ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్: విమానంలో కార్మికుల తరలింపు - labourers latest news

లాక్​డౌన్​తో కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం రైలు, రోడ్డు మార్గాల్లో తరలించే వీలు లేదు. దాంతో కర్ణాటకకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ ఐదుగురు కార్మికులను విమానంలో తీసుకొచ్చింది. మరో ఐదుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

builders fly in workers
విమానంలో భవన నిర్మాణ కార్మికుల తరలింపు!
author img

By

Published : Jul 6, 2020, 10:29 PM IST

కరోనా మహమ్మారితో కూలీలంతా స్వరాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆయా రాష్ట్రాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. కార్మికులు లేక పలు పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ బంగాల్​ నుంచి ఐదుగురు కార్మికులను ఆకాశమార్గాన తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి సుమారు రూ.7,500 విలువైన విమాన టికెట్లు కొనుగోలు చేశారు బిల్డర్లు.

ప్రస్తుతం కర్ణాటకలో కూలీల కొరత ఏర్పడింది. దాంతో బంగాల్​ నుంచి నైపుణ్య ఉన్న కార్మికులను తీసుకురావాలని బిల్డర్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓ సమస్య ఎదురైంది. ప్రస్తుతం అంతర్​రాష్ట్రాల మధ్య రైలు సేవలు లేవు. రోడ్డు మార్గం ద్వారా రావాలంటే నాలుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఐదుగురిని విమానంలో తీసుకురావాలని నిశ్చయించుకుని.. వారికి టికెట్లు వేశారు.

"భవన నిర్మాణ రంగంలోని కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిన క్రమంలో కొరత ఏర్పడింది. దాంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాంతో బంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులను నియమించుకున్నాం. ప్రస్తుతం వారు క్వారంటైన్​లో ఉన్నారు. మరో ఐదుగురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు."

- నవీన్​ కార్డోజ, బిల్డర్​

కరోనా మహమ్మారితో కూలీలంతా స్వరాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆయా రాష్ట్రాల్లో కార్మికుల కొరత ఏర్పడింది. కార్మికులు లేక పలు పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ బంగాల్​ నుంచి ఐదుగురు కార్మికులను ఆకాశమార్గాన తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి సుమారు రూ.7,500 విలువైన విమాన టికెట్లు కొనుగోలు చేశారు బిల్డర్లు.

ప్రస్తుతం కర్ణాటకలో కూలీల కొరత ఏర్పడింది. దాంతో బంగాల్​ నుంచి నైపుణ్య ఉన్న కార్మికులను తీసుకురావాలని బిల్డర్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓ సమస్య ఎదురైంది. ప్రస్తుతం అంతర్​రాష్ట్రాల మధ్య రైలు సేవలు లేవు. రోడ్డు మార్గం ద్వారా రావాలంటే నాలుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఐదుగురిని విమానంలో తీసుకురావాలని నిశ్చయించుకుని.. వారికి టికెట్లు వేశారు.

"భవన నిర్మాణ రంగంలోని కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిన క్రమంలో కొరత ఏర్పడింది. దాంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాంతో బంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులను నియమించుకున్నాం. ప్రస్తుతం వారు క్వారంటైన్​లో ఉన్నారు. మరో ఐదుగురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు."

- నవీన్​ కార్డోజ, బిల్డర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.