బిహార్లోని ముజాఫర్పూర్లో 'ఎక్యూట్ ఎన్సెఫాలిటీస్ సిండ్రోమ్' (మెదడు వాపు) తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం 38 మంది ఈ వ్యాధితో స్థానిక శ్రీ కృష్ణ ఆసుపత్రిలో చేరగా... వీరిలో 14 మంది చనిపోయారని మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారేనని వైద్యులు నిర్ధరించారు. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలంలో నీటి వలన వస్తుందని తెలిపారు.
మెదడువాపు లక్షణాలు
తీవ్ర జ్వరం, శరీరం సత్తువ కోల్పోవడం మెదడు వాపు లక్షణాలని వైద్యులు తెలిపారు. ఇటువంటి లక్షణాలతో ఉన్న పిల్లలను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బిహార్ వ్యాప్తంగా మెదడు వాపుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి : రైతులందరికీ 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి'