ETV Bharat / bharat

'సరిహద్దులో కమాండర్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Aug 7, 2020, 10:40 PM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా తూర్పు కమాండ్​ను సందర్శించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధతతో ఉండాలని కమాండర్లకు స్పష్టం చేశారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Amid border tensions with China, Army chief tells field commanders to be prepared for any 'eventuality'
సర్వ సన్నద్ధంగా ఉండాలని కమాండర్లకు నరవాణే స్పష్టం

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమాండర్లకు సూచించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. ప్రతిక్షణం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. చైనా-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం తేజ్​పూర్​లోని 4 కార్ప్స్​ను ఇటీవలే సందర్శించారు నరవాణే. ఆ సమయంలోనే కమాండర్లకు ఏ ఆపరేషన్​నైనా నిర్వహించేందుకు సిద్ధమై ఉండాలని చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.​

రెండు రోజల పర్యటనలో తూర్పు కమాండ్​కు వెళ్లారు సైన్యాధిపతి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా బలగాల మోహరింపుపై కమాండర్లకు వివరించారు.

వాయుసేన వైస్ చీఫ్​ సందర్శన..

లద్దాక్​ సెక్టార్​లోని ఫార్వర్డ్ ఎయిర్​బేస్​లను భారత వైమానిక దళ వైస్​ చీఫ్​ ఎయిర్ మార్షల్​ హెచ్​ఎస్ అరోరా శుక్రవారం సందర్శించారు. ఫార్వర్డ్​ ఏరియాస్​లో మోహరించిన యుద్ధ వాహనాల సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చినూక్​, అపాచీ యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.

చైనాకు దీటుగా తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి 40వేల బలగాలకుపైగా మోహరించింది భారత్. డ్రాగన్​ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధమైంది.

చర్చల్లో కుదిరిన పరస్పర అంగీకారం ప్రకారం ఫింగర్​ ఏరియా ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు చైనా. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే తదుపరి అంశాలపై చర్చలుంటాయని భారత్​ ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి: 'భయం, అభద్రతా భావంతో దేశ ప్రజలు'

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమాండర్లకు సూచించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. ప్రతిక్షణం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. చైనా-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం తేజ్​పూర్​లోని 4 కార్ప్స్​ను ఇటీవలే సందర్శించారు నరవాణే. ఆ సమయంలోనే కమాండర్లకు ఏ ఆపరేషన్​నైనా నిర్వహించేందుకు సిద్ధమై ఉండాలని చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.​

రెండు రోజల పర్యటనలో తూర్పు కమాండ్​కు వెళ్లారు సైన్యాధిపతి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా బలగాల మోహరింపుపై కమాండర్లకు వివరించారు.

వాయుసేన వైస్ చీఫ్​ సందర్శన..

లద్దాక్​ సెక్టార్​లోని ఫార్వర్డ్ ఎయిర్​బేస్​లను భారత వైమానిక దళ వైస్​ చీఫ్​ ఎయిర్ మార్షల్​ హెచ్​ఎస్ అరోరా శుక్రవారం సందర్శించారు. ఫార్వర్డ్​ ఏరియాస్​లో మోహరించిన యుద్ధ వాహనాల సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చినూక్​, అపాచీ యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.

చైనాకు దీటుగా తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి 40వేల బలగాలకుపైగా మోహరించింది భారత్. డ్రాగన్​ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధమైంది.

చర్చల్లో కుదిరిన పరస్పర అంగీకారం ప్రకారం ఫింగర్​ ఏరియా ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు చైనా. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే తదుపరి అంశాలపై చర్చలుంటాయని భారత్​ ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి: 'భయం, అభద్రతా భావంతో దేశ ప్రజలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.