ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వెంబడి భారీగా భద్రత బలగాల మోహరింపు ​

author img

By

Published : Sep 19, 2020, 9:32 PM IST

Updated : Sep 19, 2020, 11:03 PM IST

పాక్​ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరిస్తుంది భారత్​. అక్రమ​ చొరబాట్లు, ఉగ్రవాదులను అడ్డుకొనేందుకే ఉత్తర కశ్మీర్​లోని గురుజ్​ సెక్టార్​ వద్ద భారీగా భద్రత పెంచుతోంది.

Army deploys additional brigade on LoC to plug infiltration from Pakistan
పాక్​ సరిహద్దుల్లో భారీగా భద్రత బలగాల మోహరింపు ​

దాయాది దేశం పాక్​ ఉగ్రకుట్రలను భగ్నం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది భారత్​. నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకొనేందుకు జమ్ముకశ్మీర్​లోని గురుజ్​ సెక్టార్​ వద్ద సైన్యాన్ని పెంచుతుంది​. పాక్​ సరిహద్దుల్లో అదనంగా 3000 మంది సైనికులను మోహరించింది.

పాక్​ ఆటలు సాగలేదు!

అదనపు బలగాల మోహరింపు వల్ల చొరబాటు దారులు, ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు. అక్టోబర్​-నవంబర్​ మధ్య ఎక్కువ మంచు కురిసే కాలంలో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ చేసిన వ్యూహాలు​ విఫలమయ్యాయని చెప్పారు. ఉత్తర్​ కశ్మీర్​లోని గురుజ్​ సెక్టార్​ వద్ద భారత్​ సేనలు చురుకుగా పని చేస్తున్నాయని... అందువల్ల పాక్​ ఆటలు సాగలేదన్నారు.

పీఎంకేలో పాక్​ అదనపు సైనిక బలగాలు ఉన్నాయి. అయితే చైనాకు మద్దతుగా వారు అక్కడ ఉన్నట్లు చెప్పలేమన్నారా అధికారి. భారత్​ను దెబ్బతీసేందుకు పాక్ ప్రయత్నిస్తే... దీటుగా తిప్పికొట్టేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మిలటరీ క్యాంటీన్​లో 'మేడ్​ ఇన్​​ ఇండియా' అమలవుతోందా..?

దాయాది దేశం పాక్​ ఉగ్రకుట్రలను భగ్నం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది భారత్​. నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకొనేందుకు జమ్ముకశ్మీర్​లోని గురుజ్​ సెక్టార్​ వద్ద సైన్యాన్ని పెంచుతుంది​. పాక్​ సరిహద్దుల్లో అదనంగా 3000 మంది సైనికులను మోహరించింది.

పాక్​ ఆటలు సాగలేదు!

అదనపు బలగాల మోహరింపు వల్ల చొరబాటు దారులు, ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు. అక్టోబర్​-నవంబర్​ మధ్య ఎక్కువ మంచు కురిసే కాలంలో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ చేసిన వ్యూహాలు​ విఫలమయ్యాయని చెప్పారు. ఉత్తర్​ కశ్మీర్​లోని గురుజ్​ సెక్టార్​ వద్ద భారత్​ సేనలు చురుకుగా పని చేస్తున్నాయని... అందువల్ల పాక్​ ఆటలు సాగలేదన్నారు.

పీఎంకేలో పాక్​ అదనపు సైనిక బలగాలు ఉన్నాయి. అయితే చైనాకు మద్దతుగా వారు అక్కడ ఉన్నట్లు చెప్పలేమన్నారా అధికారి. భారత్​ను దెబ్బతీసేందుకు పాక్ ప్రయత్నిస్తే... దీటుగా తిప్పికొట్టేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మిలటరీ క్యాంటీన్​లో 'మేడ్​ ఇన్​​ ఇండియా' అమలవుతోందా..?

Last Updated : Sep 19, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.