ETV Bharat / bharat

భారత్​ భేరి: "నీది, నాది ఒకే కథ..!"

author img

By

Published : Mar 24, 2019, 6:35 PM IST

వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తోందంటూ ఇప్పటివరకు విమర్శలు ఎదుర్కొన్న డీఎంకేకు ఇకపై ఆ ఇబ్బంది లేదు. ఇందుకు కారణం... వారసులకు టికెట్లు ఇవ్వకపోవడం కాదు. దశాబ్దాలుగా డీఎంకేను తప్పుబట్టే అన్నాడీఎంకే ఇప్పుడు వారసులను బరిలోకి దింపింది.

వారసులను బరిలోకి దింపిన అన్నాడీఎంకే
వారసులను బరిలోకి దింపిన అన్నాడీఎంకే
వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తోందన్న విమర్శ డీఎంకేపై ఇప్పటిది కాదు. దివంగత జయలలిత తరచూ అదే అంశంపై ప్రత్యర్థి పార్టీని తప్పుబట్టేవారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో పరిస్థితులు మారాయి. సార్వత్రిక ఎన్నికల వేళ బంధు ప్రీతి పెరిగింది. ప్రముఖ నేతల కుమారులకు టికెట్లు ఇచ్చింది అధినాయకత్వం. ఇందుకు విశ్వసనీయత, కష్టపడే తత్వమే ప్రామాణికం కానీ... వారసత్వం కాదంటూ వారిని వెనకేసుకొచ్చే పనిలో పడింది.

డీఎంకే 6... అన్నాడీఎంకే 4...

తమిళనాడులో 39 లోక్​సభ నియోజకవర్గాలు. ఏప్రిల్​ 19న పోలింగ్​. సీట్ల సర్దుబాటు తర్వాత అన్నాడీఎంకే 20, డీఎంకేకు 20 సీట్లు మాత్రమే మిగిలాయి. అన్నాడీఎంకే 4 సీట్లు ప్రముఖ నేతల కుమారులకే కేటాయించింది. వారిలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వం కుమారుడు ఒకరు. ప్రతిపక్ష డీఎంకే 6 సీట్లు వారసులకే ఇచ్చింది.

పన్నీర్​ సెల్వం కుమారుడికి టికెట్

మంత్రి డి.జయకుమార్​ కుమారుడు, సిట్టింగ్​ ఎంపీ జయవర్ధన్​కు మరోమారు దక్షిణ చెన్నై స్థానం నుంచి అవకాశం కల్పించింది అన్నాడీఎంకే. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్​ పీహెచ్​ పాండియన్​ వారసుడు మనోజ్​ పాండియన్​కు​ సీటు ఖరారు చేసింది. టికెట్​ లభించిన మరో ఇద్దరు వారసుల నేతలు పన్నీర్​ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్​ కుమార్​, వీవీ రాజన్​ వారసుడు వీవీఆర్​ రాజ్​సత్యన్​.

"జయవర్ధన్​, మనోజ్​ పాండియన్​ను జయలలిత ఉన్నప్పుడు లోక్​సభ, రాజ్యసభలకు నామినేట్​ చేశారు. పార్టీలో రాజకీయ వారసత్వం అనేదే లేదు. విశ్వసనీయత, కష్టపడే తత్వాన్ని బట్టే అభ్యర్థులను ఎంపిక చేశాం."

-ఆర్​ఎం బాబు మురుగవేల్​, అన్నాడీఎంకే అధికారిక ప్రతినిధి

డీఎంకేలో కరుణానిధి మరణానంతరం వారసత్వపోరు తీవ్రమైంది. కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో కుమారుడు అళగిరిని డీఎంకే 2014లో సస్పెండ్​ చేసింది. కుమార్తె కనిమొళి 2007 నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. జులైలో ఆమె పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ట్యూటికొరిన్​ నుంచి పోటీ చేస్తున్నారు కనిమొళి. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్​ సెంట్రల్​ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు.

డీఎంకే నేత టీఆర్​ బాలు కుమారుడు టీఆర్​బీ రాజాకు టికెట్​ ఇచ్చింది డీఎంకే అధిష్ఠానం. ఐ. పెరియసామి కుమారుడు ఐపీ సెంథిల్​ కుమార్​కూ టికెట్​ ఇచ్చారు. ఈ ఇద్దరు యువ నేతలు ప్రస్తుతం శాసన సభ్యులు.​

"పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నవారికే టికెట్లు ఇచ్చాం. బయటి నుంచి వచ్చిన ఏ వ్యక్తినీ ఎంపిక చేయలేదు."
-కనిమొళి, డీఎంకే నాయకురాలు

ఇవీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

వారసులను బరిలోకి దింపిన అన్నాడీఎంకే
వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తోందన్న విమర్శ డీఎంకేపై ఇప్పటిది కాదు. దివంగత జయలలిత తరచూ అదే అంశంపై ప్రత్యర్థి పార్టీని తప్పుబట్టేవారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో పరిస్థితులు మారాయి. సార్వత్రిక ఎన్నికల వేళ బంధు ప్రీతి పెరిగింది. ప్రముఖ నేతల కుమారులకు టికెట్లు ఇచ్చింది అధినాయకత్వం. ఇందుకు విశ్వసనీయత, కష్టపడే తత్వమే ప్రామాణికం కానీ... వారసత్వం కాదంటూ వారిని వెనకేసుకొచ్చే పనిలో పడింది.

డీఎంకే 6... అన్నాడీఎంకే 4...

తమిళనాడులో 39 లోక్​సభ నియోజకవర్గాలు. ఏప్రిల్​ 19న పోలింగ్​. సీట్ల సర్దుబాటు తర్వాత అన్నాడీఎంకే 20, డీఎంకేకు 20 సీట్లు మాత్రమే మిగిలాయి. అన్నాడీఎంకే 4 సీట్లు ప్రముఖ నేతల కుమారులకే కేటాయించింది. వారిలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వం కుమారుడు ఒకరు. ప్రతిపక్ష డీఎంకే 6 సీట్లు వారసులకే ఇచ్చింది.

పన్నీర్​ సెల్వం కుమారుడికి టికెట్

మంత్రి డి.జయకుమార్​ కుమారుడు, సిట్టింగ్​ ఎంపీ జయవర్ధన్​కు మరోమారు దక్షిణ చెన్నై స్థానం నుంచి అవకాశం కల్పించింది అన్నాడీఎంకే. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్​ పీహెచ్​ పాండియన్​ వారసుడు మనోజ్​ పాండియన్​కు​ సీటు ఖరారు చేసింది. టికెట్​ లభించిన మరో ఇద్దరు వారసుల నేతలు పన్నీర్​ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్​ కుమార్​, వీవీ రాజన్​ వారసుడు వీవీఆర్​ రాజ్​సత్యన్​.

"జయవర్ధన్​, మనోజ్​ పాండియన్​ను జయలలిత ఉన్నప్పుడు లోక్​సభ, రాజ్యసభలకు నామినేట్​ చేశారు. పార్టీలో రాజకీయ వారసత్వం అనేదే లేదు. విశ్వసనీయత, కష్టపడే తత్వాన్ని బట్టే అభ్యర్థులను ఎంపిక చేశాం."

-ఆర్​ఎం బాబు మురుగవేల్​, అన్నాడీఎంకే అధికారిక ప్రతినిధి

డీఎంకేలో కరుణానిధి మరణానంతరం వారసత్వపోరు తీవ్రమైంది. కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో కుమారుడు అళగిరిని డీఎంకే 2014లో సస్పెండ్​ చేసింది. కుమార్తె కనిమొళి 2007 నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. జులైలో ఆమె పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ట్యూటికొరిన్​ నుంచి పోటీ చేస్తున్నారు కనిమొళి. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్​ సెంట్రల్​ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు.

డీఎంకే నేత టీఆర్​ బాలు కుమారుడు టీఆర్​బీ రాజాకు టికెట్​ ఇచ్చింది డీఎంకే అధిష్ఠానం. ఐ. పెరియసామి కుమారుడు ఐపీ సెంథిల్​ కుమార్​కూ టికెట్​ ఇచ్చారు. ఈ ఇద్దరు యువ నేతలు ప్రస్తుతం శాసన సభ్యులు.​

"పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నవారికే టికెట్లు ఇచ్చాం. బయటి నుంచి వచ్చిన ఏ వ్యక్తినీ ఎంపిక చేయలేదు."
-కనిమొళి, డీఎంకే నాయకురాలు

ఇవీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

AP Video Delivery Log - 1200 GMT News
Sunday, 24 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1157: UK Lidington AP Clients Only 4202533
MP dismisses coup reports, voices support for May
AP-APTN-1150: Mozambique Cyclone AP Clients Only 4202531
Death toll rises in Mozambique, UN appeals for aid
AP-APTN-1052: UK Brexit No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4202526
Hammond: May ouster will hinder Brexit deal
AP-APTN-1042: Gaza Violence AP Clients Only 4202524
Palestinian dies after Israeli fire at Gaza protest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.