతో మోసం చేశారంటూ మాటల తూటాలు వదులుతోంది. మొత్తంగా బిహార్​ రాజకీయం వేడెక్కింది.

కుటుంబ స్థానాలు..

ఈ పరిస్థితుల్లోనే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 144 స్థానాల్లో పోటీ చేయనున్న ఆర్జేడీ.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుటుంబం పోటీ చేయనున్న స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ కుటుంబానికి కంచుకోటలా ఉన్న ఛాప్రా, రఘోపుర్​, మహువా స్థానాల్లో మరోసారి ఆర్జేడీ లాంతరు వెలుగులు జిమ్ముతుందా ? ఆ స్థానాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తే...

లాలూ ప్రసాద్​ యాదవ్​.. ఏళ్లుగా ఛాప్రా నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి రఘోపుర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. ఇప్పుడు వారసత్వంగా తేజస్వీ యదవ్​ అందుకున్నారు.

ప్రధానంగా ఛాప్రా, రఘోపుర్​ స్థానాలు.. ఈ ఎన్నికల్లోనూ కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో లాలూ మొదటి కుమారుడు తేజ్​ ప్రతాప్​.. మహువా స్థానం నుంచి పోటీ చేశారు.

lalu
లాలూ కుటుంబ సభ్యుల పోటీ

ఛాప్రా.. లాలూ ఇలాఖా..

లాలూ కుటుంబానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం ఛాప్రా. బిహార్​ రాజకీయ వర్గాలు ఇది లాలూకు పెట్టని కోటగా భావిస్తాయి. అయితే, 2010లో భాజపా అభ్యర్థి జనార్ధన్​ సిగ్రివాల్ ఈ స్థానం నుంచి విజయం సాధించి సంచలనం సృష్టించారు.

2014లో జనార్ధన్​ లోక్​సభకు ఎన్నికైన అనంతరం.. ఉప ఎన్నికలో ఈ స్థానం తిరిగి దక్కించుకుంది ఆర్జేడీ.

2015లో వికసించిన కమలం

ఛాప్రాలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి... ఆర్జేడీ నేతపై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీ చేసిన ఎన్నికలివి. 57.87% ఓటింగ్​ నమోదైన ఈ స్థానంలో భాజపా 45శాతం ఓట్లు దక్కించుకోగా.. ఆర్జేడీ 38కే పరిమితమైంది.

మొత్తంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆర్జేడీ 2014 ఉపఎన్నికల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. జేడీయూ-భాజపా చెరో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది.

రఘోపుర్​లో హవా..

రఘోపుర్​ అసెంబ్లీ స్థానానికి బిహార్​ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైశాలి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి.. 1995లో లాలూ ప్రసాద్​ యాదవ్​ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా జనతాదళ్​ నుంచి పోటీలోకి దిగి విజయం సాధించారు లాలూ.

lalu-rabri
లాలూ-రబ్రీదేవి

రబ్రీదేవికి పట్టం..

1997లో లాలూ జైలు పాలైన తర్వాత.. రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2010లో మొదటిసారిగా ఈ స్థానం కోల్పోయింది ఆర్జేడీ. జేడీయూ అభ్యర్థి సతీశ్​ కుమార్​ చేతిలో రబ్రీదేవి ఓటమి పాలయ్యారు.

లాలూ తనయుడు తేజస్వీ యాదవ్​

ఇప్పుడిదే స్థానం నుంచి తేజస్వీ ?

2015లో లాలూ తనయుడు తేజస్వీ యాదవ్​ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రఘోపుర్​ స్థానం నుంచి భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. ఈ నేపథ్యంలోనే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన.. మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

మరోవైపు ఈ నియోజకవర్గానికి 3సార్లు ప్రాతినిధ్యం వహించిన భోళా రాయ్​.. తాజాగా జేడీయూలో చేరారు. ఈ పోరు ఆసక్తికరంగా మారనుంది.

tajaswi
తేజస్వీ యాదవ్

ప్రస్తుతం భిన్నంగా పరిస్థితులు..

రఘోపుర్​ అసెంబ్లీ స్థానంలో పరిస్థితులు క్రమంగా మారుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ సంయుక్తంగా పోటీ చేశాయి. ఈసారి తేజస్వీ యాదవ్​కు పోటీగా ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఎన్డీఏ కసరత్తులు చేస్తోంది. 2015లో తేజస్వీ 23,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

tej pratap
లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్​

ఆసక్తికరంగా మహువా పోరు

ఆర్జేడీ మహువా స్థానంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈసారి పోరు ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్​.. వేరే చోట నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. సమస్తీపుర్​లోని హసన్​పుర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

గత ఎన్నికల్లో తేజ్​ ప్రతాప్​.. హెచ్​ఏఎం పార్టీ అభ్యర్థిపై 28,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానంలో అంతకుముందు రెండుసార్లు విజయం సాధించిన ఆర్జేడీ. 2010లో జేడీయూకు కోల్పోయింది.

మొత్తంగా బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆధిపత్యం నిలబెట్టుకుని.. అధికార పీఠం దక్కించుకోవాలంటే ఈ స్థానాల్లో గెలుపు కీలకమని ఆర్జేడీ భావిస్తుండగా.. లాలూ కుటుంబానికి షాక్​ ఇవ్వాలని ఎన్డీఏ పార్టీలు ప్రణాళికు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్​-70 స్థానాల్లో పోటీ

ఇదీ చూడండి: భాజపా- జేడీయూ మధ్య సీట్ల పంపకం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.