ETV Bharat / bharat

బంగాల్​లో అమిత్​ షా సెమినార్​- ఎన్​ఆర్​సీపై ప్రకటన!

బంగాల్​ రాజధాని కోల్​కతాలో జాతీయ పౌర జాబితాపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేడు సెమినార్​ నిర్వహించనున్నారు. బంగాల్​లో ఎన్​ఆర్​సీ చేపడతామనే ప్రకటనల నేపథ్యంలో నేటి సెమినార్​కు ప్రాధాన్యం సంతరించుకుంది.

author img

By

Published : Oct 1, 2019, 5:02 AM IST

Updated : Oct 2, 2019, 5:00 PM IST

బంగాల్​లో అమిత్​ షా సెమినార్​- ఎన్​ఆర్​సీపై ప్రకటన!
బంగాల్​లో అమిత్​ షా పర్యటన

బంగాల్​ కోల్​కతాలో నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పర్యటించనున్నారు. కోల్​కతా వేదికగా వివాదాస్పద జాతీయ పౌర జాబితా చట్ట సవరణ-2019పై సెమినార్​ నిర్వహించనున్నారు. అసోం తరహాలో బంగాల్​లోనూ ఎన్​ఆర్​సీని చేపడతామన్న ప్రకటనల నేపథ్యంలో షా సెమినార్​పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సెమినార్​లో ఏం చెప్పబోతున్నారు. ఏదైనా ప్రకటన ఉంటుందా అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బంగాల్​లో పర్యటిస్తున్నారు షా. ముందుగా కోల్​కతాలోని ఓ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న దుర్గా పూజలో పాల్గొననున్నారు. అనంతరం సెమినార్​కు హాజరవుతారు.

ఇటీవల అసోంలో విడుదలైన ఎన్​ఆర్​సీ తుది జాబితాలో సుమారు 19 లక్షల మందికి చోటు లభించలేదు. అందులో హిందూ బెంగాలీలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయంతోనే బంగాల్​లో ఇప్పటి వరకు సుమారు 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో షా సెమినార్​ నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్​ఆర్​సీపై టీఎంసీ పార్టీ సృష్టించిన దురాభిప్రాయాన్ని అమిత్​ షా సెమినార్​ తొలగిస్తుందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

"ఎన్ఆర్​సీపై రాష్ట్రంలో భయాన్ని సృష్టించింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ సమస్యపై నెలకొన్న అన్ని రకాల దురాభిప్రాయాలు, భయాలను పోగొట్టేందుకు అమిత్​ షా పూర్తి స్థాయిలో వివరించనున్నారు. బంగాల్​లో ఓటు బ్యాంకుగా చూస్తోన్న బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను కాపాడేందుకే టీఎంసీ ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తోంది."

-భాజపా రాష్ట్ర సీనియర్​ నేత.

ప్రజల ఏర్పాట్లు..

బంగాల్​లో ఎన్​ఆర్​సీని చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమత బెనర్జీ ఎన్​ఆర్​సీని రాష్ట్రంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతారనే ప్రకటనతో ఇప్పటికే అక్కడి ప్రజలు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్​ ఆఫీసులకు పెద్ద ఎత్తున చేరుకుని జనన ధ్రువీకరణ సహా అవసరమైన పత్రాలను తీసుకుంటున్నారు.

అసోం ఎన్​ఆర్​సీపై...

ఎన్​ఆర్​సీ పునరుద్ధరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది టీఎంసీ. భాజపాను బెంగాలీ వ్యతిరేకిగా పేర్కొంది. అసోం ఎన్​ఆర్​సీ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులకు చోటు లభించకపోవటం పై అమిత్​ షా, భాజపా నాయకత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ.

ఇదీ చూడండి: ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశాలుగా గాంధీ సిద్ధాంతాలు

బంగాల్​లో అమిత్​ షా పర్యటన

బంగాల్​ కోల్​కతాలో నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పర్యటించనున్నారు. కోల్​కతా వేదికగా వివాదాస్పద జాతీయ పౌర జాబితా చట్ట సవరణ-2019పై సెమినార్​ నిర్వహించనున్నారు. అసోం తరహాలో బంగాల్​లోనూ ఎన్​ఆర్​సీని చేపడతామన్న ప్రకటనల నేపథ్యంలో షా సెమినార్​పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సెమినార్​లో ఏం చెప్పబోతున్నారు. ఏదైనా ప్రకటన ఉంటుందా అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బంగాల్​లో పర్యటిస్తున్నారు షా. ముందుగా కోల్​కతాలోని ఓ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న దుర్గా పూజలో పాల్గొననున్నారు. అనంతరం సెమినార్​కు హాజరవుతారు.

ఇటీవల అసోంలో విడుదలైన ఎన్​ఆర్​సీ తుది జాబితాలో సుమారు 19 లక్షల మందికి చోటు లభించలేదు. అందులో హిందూ బెంగాలీలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయంతోనే బంగాల్​లో ఇప్పటి వరకు సుమారు 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో షా సెమినార్​ నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్​ఆర్​సీపై టీఎంసీ పార్టీ సృష్టించిన దురాభిప్రాయాన్ని అమిత్​ షా సెమినార్​ తొలగిస్తుందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

"ఎన్ఆర్​సీపై రాష్ట్రంలో భయాన్ని సృష్టించింది తృణమూల్​ కాంగ్రెస్​. ఈ సమస్యపై నెలకొన్న అన్ని రకాల దురాభిప్రాయాలు, భయాలను పోగొట్టేందుకు అమిత్​ షా పూర్తి స్థాయిలో వివరించనున్నారు. బంగాల్​లో ఓటు బ్యాంకుగా చూస్తోన్న బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను కాపాడేందుకే టీఎంసీ ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తోంది."

-భాజపా రాష్ట్ర సీనియర్​ నేత.

ప్రజల ఏర్పాట్లు..

బంగాల్​లో ఎన్​ఆర్​సీని చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమత బెనర్జీ ఎన్​ఆర్​సీని రాష్ట్రంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతారనే ప్రకటనతో ఇప్పటికే అక్కడి ప్రజలు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్​ ఆఫీసులకు పెద్ద ఎత్తున చేరుకుని జనన ధ్రువీకరణ సహా అవసరమైన పత్రాలను తీసుకుంటున్నారు.

అసోం ఎన్​ఆర్​సీపై...

ఎన్​ఆర్​సీ పునరుద్ధరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది టీఎంసీ. భాజపాను బెంగాలీ వ్యతిరేకిగా పేర్కొంది. అసోం ఎన్​ఆర్​సీ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులకు చోటు లభించకపోవటం పై అమిత్​ షా, భాజపా నాయకత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ.

ఇదీ చూడండి: ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశాలుగా గాంధీ సిద్ధాంతాలు

New Delhi, Sep 30 (ANI): Deputy Chief of Integrated Defence Staff (IDS), Lieutenant General PJS Pannu visited National War Memorial on September 30. He paid homage to the bravehearts of the country. Speaking to ANI, Lt Gen PJS Pannu said, "I have been fortunate to have been associated with this iconic structure. Forces are represented here in a manner that how much sacrifices the soldiers have made." National War Memorial was inaugurated on February 25 this year by Prime Minister Narendra Modi as a tribute to slain soldiers of Armed Forces, who have laid their lives for country post-independence.

Last Updated : Oct 2, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.