ఎరోసోల్స్గా పిలిచే చిన్నపాటి తుంపర్ల ద్వారా.. గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పలు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య ప్రక్రియల్లో భాగంగా ఇవి ఉత్పత్తి అయ్యే అవకాశముందని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కమార్ చౌబే.. పార్లమెంట్ వేదికగా ఈ ప్రకటన చేశారు. దీని ద్వారా.. గాలిలో వైరస్ వ్యాప్తిపై మరింత స్పష్టత వచ్చింది.
ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ...
దేశంలోని 77శాతం యాక్టివ్ కేసులు.. కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు పేర్కొన్నారు అశ్విని చౌబే. అవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణా, అసోం, కేరళ అని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థమైన వ్యాక్సిన్ను తీసుకురావడానికి కేంద్రం, వైద్య సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఇదీ చూడండి:- టాయిలెట్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే...