ETV Bharat / bharat

పార్టీలతో సంబంధం లేదు: ప్రధానికి రైతుల లేఖ - ప్రధానికి రైతు సంఘం లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​లకు రైతులు లేఖ రాశారు. ఆల్​ ఇండియా కిసాన్​ సంఘర్ష్ సమన్వయ​ కమిటీ(ఏఐకేఎస్​సీసీ) రాసిన ఈ లేఖలో తమ నిరసనలకు పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతుల నిరసనలకు ప్రతిపక్షాలే కారణమన్న కేంద్రం వ్యాఖ్యలకు బదులుగా ఈ లేఖను రాశారు.

aikcc letter to modi and tomar, aikcc letter
ప్రధానికి రైతు సంఘాల లేఖ
author img

By

Published : Dec 20, 2020, 5:30 AM IST

Updated : Dec 20, 2020, 6:43 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని రైతులు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సంఘాల్లో ఒకటైన ఆల్​ ఇండియా కిసాన్​ సంఘర్ష్ సమన్వయ​ కమిటీ(ఏఐకేఎస్​సీసీ).. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్​లకు లేఖ రాసింది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ఇటీవల పలు సందర్భాల్లో మోదీ, తోమర్​లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏఐకేఎస్​సీసీ ఈ విధంగా స్పందించింది.

"రాజకీయ పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిజానికి మా ఉద్యమం ప్రతిపక్షాల వైఖరిని మారేలా చేసింది."

-ఏఐకేఎస్​సీసీ

ప్రధాని వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్​ రైతులను ఉద్దేశిస్తూ శుక్రవారం చేసిన ప్రసంగంలో.. రైతు నిరసనలపై ఆరోపణలు చేశారు. ఈ ఆందోళనల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని.. కర్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి తోమర్ కూడా రైతులకు గురువారం రాసిన లేఖలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. చర్చ.. ప్రధాన సమస్యలపై జరగకుండా దారి మళ్లిస్తున్నారంటూ ఏఐకేఎస్​​సీసీ మంత్రి తోమర్​కు రాసిన లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి : దుష్ప్రచారాలు నమ్మొద్దు: రైతులకు తోమర్​ లేఖ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని రైతులు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సంఘాల్లో ఒకటైన ఆల్​ ఇండియా కిసాన్​ సంఘర్ష్ సమన్వయ​ కమిటీ(ఏఐకేఎస్​సీసీ).. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్​లకు లేఖ రాసింది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ఇటీవల పలు సందర్భాల్లో మోదీ, తోమర్​లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏఐకేఎస్​సీసీ ఈ విధంగా స్పందించింది.

"రాజకీయ పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిజానికి మా ఉద్యమం ప్రతిపక్షాల వైఖరిని మారేలా చేసింది."

-ఏఐకేఎస్​సీసీ

ప్రధాని వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్​ రైతులను ఉద్దేశిస్తూ శుక్రవారం చేసిన ప్రసంగంలో.. రైతు నిరసనలపై ఆరోపణలు చేశారు. ఈ ఆందోళనల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని.. కర్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి తోమర్ కూడా రైతులకు గురువారం రాసిన లేఖలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. చర్చ.. ప్రధాన సమస్యలపై జరగకుండా దారి మళ్లిస్తున్నారంటూ ఏఐకేఎస్​​సీసీ మంత్రి తోమర్​కు రాసిన లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి : దుష్ప్రచారాలు నమ్మొద్దు: రైతులకు తోమర్​ లేఖ

Last Updated : Dec 20, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.