ETV Bharat / bharat

'జవాన్ల వద్ద ఆయుధాలుంటాయి.. కానీ వినియోగించరు'

author img

By

Published : Jun 18, 2020, 6:21 PM IST

లద్దాక్ సరిహద్దులో సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారన్న రాహుల్​ ప్రశ్నకు బదులిచ్చారు విదేశీ వ్వవహారాల మంత్రి ఎస్​ జయ్​శంకర్. జవాన్ల వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే భారత్​- చైనా మధ్య 1996, 2005లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడినప్పుడు వాటిని ఉపయోగించడానికి వీల్లేదని ట్విట్టర్​లో వివరించారు.

All troops on border duty always carry arms
రాహుల్​కు జై శంకర్​ కౌంటర్​- జవాన్ల వద్ద ఆయుధాలున్నాయని స్పష్టం

సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవని ప్రశ్నించిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీకి సమాధానమిచ్చారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయ్​శంకర్​. గస్తీ నిర్వహించే జవాన్ల వద్ద కచ్చితంగా ఆయుధాలు ఉంటాయని ట్విట్టర్​లో బదులిచ్చారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

  • Let us get the facts straight.

    All troops on border duty always carry arms, especially when leaving post. Those at Galwan on 15 June did so. Long-standing practice (as per 1996 & 2005 agreements) not to use firearms during faceoffs. https://t.co/VrAq0LmADp

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" సరిహద్దులో విధులు నిర్వహించే బలగాల వద్ద ఎల్లప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ప్రత్యేకించి పోస్టులను వదిలి వెళ్లినప్పడు. 15వ తేదీ గాల్వన్​ లోయలో ఘటన జరిగినప్పుడూ సైనికులు వద్ద ఆయుధాలున్నాయి. 1996, 2005లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు ఎదురుపడినప్పుడు వాటిని ఉపయోగించడానికి వీల్లేదు."

-ఎస్​ జయ్​శంకర్, విదేశీ వ్యవహారాల మంత్రి

భాజపా ధ్వజం..

లద్దా​క్ సరిహద్దులో ఘటనకు సంబంధించిన విషయంపై రాజకీయ దుష్ప్రచారం ఆపాలని భాజపా కోరింది. రాహుల్ లాంటి బాధ్యతారాహిత్యమైన నాయకుడ్ని దేశం ఎన్నడూ చూడలేదని భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ధ్వజమెత్తారు. ట్విట్టర్​ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించి రాహుల్ అపరిపక్వతతో, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సరిహద్దు విషయంపై చర్చించేందుకు అఖిల పక్ష భేటీని శుక్రవారం నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు.

" ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ మాట్లాడితే దేశం మూడు 'సీ'లపై పోరాటం చేస్తుంది. అవి కరోనా వైరస్, చైనా, కాంగ్రెస్​. దేశ సమగ్రత విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. రాహుల్​ ఎవరినీ నమ్మరు. ప్రధాని, రక్షణ మంత్రి, చివరకు సైన్యాధిపతిపై కూడా ఆయనకు విశ్వాసం లేదు. తప్పుడు రాజకీయ ప్రచారాన్ని ఆపాలి. మీ లాంటి నాయకులను దేశం క్షమించదు. గతంలో సర్జికల్ స్ట్రయిక్ జరిగినప్పుడూ రాహుల్​ సందేహాలు వ్యక్తం చేశారు. 2008లో కాంగ్రెస్​ హయాం లో భారత్​-చైనా మధ్య జరిగిన పరస్పర ఒప్పందాల గురించి సోనియా గాంధీ, రాహుల్ వివరించాలి. "

-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.

ఇదీ చూడండి: 'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'

సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవని ప్రశ్నించిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీకి సమాధానమిచ్చారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయ్​శంకర్​. గస్తీ నిర్వహించే జవాన్ల వద్ద కచ్చితంగా ఆయుధాలు ఉంటాయని ట్విట్టర్​లో బదులిచ్చారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

  • Let us get the facts straight.

    All troops on border duty always carry arms, especially when leaving post. Those at Galwan on 15 June did so. Long-standing practice (as per 1996 & 2005 agreements) not to use firearms during faceoffs. https://t.co/VrAq0LmADp

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" సరిహద్దులో విధులు నిర్వహించే బలగాల వద్ద ఎల్లప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ప్రత్యేకించి పోస్టులను వదిలి వెళ్లినప్పడు. 15వ తేదీ గాల్వన్​ లోయలో ఘటన జరిగినప్పుడూ సైనికులు వద్ద ఆయుధాలున్నాయి. 1996, 2005లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు ఎదురుపడినప్పుడు వాటిని ఉపయోగించడానికి వీల్లేదు."

-ఎస్​ జయ్​శంకర్, విదేశీ వ్యవహారాల మంత్రి

భాజపా ధ్వజం..

లద్దా​క్ సరిహద్దులో ఘటనకు సంబంధించిన విషయంపై రాజకీయ దుష్ప్రచారం ఆపాలని భాజపా కోరింది. రాహుల్ లాంటి బాధ్యతారాహిత్యమైన నాయకుడ్ని దేశం ఎన్నడూ చూడలేదని భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ధ్వజమెత్తారు. ట్విట్టర్​ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించి రాహుల్ అపరిపక్వతతో, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సరిహద్దు విషయంపై చర్చించేందుకు అఖిల పక్ష భేటీని శుక్రవారం నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు.

" ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ మాట్లాడితే దేశం మూడు 'సీ'లపై పోరాటం చేస్తుంది. అవి కరోనా వైరస్, చైనా, కాంగ్రెస్​. దేశ సమగ్రత విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. రాహుల్​ ఎవరినీ నమ్మరు. ప్రధాని, రక్షణ మంత్రి, చివరకు సైన్యాధిపతిపై కూడా ఆయనకు విశ్వాసం లేదు. తప్పుడు రాజకీయ ప్రచారాన్ని ఆపాలి. మీ లాంటి నాయకులను దేశం క్షమించదు. గతంలో సర్జికల్ స్ట్రయిక్ జరిగినప్పుడూ రాహుల్​ సందేహాలు వ్యక్తం చేశారు. 2008లో కాంగ్రెస్​ హయాం లో భారత్​-చైనా మధ్య జరిగిన పరస్పర ఒప్పందాల గురించి సోనియా గాంధీ, రాహుల్ వివరించాలి. "

-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.

ఇదీ చూడండి: 'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.