ETV Bharat / bharat

'ఆ టికెట్ల పూర్తి రీఫండ్​ బాధ్యత విమాన సంస్థలదే'

author img

By

Published : Sep 6, 2020, 11:03 PM IST

కరోనా లాక్‌డౌన్​లో దేశ-విదేశ ప్రయాణ టికెట్లను బుక్ చేసుకున్న ప్యాసెంజర్లకు నగదును విమాన సంస్థలు పూర్తిగా రీఫండ్ ఇవ్వాల్సిందేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నగదు చెల్లించలేని స్థితిలో క్రెడిట్​ షెల్​ను ఇవ్వాలని సూచించింది. మొత్తం నగదు తిరిగి ఇవ్వాలంటూ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో.. సుప్రీంలో పిల్ వేసిన నేపథ్యంలో వివరణనిచ్చింది కేంద్రం.

Airlines to make full refund of tickets booked during lockdown period: DGCA proposes in SC
వారికి పూర్తి నగదును చెల్లించాల్సిందే: కేంద్రం

లాక్​డౌన్​ కాలంలో దేశీయ-విదేశీ ప్రయాణాల కోసం బుక్​ చేసుకున్న టికెట్లకు సంబంధించిన నగదును.. వినియోగదారులకు విమాన సంస్థలే పూర్తిగా రీఫండ్​ చేయాలని సుప్రీంకోర్టుకు ప్రతిపాదించింది డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్(డీజీసీఏ). ఇతర పరిస్థితుల్లో.. 15రోజుల్లో రీఫండ్​ చేసేందుకు విమాన సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొంది.

లాక్‌డౌన్‌లో ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీఫండ్ ఇవ్వాలంటూ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఇటీవల సుప్రీంలో పిల్ వేయగా.. దీనిపై సమాధానం చెప్పాలంటూ సుప్రీం కేంద్రానికి గతంలో సూచించింది. ఈ పిల్‌పై కేంద్రం స్పందిస్తూ.. మొదటి, రెండొవ లాక్​డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తిగా రీఫండ్​ ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఒకవేళ విమాన సంస్థలు ఆర్థిక లావాదేవీల కారణంగా నగదును తిరిగి చెల్లించలేని పరిస్థితిలో.. నగదుకు సమానంగా క్రెడిట్​ షెల్​ ఇవ్వాలని సూచించింది.

  • దీని ప్రకారం 2021 మార్చి 31 వరకు సదరు ప్రయాణికుడు డబ్బు చెల్లించకుండా మరోసారి ప్రయాణించవచ్చు.
  • ఒకవేళ ప్రయాణికుడు క్రెడిట్ షెల్ కంటే ఎక్కువ విలువైన టికెట్ కొనాలనుకుంటే, అతను అదనపు సొమ్మును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
  • క్రెడిట్​ షెల్​ కంటే తక్కువ విలువ గల టికెట్​ తీసుకుంటే.. మిగిలిన సొమ్మును సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ తిరిగి ఇచ్చే సొమ్ము ఆలస్యమైతే... అందుకు తగిన పరిహారం సంస్థ చెల్లించాల్సి వస్తుంది.
  • టిక్కెట్​ రద్దు చేసుకున్నప్పటి నుంచి జూన్​ 30 వరకు అసలు నగదుకు 0.5శాతం అదనంగా.. జులై 1 నుంచి 2021 మార్చి వరకు 0.75 శాతం ప్రతి నెల అదనంగా చెల్లించాలని కేంద్రం వెల్లడించింది.

మార్చి 25 నుంచి మే 3 వరకు విమాన టికెట్లను బుక్​ చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందని డీజీసీఏ పేర్కొంది.

లాక్​డౌన్​ కాలంలో దేశీయ-విదేశీ ప్రయాణాల కోసం బుక్​ చేసుకున్న టికెట్లకు సంబంధించిన నగదును.. వినియోగదారులకు విమాన సంస్థలే పూర్తిగా రీఫండ్​ చేయాలని సుప్రీంకోర్టుకు ప్రతిపాదించింది డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్(డీజీసీఏ). ఇతర పరిస్థితుల్లో.. 15రోజుల్లో రీఫండ్​ చేసేందుకు విమాన సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొంది.

లాక్‌డౌన్‌లో ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫుల్ రీఫండ్ ఇవ్వాలంటూ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఇటీవల సుప్రీంలో పిల్ వేయగా.. దీనిపై సమాధానం చెప్పాలంటూ సుప్రీం కేంద్రానికి గతంలో సూచించింది. ఈ పిల్‌పై కేంద్రం స్పందిస్తూ.. మొదటి, రెండొవ లాక్​డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తిగా రీఫండ్​ ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఒకవేళ విమాన సంస్థలు ఆర్థిక లావాదేవీల కారణంగా నగదును తిరిగి చెల్లించలేని పరిస్థితిలో.. నగదుకు సమానంగా క్రెడిట్​ షెల్​ ఇవ్వాలని సూచించింది.

  • దీని ప్రకారం 2021 మార్చి 31 వరకు సదరు ప్రయాణికుడు డబ్బు చెల్లించకుండా మరోసారి ప్రయాణించవచ్చు.
  • ఒకవేళ ప్రయాణికుడు క్రెడిట్ షెల్ కంటే ఎక్కువ విలువైన టికెట్ కొనాలనుకుంటే, అతను అదనపు సొమ్మును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
  • క్రెడిట్​ షెల్​ కంటే తక్కువ విలువ గల టికెట్​ తీసుకుంటే.. మిగిలిన సొమ్మును సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ తిరిగి ఇచ్చే సొమ్ము ఆలస్యమైతే... అందుకు తగిన పరిహారం సంస్థ చెల్లించాల్సి వస్తుంది.
  • టిక్కెట్​ రద్దు చేసుకున్నప్పటి నుంచి జూన్​ 30 వరకు అసలు నగదుకు 0.5శాతం అదనంగా.. జులై 1 నుంచి 2021 మార్చి వరకు 0.75 శాతం ప్రతి నెల అదనంగా చెల్లించాలని కేంద్రం వెల్లడించింది.

మార్చి 25 నుంచి మే 3 వరకు విమాన టికెట్లను బుక్​ చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందని డీజీసీఏ పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.