ETV Bharat / bharat

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

author img

By

Published : Nov 21, 2019, 12:47 PM IST

Updated : Nov 21, 2019, 3:44 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలపై అడిగే ప్రతి ప్రశ్నకు జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం సమాధానం చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. కశ్మీర్​లో ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'
'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై లేవనెత్తే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

విచారణకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సుప్రీం కోర్టు పలు విషయాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

" మిస్టర్​ మెహతా.. కశ్మీర్​లో ఆంక్షలపై పిటిషనర్లు సంధించే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మీరు దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్ ఎలాంటి సాయం చేయలేదు. ఈ అంశంపై మీరు సరైన దృష్టి సారించడం లేదనే భావనను కల్పించరాదు."
- సుప్రీం ధర్మాసనం

సుప్రీం వ్యాఖ్యలపై సొలిసిటర్​ జనరల్​ స్పందిస్తూ... ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లలో అవాస్తవాలు ఉన్నాయన్నారు. వాదన జరిగే సమయంలో ప్రతి అంశంపైనా స్పందిస్తానని తెలిపారు. జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయని.. అందుకే అక్కడి స్థితిగతులపై నివేదిక ఉన్నప్పటికీ న్యాయస్థానానికి సమర్పించలేదని ధర్మాసనానికి వివరించారు. ఆ నివేదిక సమర్పించే సమయంలో కశ్మీర్​ వాస్తవ పరిస్థితులను కోర్టుకు తెలియజేస్తానని స్పష్టం చేశారు.

నిర్బంధంపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుతం విచారించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంక్షలపై దాఖలైన పిటిషన్లకే పరిమితం అవుతున్నట్లు తెలిపింది.

'కశ్మీర్​ ఆంక్షలపై ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందే'

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై లేవనెత్తే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

విచారణకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సుప్రీం కోర్టు పలు విషయాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

" మిస్టర్​ మెహతా.. కశ్మీర్​లో ఆంక్షలపై పిటిషనర్లు సంధించే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మీరు దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్ ఎలాంటి సాయం చేయలేదు. ఈ అంశంపై మీరు సరైన దృష్టి సారించడం లేదనే భావనను కల్పించరాదు."
- సుప్రీం ధర్మాసనం

సుప్రీం వ్యాఖ్యలపై సొలిసిటర్​ జనరల్​ స్పందిస్తూ... ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లలో అవాస్తవాలు ఉన్నాయన్నారు. వాదన జరిగే సమయంలో ప్రతి అంశంపైనా స్పందిస్తానని తెలిపారు. జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయని.. అందుకే అక్కడి స్థితిగతులపై నివేదిక ఉన్నప్పటికీ న్యాయస్థానానికి సమర్పించలేదని ధర్మాసనానికి వివరించారు. ఆ నివేదిక సమర్పించే సమయంలో కశ్మీర్​ వాస్తవ పరిస్థితులను కోర్టుకు తెలియజేస్తానని స్పష్టం చేశారు.

నిర్బంధంపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుతం విచారించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆంక్షలపై దాఖలైన పిటిషన్లకే పరిమితం అవుతున్నట్లు తెలిపింది.

Mumbai, Nov 21 (ANI): Actor Emraan Hashmi will be soon seen on silver screens with film 'The Body'. He is busy with promotions of his upcoming flick. Looking dapper in jacket, white shirt and denims, Emraan was snapped during a promotional event. Helmed by Jeethu Joseph, the movie is a thriller drama. 'The Body' will hit theaters on December 13.
Last Updated : Nov 21, 2019, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.