ETV Bharat / bharat

పీడీపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరేసిన భాజపా - భాజపా

జమ్ముకశ్మీర్​ విలీన దినోత్సవాన్ని నిర్వహించింది స్థానిక భాజపా విభాగం. ఈ క్రమంలోనే జమ్మూలోని పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీపీ) కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు భాజపా కార్యకర్తలు. శ్రీనగర్​లోని క్లాక్​ టవర్​ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

jammukashmir accession day
జమ్ముకశ్మీర్​ విలీన దినోత్సవం
author img

By

Published : Oct 26, 2020, 12:30 PM IST

జమ్ముకశ్మీర్​ విలీన దినోత్సవాన్ని నిర్వహించింది స్థానిక భారతీయ జనతా పార్టీ విభాగం. కశ్మీర్​ను భారత్​లో విలీనం చేసేందుకు మహారాజా హరిసింగ్​ 1947, అక్టోబర్​ 26న సంతకం చేయడాన్ని పురస్కరించుకుని నిర్వహించినట్లు భాజపా తెలిపింది. పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించింది.

పీడీపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరేసిన భాజపా

ఈ క్రమంలోనే.. జమ్ముకశ్మీర్​ జెండా తమ చేతికి తిరిగి వచ్చే వరకు ఏ జెండాను ఎత్తబోమని పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొనటంపై నిరసన వ్యక్తం చేసింది భాజపా. జమ్మూలోని పీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి.. జాతీయ పతాకాన్ని ఎగరేశారు భాజపా కార్యకర్తలు. భారత్​ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శ్రీనగర్​లో ఉద్రిక్తత..

శ్రీనగర్​లోని క్లాక్​ టవర్​ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పలువురు భాజపా కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​ జెండా తిరిగొస్తేనే జాతీయ పతాకానికి జై'

ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్​

జమ్ముకశ్మీర్​ విలీన దినోత్సవాన్ని నిర్వహించింది స్థానిక భారతీయ జనతా పార్టీ విభాగం. కశ్మీర్​ను భారత్​లో విలీనం చేసేందుకు మహారాజా హరిసింగ్​ 1947, అక్టోబర్​ 26న సంతకం చేయడాన్ని పురస్కరించుకుని నిర్వహించినట్లు భాజపా తెలిపింది. పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించింది.

పీడీపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగరేసిన భాజపా

ఈ క్రమంలోనే.. జమ్ముకశ్మీర్​ జెండా తమ చేతికి తిరిగి వచ్చే వరకు ఏ జెండాను ఎత్తబోమని పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొనటంపై నిరసన వ్యక్తం చేసింది భాజపా. జమ్మూలోని పీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి.. జాతీయ పతాకాన్ని ఎగరేశారు భాజపా కార్యకర్తలు. భారత్​ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శ్రీనగర్​లో ఉద్రిక్తత..

శ్రీనగర్​లోని క్లాక్​ టవర్​ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పలువురు భాజపా కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​ జెండా తిరిగొస్తేనే జాతీయ పతాకానికి జై'

ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.