ETV Bharat / bharat

పాక్​ దుర్నీతికి మరో భారతీయ జవాను బలి

సరిహద్దు వెంబడి పాకిస్థాన్​ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది​. జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద జరిపిన కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి పాకిస్థాన్​ బలగాలు.

author img

By

Published : Mar 24, 2019, 1:26 PM IST

Updated : Mar 24, 2019, 2:42 PM IST

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్​
పాకిస్థాన్​ బలగాల కాల్పుల్లో భారత జవాను మృతి
ఓ వైపు ఇరు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నామని ప్రసంగాలు చేస్తూనే... మరోవైపు సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది.

శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని షాపూర్​, కెర్నీ ప్రాంతాల్లో భారత జవాన్లు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. మోర్టార్​ బాంబులను విసిరాయి. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. భారత బలగాలు దీటుగా స్పందించాయి.

నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లు...

గత నాలుగు రోజులుగా పాకిస్థాన్​ దుశ్చర్యలకు ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుందర్బాని సెక్టార్​లో జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్​ యష్​ పాల్​ మృతి చెందాడు.

2018లో 2,936 ఘటనలు

ఈ ఏడాది ఇప్పటి వరకు 125 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​.

2003లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 15 ఏళ్లలో అత్యధికంగా 2018లోనే 2,936 ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండీ: మాలిలో వేటగాళ్ల ఊచకోతకు 115 మంది బలి

పాకిస్థాన్​ బలగాల కాల్పుల్లో భారత జవాను మృతి
ఓ వైపు ఇరు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నామని ప్రసంగాలు చేస్తూనే... మరోవైపు సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది.

శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని షాపూర్​, కెర్నీ ప్రాంతాల్లో భారత జవాన్లు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. మోర్టార్​ బాంబులను విసిరాయి. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. భారత బలగాలు దీటుగా స్పందించాయి.

నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లు...

గత నాలుగు రోజులుగా పాకిస్థాన్​ దుశ్చర్యలకు ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుందర్బాని సెక్టార్​లో జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్​ యష్​ పాల్​ మృతి చెందాడు.

2018లో 2,936 ఘటనలు

ఈ ఏడాది ఇప్పటి వరకు 125 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​.

2003లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 15 ఏళ్లలో అత్యధికంగా 2018లోనే 2,936 ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండీ: మాలిలో వేటగాళ్ల ఊచకోతకు 115 మంది బలి

Mumbai, Mar 24 (ANI): The second day of Bombay Times Fashion week witnessed exclusive sight of courageous women on wheelchair. These extraordinary women showed their unwavering spirit on ramp. Exceptional talent of these women on wheel left the audience mesmerised. The great initiative was taken by Viviana Mall. The three-day fashion extravaganza is being held at the St Regis Mumbai.
Last Updated : Mar 24, 2019, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.