టోల్బూత్ను లేపేసి.. బైక్ను ఢీకొట్టిన లారీ తమిళనాడు కృష్టగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే టోల్ప్లాజా వద్ద ఓ లారీ విధ్వంసం సృష్టించింది. ఇద్దరు వ్యక్తులను బలిగొంది.వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. టోల్బూత్ను ధ్వంసం చేసింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.
ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు.. చిన్న పిల్లలు కూర్చున్న ఓ బైక్ ఆ ప్రమాద ప్రదేశంలో ఉంది. అయితే.. అదృష్టవశాత్తు ఒక్క క్షణం ముందు ఆ వాహనం ముందుకు వెళ్లడం వల్ల చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి:ప్రశ్నాపత్రంలో 'గ్యాంబ్లింగ్'కు బదులు 'గాంధీజీ'..!