ETV Bharat / bharat

ఎయిరిండియాకు ప్రముఖుల ప్రయాణాల భారం

ఎయిరిండియా సంస్థకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల ప్రయాణ ఖర్చులు కూడా భారంగా మారాయి. వీరి ప్రయాణాలకు ఏర్పాటు చేసిన వీవీఐపీ ఛార్టర్​ విమానాలకు ఇప్పటి వరకు సుమారు రూ.822 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తేలింది.

author img

By

Published : Feb 6, 2020, 8:20 PM IST

Updated : Feb 29, 2020, 10:54 AM IST

air-india-has-to-recover-over-rs-822-crore-for-providing-vvip-charter-flights-rti
ప్రధాని వల్లే ఎయిరిండియాకు అప్పులు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. ప్రముఖుల ప్రయాణ ఖర్చు కూడా భారంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల పర్యటనలకు ఎయిరిండియా వీవీఐపీ ఛార్టర్‌ విమానాలను ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన ఖర్చులను సంబంధిత మంత్రిత్వ శాఖలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల సుమారు 822 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఎయిరిండియా తెలిపింది.

వీవీఐపీ ప్రయాణాల ఖర్చు, బకాయిలు తెలపాల్సిందిగా లోకేష్‌ బాత్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఎయిరిండియాను కోరారు. 2019 నవంబరు 30 వరకు ప్రభుత్వం.. ఎయిరిండియాకు రూ.822కోట్లు బకాయి పడ్డట్లు ఆ సంస్థ తెలిపింది. విదేశీ ప్రముఖులను తీసుకెళ్లినందుకు 12 కోట్ల 65 లక్షలు బకాయి ఉన్నట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన 236 కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఇతర కారణాలు..

అధిక వడ్డీల భారం, ఇతర సంస్థలు తక్కువ ధరలకు ప్రయాణాలు అందించటం, రూపాయి విలువ పతనమవ్వటం, సంస్థ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవటం వంటి ఇతర కారణాలూ.. ఎయిరిండియాను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. ప్రముఖుల ప్రయాణ ఖర్చు కూడా భారంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల పర్యటనలకు ఎయిరిండియా వీవీఐపీ ఛార్టర్‌ విమానాలను ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన ఖర్చులను సంబంధిత మంత్రిత్వ శాఖలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల సుమారు 822 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఎయిరిండియా తెలిపింది.

వీవీఐపీ ప్రయాణాల ఖర్చు, బకాయిలు తెలపాల్సిందిగా లోకేష్‌ బాత్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఎయిరిండియాను కోరారు. 2019 నవంబరు 30 వరకు ప్రభుత్వం.. ఎయిరిండియాకు రూ.822కోట్లు బకాయి పడ్డట్లు ఆ సంస్థ తెలిపింది. విదేశీ ప్రముఖులను తీసుకెళ్లినందుకు 12 కోట్ల 65 లక్షలు బకాయి ఉన్నట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన 236 కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

ఇతర కారణాలు..

అధిక వడ్డీల భారం, ఇతర సంస్థలు తక్కువ ధరలకు ప్రయాణాలు అందించటం, రూపాయి విలువ పతనమవ్వటం, సంస్థ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవటం వంటి ఇతర కారణాలూ.. ఎయిరిండియాను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD27
DL-COURT-TERROR FUNDING
Delhi court dismisses bail plea of ex-J-K MLA Rashid Engineer in terror funding case
          New Delhi, Feb 6 (PTI) A Delhi court Thursday dismissed the bail application of former independent MLA in Jammu and Kashmir, Sheikh Abdul Rashid, arrested in a case related to terror-funding activities in the Valley.
         Popularly known as Rashid Engineer, he was a legislator from the Langate Assembly seat in north Kashmir and is the first mainstream politician to have been arrested by the NIA in the case.
         Special Judge Praveen Kumar rejected the application saying the prosecution has successfully established that "there exists reasonable grounds to believe the accusations against the accused are prima facie true".
         Rashid was arrested on August 9 last year, since he was unable to give any convincing answers to the questions, the NIA had said. PTI UK
SA
02061738
NNNN
Last Updated : Feb 29, 2020, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.