CM Revanth Reddy On Allu Arjun Arrest : పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్టైన ఆ తరువాత బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ మరోసారి స్పందించారు.
10 నుంచి 12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు : తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించారు. 2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని అన్నారు. అయినా సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారని, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారని, ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చని తెలిపారు. ఒక మహిళ చనిపోతే, 10 నుంచి 12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని వివరించారు.
'గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు' - అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్